Saturday, February 6, 2016

డివిజన్ల వారీగా ఫలితాలు ఇవీ..


డివిజన్ నెంబరుడివిజన్ పేరుగెలిచిన అభ్యర్థిపార్టీమెజారిటీ
1కాప్రాస్వర్ణరాజు శివమణిటీఆర్ఎస్5029
2ఏఎస్ రావు నగర్పావని రెడ్డిటీఆర్ఎస్1366
3చర్లపల్లిబొంతు రామ్మోహన్ రావుటీఆర్ఎస్7869
4మీర్ పేట్ హెచ్ బీగొల్లూరి అంజయ్యటీఆర్ఎస్5707
5మల్లాపుర్దేవేందర్ రెడ్డిటీఆర్ఎస్7989
6నాచారంశాంతికాంగ్రెస్152
7చిలకానగర్సరస్వతిటీఆర్ఎస్7982
8హబ్సిగూడస్వప్న సుభాష్ రెడ్డిటీఆర్ఎస్7468
9రామాంతపూర్ (ఈస్ట్)జ్యోస్నా నాగేశ్వరరావుటీఆర్ఎస్5157
10ఉప్పల్అనలా రెడ్డిటీఆర్ఎస్1148
11నాగోల్సంగీత ప్రశాంత్ గౌడ్టీఆర్ఎస్6077
12మన్సూర్ బాద్విఠల్ రెడ్డిటీఆర్ఎస్5949
13హయత్ నగర్తిరుమల్ రెడ్డిటీఆర్ఎస్2773
14బీఎన్ రెడ్డి నగర్లక్ష్మీ ప్రసన్న గౌడ్టీఆర్ఎస్6559
15వనస్థలిపురంరాజశేఖర్ రెడ్డిటీఆర్ఎస్8281
16హస్తినాపురంపద్మా నాయక్టీఆర్ఎస్9118
17చంపాపేట్రమణా రెడ్డిటీఆర్ఎస్146
18లింగోజిగూడశ్రీనివాస రావుటీఆర్ఎస్7331
19సరూర్ నగర్అనితా దయాకర్ రెడ్డిటీఆర్ఎస్6211
20ఆర్ కే పురంరాధారెడ్డిబీజేపీ1962
21కొత్తపేట్సాగర్ రెడ్డిటీఆర్ఎస్5198
22చైతన్యపురిజీ విఠల్ రెడ్డిటీఆర్ఎస్4505
23గడ్డిఅన్నారంప్రవీణ్ ముదిరాజ్టీఆర్ఎస్6132
24సైదాబాద్సింగిరెడ్డి స్వర్ణ లతా రెడ్డిటీఆర్ఎస్8277
25ముసారాంబాగ్తీగల సునీతా రెడ్డిటీఆర్ఎస్5714
26ఓల్డ్ మలక్ పేట్అంజూమ్ ఫాతిమాఎంఐఎం2741
27అక్బర్ బాగ్సయ్యద్ మిన్హారుద్దీన్ఎంఐఎం781
28అజామ్ పురాఆయేషా జహన్ నసీంఎంఐఎం1571
29చవానీమహ్మద్ మూర్తజా అలీఎంఐఎం9339
30డబీర్ పురారియాజ్ ఉల్ హసన్ఎంఐఎం6473
31రెయిన్ బజార్వాజిద్ అలీ ఖాన్ఎంఐఎం8099
32ఫత్తార్ ఘాట్సయ్యద్ సోహైల్ ఖద్రీఎంఐఎం13151
33మొఘల్ పురాఅమ్తల్ అలీఎంఐఎం6163
34తలాబ్ చన్ చలంనస్రీన్ సుల్తానాఎంఐఎం11495
35గౌలిపురాఆలె లలితబీజేపీ1434
36లలితాబాగ్అలీ షరీఫ్ఎంఐఎం3043
37కుర్మాగూడసమీనా బేగంఎంఐఎం4210
38ఐఎస్ సదన్స్వప్న సుందర్ రెడ్డిటీఆర్ఎస్11401
39సంతోష్ నగర్ముజాఫర్ హుస్సేన్ఎంఐఎం9021
40రియాసత్ నగర్ముస్తఫాబేగ్ఎంఐఎం4221
41కాంచన్ బాగ్రేష్మా ఫాతిమాఎంఐఎం6293
42బార్కాస్షబానా బేగంఎంఐఎం6893
43చాంద్రాయాణగుట్టఅబ్దుల్ వాహెబ్ఎంఐఎం5763
44ఉప్పుగూడఅబ్దుల్ సమీద్ బిన్ అబ్ద్ఎంఐఎం4238
45జంగం మెట్అబ్దుల్ రెహ్మాన్ఎంఐఎం1197
46ఫలక్ నుమాతారాబాయ్ఎంఐఎం11387
47నవాబ్ సాహెబ్ కుంటష్రీన్ ఖాతున్ఎంఐఎం11956
48శాలిబండముస్తఫా ఆలీఎంఐఎం7198
49ఘన్సీ బజార్రేణు సోనిబీజేపీ859
50బేగంబజార్శంకర్ యాదవ్బీజేపీ7435
51గోషామహల్‌ముఖేశ్ సింగ్టీఆర్ఎస్78
52పురానా పూల్రాజమోహన్ఎంఐఎం2877
53దూద్‌బౌలిగఫార్ఎంఐఎం7596
54జహనుమాఖాజ ముబాషీరుద్దీన్ఎంఐఎం13718
55రామ్నాస్ పురామహ్మద్ ముబెన్ఎంఐఎం12550
56కిషన్‌బాగ్మహ్మద్ సలీంఎంఐఎం8288
57సులేమాన్ నగర్అబీదా సుల్తానాఎంఐఎం12980
58శాస్త్రిపురంమిసబ్ ఉద్దీన్ఎంఐఎం9349
59మైలార్‌దేవ్‌పల్లిటీ.శ్రీనివాసరెడ్డిటీఆర్ఎస్5474
60రాజేంద్రనగర్కే. శ్రీలతటీఆర్ఎస్3998
61అత్తాపూర్విజయ్ జంగయ్యటీఆర్ఎస్7774
62జియాగూడకృష్ణటీఆర్ఎస్3762
63మంగళ్‌హట్పరమేశ్వరి సింగ్టీఆర్ఎస్9376
64దత్తాత్రేయయూసఫ్ఎంఐఎం7442
65కార్వాన్రాజేందర్ యాదవ్ఎంఐఎం573
66లంగర్‌హౌస్అమీనా బేగంఎంఐఎం302
67గోల్కొండహఫ్పియా హనీఫ్ఎంఐఎం9385
68టోలీ చౌకిఆయేషా హుమ్రాఎంఐఎం8982
69నానల్‌నగర్నస్రీద్దీన్ఎంఐఎం6015
70మెహిదీపట్నంమాజిద్ హుస్సేన్ఎంఐఎం3126
71గుడిమల్కాపూర్బంగారి ప్రకాశ్టీఆర్ఎస్5568
72ఆసిఫ్‌నగర్ఫాతిమా అంజూంఎంఐఎం4782
73విజయ్ నగర్సల్మా అమీన్ఎంఐఎం2286
74అహ్మద్‌నగర్ఆయేషా రుబీనాఎంఐఎం6647
75రెడ్‌హిల్స్ఆయేషా ఫాతిమాఎంఐఎం1237
