డివిజన్ నెంబరు | డివిజన్ పేరు | గెలిచిన అభ్యర్థి | పార్టీ | మెజారిటీ |
1 | కాప్రా | స్వర్ణరాజు శివమణి | టీఆర్ఎస్ | 5029 |
2 | ఏఎస్ రావు నగర్ | పావని రెడ్డి | టీఆర్ఎస్ | 1366 |
3 | చర్లపల్లి | బొంతు రామ్మోహన్ రావు | టీఆర్ఎస్ | 7869 |
4 | మీర్ పేట్ హెచ్ బీ | గొల్లూరి అంజయ్య | టీఆర్ఎస్ | 5707 |
5