76మల్లేపల్లితర్నుమ్ నాజ్ఎంఐఎం4560
77జాంబాగ్మోహన్ఎంఐఎం5
78గన్‌ఫౌండ్రీమమతా గుప్తాటీఆర్ఎస్3353
79హిమాయత్‌నగర్హేమలత యాదవ్టీఆర్ఎస్1691
80కాచిగూడచైతన్య కన్నా యాదవ్టీఆర్ఎస్1811
81నల్లకుంటశ్రీదేవిటీఆర్ఎస్10426
82గోల్నాకకాలేరు పద్మటీఆర్ఎస్5967
83అంబర్‌పేటపులి జగన్టీఆర్ఎస్1505
84బాగ్ అంబర్‌పేటపద్మావతి డి.పి రెడ్డిటీఆర్ఎస్4870
85అడిక్‌మెట్హేమలతటీఆర్ఎస్6350
86ముషీరాబాద్భాగ్యలక్ష్మి యాదవ్టీఆర్ఎస్4121
87రాంనగర్వీ.శ్రీనివాస రెడ్డిటీఆర్ఎస్11503
88భోలక్‌పూర్రామారావుటీఆర్ఎస్2909
89గాంధీనగర్పద్మా నరేశ్టీఆర్ఎస్5104
90కవాడిగూడలాస్య నందితటీఆర్ఎస్11388
91ఖైరతాబాద్పి. విజయా రెడ్డిటీఆర్ఎస్12373
92వెంకటేశ్వరకాలనీకవితా గోవర్దన్ రెడ్డిటీఆర్ఎస్8181
93బంజారాహిల్స్గద్వాల్ విజయ లక్ష్మిటీఆర్ఎస్7507
94షేక్‌పేటరషీద్ ఫరజుద్దీన్ఎంఐఎం658
95జూబ్లీహిల్స్కాజసూర్యనారాయణటీఆర్ఎస్4039
96యూసుఫ్‌గూడసంజయ్ గౌడ్టీఆర్ఎస్264
97సోమాజిగూడవిజయలక్ష్మిటీఆర్ఎస్3515
98అమీర్‌పేటశేషు కుమారిటీఆర్ఎస్2555
99వెంగళ్‌రావునగర్మనోహర్టీఆర్ఎస్1183
100సనత్‌నగర్లక్ష్మి బాల్ రెడ్డిటీఆర్ఎస్4085
101ఎర్రగడ్డషహీనా బేగంఎంఐఎం951
102రహ్మత్‌నగర్ఎం.ఎ షఫిటీఆర్ఎస్2330
103బోరబండబాబా ఫసీవుద్దీన్టీఆర్ఎస్4511
104కొండాపూర్హమీద్ పటేల్టీఆర్ఎస్7334
105గచ్చిబౌలిసాయిబాబాటీఆర్ఎస్5860
106శేరిలింగంపల్లినరేంద్ర యాదవ్టీఆర్ఎస్8643
107మాదాపూర్వి.జగదీశ్ గౌడ్టీఆర్ఎస్6005
108మియాపూర్మేకా రమేశ్టీఆర్ఎస్1030
109హఫీజ్‌పేటపూజిత జగదీష్ గౌడ్టీఆర్ఎస్8619
110చందానగర్నవతా రెడ్డిటీఆర్ఎస్2831
111భారతి నగర్సింధు ఆదర్శ్ రెడ్డిటీఆర్ఎస్168
112రామ చంద్రాపురంఅంజయ్యటీఆర్ఎస్5591
113పటాన్‌చెఱుశంకర్ యాదవ్కాంగ్రెస్1386
114కేపీహెచ్‌బీ కాలనీశ్రీనివాస రావుటీడీపీ2735
115బాలాజీనగర్కావ్యా రెడ్డిటీఆర్ఎస్5349
116అల్లాపూర్సబీహా బేగంటీఆర్ఎస్4772
117మూసాపేటటీ. శ్రావణ్ కుమార్టీఆర్ఎస్4050
118ఫతేనగర్సతీష్ బాబుటీఆర్ఎస్5415
119ఓల్డ్ బోయిన్‌పల్లినర్సింగ్ యాదవ్టీఆర్ఎస్8092
120బాలానగర్నరేంద్ర చారిటీఆర్ఎస్8820
121కూకట్‌పల్లిజూపల్లి సత్యనారాయణ రావుటీఆర్ఎస్8998
122వివేకానందనగర్లక్ష్మీ బాయిటీఆర్ఎస్1492
123హైదర్‌నగర్జానకీ రామరాజుటీఆర్ఎస్439
124ఆల్విన్‌కాలనీవెంకటేశ్ గౌడ్టీఆర్ఎస్4282
125గాజులరామారంశేషగిరిటీఆర్ఎస్9480
126జగద్గిరిగుట్టకొలుకుల జగన్టీఆర్ఎస్5559
127రంగారెడ్డినగర్విజయ శేఖర్ గౌడ్టీఆర్ఎస్8601
128చింతల్రషీదా బేగంటీఆర్ఎస్4763
129సూరారంసత్యనారాయణటీఆర్ఎస్4660
130సుభాష్‌నగర్శాంతి రాజశ్రీ రాజేందర్ రెడ్డిటీఆర్ఎస్8895
131కుత్బుల్లాపూర్కూన గౌరీశ్ పారిజాతటీఆర్ఎస్1729
132జీడిమెట్లపద్మా ప్రతాప్ గౌడ్టీఆర్ఎస్3614
133మచ్చబొల్లారంజితేంద్ర నాథ్టీఆర్ఎస్9501
134అల్వాల్విజయ శాంతి రెడ్డిటీఆర్ఎస్6354
135వెంకటాపురంసబితా కిషోర్టీఆర్ఎస్7554
136నేరెడ్‌మెట్కటిక నేని శ్రీదేవిటీఆర్ఎస్7135
137వినాయకనగర్పుష్పలతా రెడ్డిటీఆర్ఎస్8655
138మౌలాలిఫాతిమా అమీనుద్దీన్టీఆర్ఎస్1962
139ఈస్ట్ ఆనంద్‌బాగ్ఆకుల నర్సింగ్ రావుటీఆర్ఎస్6707
140మల్కాజిగిరిజగదీష్ గౌడ్టీఆర్ఎస్4367
141గౌతమ్‌నగర్శిరీషా జితేందర్ రెడ్డిటీఆర్ఎస్6807
142అడ్డగుట్టవిజయ కుమారిటీఆర్ఎస్14265
143తార్నాకసరస్వతి హరిటీఆర్ఎస్12941
144మెట్టుగూడభార్గవిటీఆర్ఎస్8029
145సీతాఫల్‌మండిహేమటీఆర్ఎస్15071
146బౌద్ధనగర్ధనుంజయ్ దయానంద్ గౌడ్టీఆర్ఎస్9681
147బన్సీలాల్‌పేటహేమలతటీఆర్ఎస్11700
148రాంగోపాల్‌పేటఅరుణా గౌడ్టీఆర్ఎస్6499
149బేగంపేటతరుణి నాయిటీఆర్ఎస్5751
150మోండామార్కెట్ఆకుల రూప హరికృష్ణటీఆర్ఎస్6325

Friday, February 5, 2016

జన్మభూమి అరాచకాలపై హైకోర్టు మండిపాటు

* బతికి ఉన్న మనిషిని చనిపోయినట్లుగా ధ్రువీకరిస్తారా
* ఇవేం అరాచకాలు.. అసలు క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతోంది
* మీరు అధికారంలో ఉండచ్చు. తర్వాత మరొకరు అధికారంలోకి రావచ్చు
హైదరాబాద్) ఆంధ్రప్రదేశ్ లో రాజ్యమేలుతున్న జన్మభూమి కమిటీల అరాచకాల్ని గౌరవ హైకోర్టు తీవ్రంగా ప్రశ్నించింది. ఏ అధికారం లేకపోయినప్పటికీ, జన్మభూమి కమిటీలు చెప్పాయన్న కారణంతో అర్హులైన లబ్దిదారులకు అందాల్సిన ప్రజా సంక్షేమ పథకాల్ని రద్దు చేస్తుండటంపై హైకోర్టు మండిపడింది. ఈ కమిటీల నిర్వాకంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
     

శ్రీకాకుళం జిల్లా కు చెందిన అమ్మణ్ణమ్మ అనే ముదుసలి మహిళకు పెన్షన్ ఒక్కటే జీవనాధారం. ఆమె చనిపోయిందని జన్మభూమి కమిటీ చెప్పటంతో పెన్షన్ రద్దు చేశారు. అలాగే మెట్ట లక్ష్మి అనే వితంతువు కి తర్వాత కాలంలో ఆమె వితంతు కోటాలోకి రాదంటూ రద్దు చేశారు. ఇటువంటి ఘోరాల మీద దాదాపు 75 మంది హైకోర్టుని ఆశ్రయించారు. వీటిని పరిశీలించిన గౌరవ న్యాయమూర్తి జస్టిస్ సీవీ నాగార్జున రెడ్డి ప్రభుత్వ యంత్రాంగం తీరుని తప్ప పట్టారు.వేటి ఆధారంగా ఈ నిర్ణయాలు చేస్తున్నారని ప్రశ్నించారు. రాజకీయ కారణాలతో పెన్షన్లు రద్దు చేస్తున్నారన్న పిటీషనర్ల వాదనల్ని కోర్టు పరిగణనలోకి తీసుకొంది. అప్పీల్ తీసుకొనేందుకు కూడా స్థానిక ఎంపీడీవో తిరస్కరించారని, అధికార పార్టీ నాయకులు చెబితేనే అభ్యర్థన తీసుకొంటామని చెప్పారని న్యాయవాదులు కోర్టుకు తెలియచేశారు.
        దీని మీద న్యాయస్థానం తీవ్రంగ స్పందించింది. “ ముదుసలి మహిళను చూస్తే ఆమె పెన్షన్ కు అర్హురాలని ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. అధికారులకు మాత్రం ఇవేమీ కనిపించటం లేదు. భౌతికంగా చూసి కూడా కాదంటున్నారు ధ్రువీకరణ పత్రం ఇచ్చినా అంగవైకల్యం లేదంటున్నారు. పెన్షన్ లేదంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటివి వాంఛనీయం కాదు. ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. కోర్టు దగ్గరకు వచ్చిన వారు సముద్రంలో నీటిచుక్క మాత్రమే. ఈ రోజు మీరు అధికారంలో ఉండి ఇలా చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నవారు రేపు అధికారంలోకి వస్తే వారూ మిమ్మల్ని చూసి ఇలానే చేయవచ్చు. అంతిమంగా ఇబ్బంది పడేది మాత్రం అమాయకపు ప్రజలే” అని న్యాయమూర్తి అభిప్రాయ పడ్డారు.
        ఈ అంశం మీద ఉప లోకాయుక్త ఇచ్చిన ఆదేశాల అమలుకు తీసుకొన్న చర్యల్ని వివరించాలన్నారు. దీని మీద విచారణ ను ఈ నెల 16 కు వాయిదా వేశారు. 

గ్రేటర్‌ ఎన్నికల ఫలితాలపై అభ్యర్థుల్లో ఉత్కంఠ

గ్రేటర్‌ ఎన్నికల ఫలితాలపై అభ్యర్థుల్లో ఉత్కంఠత నెలకొంది. క్లైమాక్స్‌లో శుభంకార్డు పడుతుందా! ఊహించని ఫలితం.. ఎదురైతే.. ఎలా! పైకి.. గంభీరంగా కనిపిస్తున్నా.. ప్రధాన పార్టీల అభ్యర్థుల అంతర్మథనం ఇదే. అధికార.. ప్రతిపక్ష పార్టీల నుంచి బరిలోకి దిగిన వారసులకు.. ఈ గెలుపు..తప్పనిసరిగా మారింది. భవిష్యత్తు రాజకీయాల్లో క్రియాశీలకంగా మారేందుకు కీలకమైంది.



అమాత్యుల మెడపై కత్తి 
మారిన రాజకీయ సమీకరణలతో కొత్తపొత్తులు పుట్టుకొచ్చాయి. అధికారపార్టీ పీఠంపై గురిపెడితే.. ప్రతిపక్షాలు.. సమ ఉజ్జీలుగా నిలిచేందుకు అహర్నిశలు శ్రమించాయి. సర్వేలతో గెలుపుగుర్రాలకు టిక్కెట్‌ కేటాయించామంటూ బహిరంగంగా ప్రకటించాయి. వందసీట్లు రాకపోతే.. రాజకీయ సన్యాసమేనంటూ నేతలు సవాల్‌ విసరటంతో గ్రేటర్‌లో రాజకీయం వేడెక్కింది. సెటిలర్ల ఓట్లను రాబట్టేందుకు ఏపీ, తెలంగాణ మంత్రులంతా.. నగరంలోనే తిష్టవేశారు. డివిజన్లలో ప్రచారంతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అమాత్యులు.. పర్యటించిన బస్తీలు.. కాలనీల్లో ఎంతవరకూ ప్రభావితం చేయగలిగారనేది.. అక్కడి అభ్యర్థుల విజయంతో బయటపడనుంది. ముఖ్యంగా.. అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు మెడపై కత్తిలా మారిందనేది బహిరంగ రహస్యం. సానుకూలమంటూ.. నివేదికలిచ్చిన.. డివిజన్లలో ఫలితం.. తారుమారైతే.. అనే ఆలోచనే నేతలగుండెల్లో గుబులు రేకెత్తిస్తోంది.

ఏడేళ్లుగా ఎదురుచూపులు 
2009 ఎన్నికల్లో టిక్కెట్‌ కోసం ప్రయత్నించారు. మరికొందరు కొద్దిపాటి ఓట్లతో ఓటమి చవిచూశారు. వారంతా.. మరోమారు అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఏడేళ్లపాటు ఎదురుచూశారు. కొందరి ఆశ.. డివిజన్ల మార్పుతో గల్లంతైంది. మరికొందరు.. బంధుగణాన్ని రంగంలోకి దింపి
ముచ్చట తీర్చుకున్నారు. యాభైశాతం మహిళా రిజర్వేషన్ల పుణ్యమాంటూ.. సతులు.. పుత్రికలు.. అమ్మలు.. బామ్మలు పదిరోజుల పాటు గల్లీగల్లీ చుట్టారు. కీలకమైన డివిజన్లలో కోట్లు కుమ్మరించారు. నగరంలోని ఓ ప్రధాన డివిజన్‌లో.. ఒక్కరోజు ఏకంగా 70లక్షలు వెచ్చించినట్లు సమాచారం. ఇక్కడ పోటీ.. నువ్వా-నేనా అన్నట్లుగా ఉండటంతో... అనుచరులతో బూతల వారీగా లెక్కలు తెప్పించుకుని.. పరిశీలిస్తున్నట్లు తెలిసింది.

బెట్టింగ్‌కూ.. భయమే 
క్రికెట్‌.. కబడ్డీ.. ఎలక్షన్‌ సమయంలో.. ఫలితాలపై బెట్టింగ్‌లు కామన్‌. కానీ.. గ్రేటర్‌ బరిలో.. గ్యారంటీ గెలుపంటూ.. చెబుతున్న పార్టీలు సైతం పందెం.. మాట వినగానే వెనుకంజ వేస్తున్నాయి. కూకట్‌పల్లి నియోజకవర్గంలోని ఓ డివిజన్‌ అధికార పార్టీకు కీలకంగా మారింది. అక్కడ.. హోరాహోరీ పోటీ జరిగింది. ఇరువైపులా అనుచరులు లక్షల్లో పందేలకు దిగి.. చివరి నిమిషంలో విరమించుకున్నట్లు సమాచారం. ఉప్పల్‌ నియోజకవర్గంలో.. ఓ ప్రజాప్రతినిధి తమదే విజయమంటూ.. ధీమా వ్యక్తంచేశాడు. దీంతో ప్రత్యర్థులు.. బెట్‌ అనగానే.. వద్దులే గురూ! మాటమార్చారని తెలిసింది. 

పురానాపూల్‌లో మ.1:30 గంటలకు 55 శాతం పోలింగ్

హైదరాబాద్ : పురానాపూల్‌లో రీపోలింగ్‌లో పెద్ద సంఖ్యలో ఓటర్లు పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం 1:30 గంటల వరకు 55 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. మరో మూడు గంటల్లో పోలింగ్ పూర్తి అవుతుండటంతో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. పురానాపూల్‌లోని 36 కేంద్రాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. 

Thursday, February 4, 2016

ఉదయం ఖచ్చితంగా తినకూడని కొన్ని ఆహారాలు

సాధారణంగా ఉదయం బ్రేక్ ఫాస్ట్ తో తీసుకొనే ఆహారాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని చెబుతారు. అందులో మన దినచర్యను హెల్తీ ఫుడ్స్ తో ప్రారంభించినట్లైతే , మన శరీరానికి అవసరం అయ్యే ప్రోటీన్లు, న్యూట్రీషియన్స్, విటమిన్లు పూర్తిగా బాడీ గ్రహించడం వల్ల ఆరోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా...ఎనర్జిటిక్ గా ఉంటారు . అయితే కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను కూడా ఉదయం సమయంలో తీసుకోకూడదంటున్నారు ఆహార నిపుణులు, మరి అవేంటి?

మన ప్రతి రోజూ ఉదయం తీసుకొనే మొదటి ఆహారం మన శరీరానికి అవసరం అయ్యే ఇంధనం వంటిది. రోజంతా మిమ్మల్ని యాక్టివ్ గా ఉంచడానికి గ్రేట్ గా సహాయపడుతుంది . మిమ్మల్ని అలసటక మరియు బద్దకానికి గురైనప్పుడు, అది కూడా ఉదయం సమయంలో ఇలాంటి ఫీలింగ్స్ కలిగినప్పుడు , ఇక ఆరోజంతా మగతగానే అనిపిస్తుంది.

తాజా పండ్లను ఉదయం తినడం వల్ల పొందే గ్రేట్ హెల్త్ బెనిఫిట్స్ మరియు బ్రేక్ ఫాస్ట్ మీ ఆకలిని సాటిస్ఫై చేస్తుంది. అంతే కాదు మీరు తీసుకోనే ఉదయం అల్పాహారం మద్యహ్నాన భోజనం తీసుకొనే వరకూ మీకు ఆకలి అవ్వకుండా చేస్తుంది. దాంతో పాటు మీ బ్లడ్ షుగర్ లెవల్స్ ను స్థిరంగా ఉంచుతుంది. అయితే ఉదయం తీసుకొనే కొన్ని ఆహారాలు శరీరానికి ఒంటబట్టకు తిరిగి మిమ్మల్ని నిస్తేజంగా మార్చుతుంది.

అరటిపండ్లు తినడానికి 25 ఖచ్చితమైన కారణాలు ఇంకా మీరు బరువు తగ్గించుకొనే ప్లాన్ లో ఉన్నప్పుడు మీరు తీసుకొనే బ్రేక్ ఫాస్ట్ ఎంపిక మీద జాగ్రత్తగా ఉండాలి .

ఉదయం ఖచ్చితంగా తినకూడని కొన్ని ఆహారాలు


బ్రెడ్ అండ్ జామ్: చిన్న వయస్సు నుండి బ్రెడ్ అండ్ జామ్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే ఉదయం సమయంలో జామ్ తీసుకోవడం నిజంగా ఆరోగ్యానికి అంత మంచిది కాదు . జామ్ కు ప్రత్యామ్నాయంగా బ్రెడ్ అండ్ ఎగ్ తీసుకోవడం లేదా కేవలం గుడ్డు మాత్రమే బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.


డోనట్స్: డోనట్స్ పాస్టీస్ లేదా మైదాతో తయారుచేసిన ఇతర ఏ పదార్థాలైనా సరే మార్నింగ్ తీసుకోవడం చాలా చెడు అలవాటుగా గుర్తించాలి. హెల్తీ ఫుడ్స్ ను ఎంపికచేసుకోవాలి.


బర్గర్: ఇంకా బర్గర్ వంటివి కూడా ఉదయం సమయంలో తీసుకోవడం కూడా చెడే..చాలా మంది , ఈ మోడ్రన్ ప్రపంచంలో సమయం లేక ఇలాంటి రెడీ మేడ్ బర్గర్స్ ను పిక్ చేసుకుంటుంటారు . వీటి తయారీకి ఉపయోగించే ప్రిజర్వేటివ్స్ మరియు సాస్, ఆడిటివ్స్ వంటివి ఆరోగ్యానికి చాలా హానికలిగిస్తాయి.


షుగరీ జ్యూస్: ఫ్రూట్ జ్యూస్ లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. షుగర్ కంటెంట్స్ ఉన్నవి ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవడం ఒక బ్యాడ్ చాయిస్ అనే చెప్పుకోవచ్చు . అందుకు వెజిటేబుల్ జ్యూస్ తీసుకోవడం వల్ల మీకు అవసరం అయ్యే ఎనర్జీ, న్యూట్రీషియన్స్ ను పొందవచ్చు .


గ్రెయినీ ప్రొడక్ట్స్ : చాలా వరకూ సెరల్ ప్రొడక్ట్స్ గ్రెయిన్స్ తో తయారుచేసినవే . వీటిలో గ్లూటిన్ మరియు షుగర్స్ ఉంటాయి. కాబట్టి సెరెల్స్ ఉదయం తీసుకోవడం అంత ఆరోగ్యకరం కాదు.


స్వీట్స్ అండ్ డిజర్ట్స్: మీరు షుగర్ మరియు స్వీట్స్ కు వ్యసనపరులుగా మారిఉన్నా, ఉదయం మాత్రమే స్వీట్స్ మరియు డిజర్ట్స్ తీసుకోకూడదు. ఇలాంటి వాటిల్లో షుగర్స్ అధికంగా ఉంటాయి. ఇది కార్బోహైడ్రేట్ మరియు మైదాతో తయారుచేస్తారు. ఇది బ్లడ్ షుగర్ లెవల్స్ ను అమాంతంగా పెంచేస్తుంది.


రేపు పురానాపూల్‌లో రీపోలింగ్...

హైదరాబాద్‌: రేపు పురానాపూల్‌లో రీపోలింగ్ జరపాలని జీహెచ్ఎంసీ  ఎన్నికల అధికారి జనార్ధన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఘర్షణల వల్ల కొందరు ఓటర్లు ఓటు వేయలేకపోయారు. అఖిలపక్ష నేతల డిమాండ్‌తో ఈసీ రీపోలింగ్‌కు ఆదేశించింది. 36 పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. 34,413 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కౌంటింగ్‌ సమయాన్ని మార్చే అవకాశం ఉంది. 

జీహెచ్‌ఎంసీ ఓట్ల లెక్కింపు రేపు సాయంత్రం 4 గంటలకు వాయిదా:

ఘర్షణల వల్ల కొందరు ఓటర్లు ఓటు వేయలేక పోయినందు వల్ల పురానాపూల్‌ డివిజన్లో రేపు రీపోలింగ్ జరపాలని ఈసీ ఆదేశించింది.దీంతో జీహెచ్‌ఎంసీ ఓట్ల లెక్కింపు రేపు సాయంత్రం 4 గంటలకు వాయిదా వేశారు. పురానాపూల్‌లో రీపోలింగ్‌ కారణంగా ఓట్ల లెక్కింపును వాయిదా వేసినట్లు  ఎన్నికల అధికారులు ప్రకటించారు.

Wednesday, February 3, 2016

సీఎం హామీ ఇచ్చారు కాబట్టే రోడ్డెక్కాం: ముద్రగడ

కిర్లంపూడి: జనవరి 31న తునిలో నిర్వహించిన కాపు ఐక్య గర్జన సమావేశానికి ఏ గ్రామం నుంచి ఎంత మంది వచ్చారో తమ వద్ద లెక్కలు ఉన్నాయని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని తన సొంత గ్రామమైన కిర్లంపూడిలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు కాబట్టే ఇప్పుడు అమలు చేయమని అడుగుతున్నామని ఆయన అన్నారు. కాపులను బీసీల్లో చేర్చాలనే డిమాండ్‌ను నేరవేర్చేందుకే శుక్రవారం ఉదయం 9 గంటలకు నేను, నాభార్య ఆమరణ నిరాహారదీక్షకు చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు.


తమ జాతికి రిజర్వేషన్లు కల్పించాలన్న ఉద్దశంతోనే తాను ఉద్యమబాట పట్టానే తప్ప, స్వప్రయోజనాల కోసం కాదన్నారు. కాపులను బీసీల్లో చేర్చాతామని ఆశ చూపి, తమ జాతిని నమ్మించి ఓట్లు వేయించుకున్న చంద్రబాబు, అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేసేందుకే ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. కాపు ఐక్య గర్జన సమావేశం జరగకుండా అధికార పార్టీ ఎన్నో ప్రయత్నాలు చేసినందని ఆయన ఆరోపించారు. కాపు ఉద్యమంలో పాలు పంచుకున్న ఏ ఒక్కరికీ దురుద్దేశం లేదన్నారు. కోట్ల విజయ భాస్కర రెడ్డి ఇచ్చిన జీవోను సీఎం చంద్రబాబు పచ్చి మోసం అంటూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాపులకు సంబంధించిన డేటా అంతా సీఎం చంద్రబాబు నాయుడు వద్ద ఉందన్నారు. సీఎం హామీ ఇచ్చారు కాబట్టే, తాను రోడ్డుపైకి వచ్చానని పేర్కొన్నారు. సీఎం ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతున్నా అన్నారు. కాపు రిజర్వేషన్లపై తాను పలుమార్లు లేఖలు రాసినా సీఎం నుంచి సందేశం రాలేదన్నారు. మా జాతికి ఫలాల కోసమే చూస్తున్నానని పేర్కొన్న ముద్రగడ, మీరైనా జీవో ఇవ్వాలని అడుగతున్నానని అన్నారు. కమిషన్‌ పేరుతో ఏళ్ల తరబడి తాత్సారం చేయడం భావ్యం కాదన్నారు. అలా కాకుండా ఇతర బీసీ సంఘాల సోదరులతో చర్చలు జరపడం చంద్రబాబుకు సరికాదని ఆయన సూచించారు. దళితులైనప్పటికీ అంబేద్కర్, దామోదరం సంజీవయ్య తమ జాతికి ఎంతో మేలు చేశారని అన్నారు. 1915లో అంబేద్కర్ బ్రిటన్ వెళ్లి మరీ కాపు రిజర్వేషన్ల కోసం పని చేశారని తన మిత్రులు చెప్పారని ఆయన పేర్కొన్నారు. భారత దేశంలో ఎంతో కాలంగా కాపులకు రిజర్వేషన్లు అమలులో ఉన్నాయన్నారు. ఇప్పుడు వాటినే అడుగుతున్నామని చెప్పారు. కాపు రిజర్వేషన్‌ ఉద్యమంలో పాల్గొన్న ఎవరికీ దాడులు చేయాలన్న ఉద్దేశం లేదన్నారు. సార్...రమ్మంటున్నారని పిలిచి, నా భార్యను కూడా ఆ రోజు కొందరు అవమానించారని ఆయన తెలిపారు. కాపు ఐక్య గర్జనలో భాగంగా ఆందోళన జరుగుతున్నప్పుడు నలుగురు వ్యక్తులు గెస్ట్‌హౌస్‌లో ఉన్న తన భార్యవద్దకు వెళ్లి సర్ రమ్మంటున్నారని చెప్పారట. నేనైతే ఆవిడను పిలవలేదు. 'మరి, వాళ్లెవరో.. ఎందుకలా అన్నారో' అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మేడపైనున్న వాటర్ ట్యాంక్ ధ్వంసం చేశారని, తనని కూడా అవమానించారని ఆయన చెప్పారు. ఉద్యమం నుంచి వెనక్కి వెళ్లేలా తనపై ఒత్తిడి తెచ్చారని ఆయన పేర్కొన్నారు. సీఎం తలచుకుంటే కాపులకు రిజర్వేషన్ వచ్చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

గ్రేటర్‌ సమరం ముగిసింది....

హైదరాబాద్‌ : గ్రేటర్‌ సమరం ముగిసింది. 25 రోజుల క్రితం మొదలైన ఎన్నికల సంద డికి పోలింగ్‌తో తెరపడింది. సూత్రప్రాయంగా 45 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారి జనార్దనరెడ్డి తెలిపారు. బుధవారం తుది లెక్కలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే సాయంత్రం 4.30 వరకు నమోదైన వివరాల ప్రకారం 37.70 శాతం పోలింగ్‌ నమోదైందని జీహెచ్‌ఎంసీ ఓ ప్రకటనలో పేర్కొంది. పోరు ముగిసిన నేపథ్యంలో ఇక తేలాల్సింది అభ్యర్థుల భవితవ్యం. ఈనెల 5న జరిగే లెక్కింపుతో విజేతలెవరు..? పరాజితులెవరు..? అన్నది తేలిపోనుంది. శుక్రవారం ఉదయం 8 గంటలకు 24 కేంద్రాల్లో గ్రేటర్‌లోని 150 వార్డులకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. కౌంటింగ్‌ కోసం 893 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 3,200 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. అరగంటలోపే మొదటి ఫలితం వెలువడుతుందని అధికారులు చెబుతున్నారు. గ్రేటర్‌ ఎన్నికల నిర్వహణకు జనవరి 8న రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. 12 నుంచి ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ 17తో ముగిసింది. 18న స్ర్కూటినీ.. 19, 20, 21తేదీల్లో ఉపసంహరణకు అవకాశం కల్పించారు. 21న సాయంత్రం గ్రేటర్‌ బరిలో నిలిచిన 1,333 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. 22 నుంచి గ్రేటర్‌లో ప్రారంభమైన ప్రచార హోరు 31తో ముగిసింది. మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ పలు ప్రాంతాల్లో 5.45 వరకు కొనసాగింది. పాతబస్తీలో కాంగ్రెస్‌ అగ్రనేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, షబ్బీర్‌అలీలపై దాడి, డిప్యూటీ సీఎం కొడుకు అజంఅలీపై దాడి మినహ పెద్దగా ఘర్షణలు చోటు చేసుకోలేదు. కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు ఘటనలు జరిగాయి. కొన్ని ప్రాంతాల్లో తమ ఓట్లు తొలగించారని పౌరులు ఆందోళన వ్యక్తం చేశారు. పోలింగ్‌ స్లిప్పులు ఇవ్వకపోవడంతో పలు డివిజన్లలో ఓటర్లు ఇబ్బందులు పడ్డారు. ఏ బూత్ లో ఓటు వేయాలో తెలియక..? పోలింగ్‌ కేంద్రాల్లో చెప్పేవారు లేక వెనుదిరగడం కనిపించింది. గ్రేటర్‌ బరిలో మొత్తం 1,333 మంది బరిలో నిలిచారు. వీరిలో కేవలం 150 మంది విజేతలుగా నిలువనున్నారు. చాలా ప్రాంతాల్లో పోరు హోరాహోరిగా సాగింది. నువ్వా..? నేనా...? అన్నట్టు అభ్యర్థులు తలపడ్డారు. కొన్ని డివిజన్లలో వ్యక్తులను చూసి ఓటు వేయగా.. మెజార్టీ ప్రాంతాల్లో పార్టీపై అభిమానమే ఎక్కువగా ఓటింగ్‌కు కారణమైంది. 74,23,980 మంది ఓటర్లకు గాను 27,99,078 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. బుధవారం పూర్తి వివరాలు వెల్లడిస్తామని జీహెచ్‌ఎంసీ వర్గాలు తెలిపాయి.
శివార్లలో అధికం...
గ్రేటర్‌ ఎన్నికల్లో శివారు ప్రాంతాల్లో అధిక పోలింగ్‌ నమోదైంది. కోర్‌ ఏరియాలో సగటు అటు, ఇటుగా 30-35 శాతం మధ్యలో ఉండగా... శివార్లలో మాత్రం 40-45 శాతంగా నమోదైంది. ఈస్ట్‌జోన్‌లోని కాప్రా సర్కిల్‌లో అత్యధికంగా 48.46శాతం, ఉప్పల్‌లో-46, ఎల్‌బీనగర్‌ (3ఏ)లో- 44.74, ఎల్‌బీనగర్‌ (3బీ)లో 39.81శాతం ఉంది. రామచంద్రాపురం సర్కిల్‌ పరిధిలో మూడు డివిజన్లుండగా అత్యధికంగా 55, కూకట్‌పల్లి(ఏ)లో 49.28, కూకట్‌పల్లి(బీ)లో 46.83 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. శేరిలింగంపల్లిలోని రెండు సర్కిళ్ల పరిధిలో వరుసగా 44.33, 38.72 శాతం పోలింగ్‌ నమోదైంది. కోర్‌ ఏరియాతో పోలిస్తే ఈసారి శివార్లలో ఎక్కువ మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో రాజకీయ సమీకరణాలపై ఆసక్తి నెలకొంది. గత లెక్కలను పరిశీలిస్తే ఆయా ప్రాంతాల్లో టీడీపీకి గట్టి పట్టున్నట్టు స్పష్టమవుతుంది. విభజన అనంతర పరిణామాల నేపథ్యంలో పరిస్థితుల్లో చాలా వరకు మార్పులొచ్చాయి. అధికార టీఆర్‌ఎస్‌ పట్టు పెంచుకున్నట్టు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో శివారు ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారన్న దానిపైనే మేయర్‌ పీఠం ఎవరు కైవసం చేసుకుంటారన్నది ఆధారపడి ఉంటుంది.
సౌత్ లో లెస్‌... కోర్‌లో మరీ తక్కువ...
సార్వత్రిక.. స్థానిక సంస్థ.. ఏ ఎన్నికలైనా అత్యధిక పోలింగ్‌ నమోదయ్యే సౌతజోన్‌లో ఈసారి పరిస్థితులు తారుమారయ్యాయి. క్రితం కంటే తక్కువగా 28 శాతం పోలింగ్‌ మాత్రమే ఇక్కడ నమోదైంది. చార్మినార్‌ (4ఏ)లో 23.01, చార్మినార్‌ (4బీ)లో 29.59, సర్కిల్‌-5లో 30.59 శాతం పోలింగ్‌ నమోదైంది. ఈ పరిణామాల నేపథ్యంలో పాతబస్తీలో వన్‌సైడ్‌గా జరిగే వార్‌ ఫలితాల్లో మార్పులుండే అవకాశముందని చెబుతున్నారు. తక్కువ పోలింగ్‌ నమోదైన నేపథ్యంలో ఎంఐఎం నాయకులు ఆందోళన చెందుతున్నారు. తమ పార్టీకి పెట్టని కోటలా ఉన్న ఓల్డ్‌ సిటీలో ఫలితాలు ఎలా ఉంటాయో అని మదనపడుతున్నారు. అయితే వివిధ సంస్థలు నిర్వహించిన సర్వేల్లో మాత్రం మజ్లిస్‌కు సీట్లు తగ్గుతాయని, 2009లో 43 స్థానాలతో ఉన్న ఆ పార్టీ ఇప్పుడు 35 సీట్లతోనే సరిపెట్టుకునే అవకాశముందని స్పష్టమవుతోంది. కోర్‌ ఏరియాలో మరీ తక్కువగా పోలింగ్‌ నమోదు కావడం గమనార్హం.

Tuesday, February 2, 2016

ఓటరా.. కదలిరా...

ప్రజాస్వామ్యం మనకిచ్చిన అతిపెద్ద అవకాశం ఓటు హక్కు. విద్యాధికులు ఎక్కువున్న మహానగరాల్లో ఆ హక్కు అలక్ష్యానికి గురవు తోంది. చట్టసభల్లో సరే! స్థానిక సంస్థల ఎన్నికల సమ యంలోనూ అదే పరిస్థితి! ముంబై, ఢిల్లీ, బెంగుళూరు, కలకత్తా, పూణె, అహ్మదాబాద్‌ వంటి మహానగరాల కన్నా హైదరాబాద్‌లో 2009 జరిగిన గ్రేటర్‌ ఎన్నికల ప్రకారం పోలైన ఓట్ల సంఖ్య తక్కువనే చెప్పాలి. అలా అని ఆ నగరాల్లో ఎదో పరిస్థితి మెరుగని కాదు. గత గ్రేటర్‌ ఎన్ని కల్లో పేద, మధ్య తరగతివాసులు నివసించే పత్తర్‌గట్టీలో 65శాతం ఓట్లు నమోదైతే, చదువుకున్నవారు ఎక్కువగా ఉన్న విజయనగర్‌కాలనీ వార్డులో కేవలం 25శాతం ఓట్లు పోలవడం ఎలాంటి సంకేతాలు అందిస్తున్నాయనేది పెద్ద ప్రశ్నే. మిగతానగరాల్లో కూడా చదువుకున్నవారి కంటే బస్తీలు, వాడల్లో నివసించేవారు, గ్రామీణ ప్రాంతాల నుంచి వలసవచ్చినవారే నగరాల్లో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని సామాజిక విశ్లేషకులు అంటున్నారు.


అలక్ష్యానికి కారణాలివే... 
నగరవాసులు ఓటు హక్కును ఎందుకు వినియోగించుకోవట్లేదు అంటే, వారికి ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదనేది కొంత మంది ప్రచారం చేస్తున్న వాదన. కానీ అది ఏ మాత్రం వాస్తవం కాదు. సరైన పాలకులు...వారు మెచ్చిన నాయకులు లేరనే నిస్పృహే వారిని పోలింగ్‌ బూతువైపుకు రాకుండా చేస్తుందని చెబుతున్నారు సివిక్‌ సొసైటీ సభ్యులు డా. రావు చెలికాని. పోలింగ్‌ రోజంటే సెలవురోజని సంతోషపడుతున్నారేకానీ, దాని మాటున మన జీవితాలను 5ఏళ్లపాటు వారి చేతిలో పెడుతున్నామని గుర్తించాల్సిన అవసరముందంటున్నారు సామాజిక వేత్తలు. తమ ఓటు హక్కును వినియోగించుకోక పోతే అవినీతినాయకులను మనమే ప్రోత్సహించినట్టు లెక్క అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ప్రొ లక్ష్మి. ఏ పార్టీ నాయకుడు నచ్చకపోతే, మరో అవకాశం మనకు కల్పించింది రాజ్యాంగం. అదే నోటా! అంతే కానీ అసలు ఓటు హక్కును అలక్ష్యం చేయడం మాత్రం బాధ్యతగల పౌరులు చేసే పనికాదు.

ప్రశ్నించేందుకు ఒక పేటెంట్‌ 
ఎన్నుకున్న నాయకుడు మీ ఆశలు అడియాసలు చేశారు. స్థానిక సమస్యలు గాలికొదిలేశారు. అవినీతే పరమావధిగా ముందుకుసాగుతున్నారు. మనకు తెలి యకుండానే మనల్ని మింగేస్తున్నారు. భరించడమేనా... సహించడమేనా! కాదుగా! నిజాయితీగా నీవేసిన ఓటు నీ బాధ్యతను గుర్తుచేస్తుంది. సహనమనే నల్లమబ్బులను చీల్చేస్తుంది. పిడికిలి బిగించేందుకు శక్తినిస్తుంది. ప్రశ్నించే గొంతుకవుతుంది. సమస్యలపై సమరభేరికి శంఖారావం పూరిస్తుంది. అదే ప్రలోభాలకు గురై, కానుకలకు ఆశ పడి ఓటేస్తే ఆత్మాభి మానాన్ని తాకట్టుపెట్టుకున్నట్టే! అసలు ఓటే వేయకపోతే! ఆత్మాభిమానాన్ని పాతాళానికి తోసినట్టే! అందుకు ఓటు ఓ ఆయుధం. దాన్ని సంధించేందుకు ఓటు హక్కున్న ప్రతి నగరవాసి ఇల్లువదిలి పోలింగ్‌ బూతు బాట పట్టాల్సిందే!
సిరా చుక్కతో గర్వంగా ఆకాశానికేసి చూడాల్సిందే!
చార్మినార్‌ సాక్షిగా...మహా నగరం కోసం.వీధి చివర చెత్తకుండీ కంపుకొడుతోంది... ముక్కుమూసుకొని పక్కకు పోవడమేనా సమాధానం!
సర్కారు నల్లా సతాయిస్తుంది... ఇంకెంత కాలం భరించడం!
రోడ్డుపైన గుంతలు రక్తం కళ్ల చూస్తుంటే... ఆ సహనమేల!
వీధుల్లో పొంగిపొర్లుతున్న డ్రైనేజీ పై ఛీత్కారమే పరిష్కారమా!
ఒకటేమిటి...అడుగుకొక సమస్య... అడుగడుగుకో గండం... నగర జీవన పోరాటంలో...
వాటన్నింటినీ ఎదుర్కునే పాశుపతం ఇప్పుడు ఉంది నగరవాసి చేతిలో...
సంధించే సమయమిదే ఓటు అనే ఆయుధంతో...
ప్రజాస్వామ్యమిచ్చిన విలువైన కానుకతోనే...
ప్రశ్నించే హక్కును పేటెంట్‌గా పొందాల్సిందే...
పాలకులను నిగ్గదీసి అడగాల్సిందే... అంతకుముందు... ఓటు హక్కును సద్వినియోగించుకోవాలి

Monday, February 1, 2016

గ్రేటర్ ప్రచారానికి తెర

ఆఖరి రోజు నేతల సుడిగాలి పర్యటనలు
ముమ్మరంగా ప్రచారం నిర్వహించిన పార్టీల ముఖ్య నేతలు
ర్యాలీలు, ప్రదర్శనలు, సభలతో హోరెత్తిపోయిన నగరం

150 డివిజన్లలో 1,333 మంది అభ్యర్థుల పోటీ.. రేపే ఎన్నికలు

హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. 15 రోజులపాటు హోరాహోరీగా సాగిన ప్రచార పర్వం ఆదివారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఆఖరి రోజు కావడంతో అన్ని పార్టీల ముఖ్య నేతలు సుడిగాలి పర్యటనలతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు. నగరమంతటా ప్రదర్శనలు, బైక్ ర్యాలీలు హోరెత్తించాయి. జీహెచ్‌ఎంసీ ఎన్నికల బాధ్యతను భుజాన వేసుకొని గత నెలరోజులుగా విస్తృతంగా పర్యటనలు, సభల్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్ ఆదివారం కూకట్ పల్లి, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. బీజేపీ నేత, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు రాంనగర్, కొత్తపేట, వనస్థలిపురం తదితర చోట్ల జరిగిన సభల్లో పాల్గొన్నారు. నగరాభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని, కేంద్రం భాగస్వామ్యం లేకుండా తెలంగాణ అభివృద్ధి సాధ్యం కాదని చెప్పారు. మౌలాలీలో చేపట్టిన ప్రచారంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్‌తోనే

హైదరాబాద్ నగర అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. మల్కాజిగిరిలో టీడీపీ నిర్వహించిన సభలో ఆ పార్టీ నేత రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. 1,200 మంది త్యాగాల ఫలితంగా తెలంగాణ వచ్చిందని, ఈ రాష్ట్రం కేసీఆర్ జాగీరు కాదని అన్నారు. కూకట్‌పల్లి, గచ్చిబౌలి, ఆల్విన్ కాలనీ, వివేకానందనగర్ తదితర  ప్రాంతాల్లో రోడ్‌షోలు, బహిరంగ  సభల్లో టీడీపీ నాయకుడు నారా లోకేశ్ పాల్గొన్నారు. అడుగడుగునా ర్యాలీలు, ప్రదర్శనలు దారుస్సలాంలోని పార్టీ కార్యాలయం నుంచి పాతబస్తీలోని వివిధ డివిజన్ల మీదుగా చార్మినార్ వరకు ఎంఐఎం భారీ బైక్ ర్యాలీ నిర్వహించింది. టీఆర్‌ఎస్ బేగంబజార్, గోషామహల్ తదితర చోట్ల ర్యాలీలు నిర్వహించింది. గన్‌ఫౌండ్రీలో బీజేపీ చేపట్టిన ప్రచారంలో కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ పాల్గొన్నారు. అంబర్‌పేట్ నియోజకవర్గం, యాప్రాల్‌లో బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. టీఆర్‌ఎస్ మాటల గారడీలకు మోసపోవద్దని ఓటర్లకు చెప్పారు. బేగంపేట్‌లో కాంగ్రెస్ ఎంపీ రేణుకాచౌదరి, మర్రి శశిధర్‌రెడ్డిలు పర్యటించారు. గచ్చిబౌలిలో చేపట్టిన ర్యాలీలో కాంగ్రెస్ నేత మధుయాష్కీగౌడ్ పాల్గొన్నారు. సనత్‌నగర్ నియోజకవర్గంలో  టీఆర్‌ఎస్ మంత్రి తలసాని ప్రచారం నిర్వహించారు.

గౌలిపురాలో సీపీఐ నిర్వహించిన ర్యాలీలో ఆ పార్టీ నేత నారాయణ పాల్గొన్నారు. ఫిబ్రవరి ఐదో తేదీనే తాను సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు సమాధానమిస్తానన్నారు. అడ్డగుట్టలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. చర్లపల్లిలో నిర్వహించిన టీఆర్‌ఎస్ బహిరంగ సభలో మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాల్గొన్నారు. కొత్తపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పాల్గొన్నారు. మొత్తమ్మీద గ్రేటర్ హైదరాబాద్‌లోని 150 డివిజన్లలో పోటీకి దిగిన 1,333 మంది అభ్యర్థుల భవిత్యాన్ని తేల్చే ఎన్నికల గడువు సమీపించడంతో ప్రచారానికి ఆఖరి రోజైన ఆదివారాన్ని సద్వినియోగం చేసుకొనేందుకు అన్ని పార్టీలూ పోటీ పడ్డాయి. మంగళవారం జరిగే పోలింగ్‌లో ఓటరు మహాశయులు ఏ మీట నొక్కుతారోనని ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి.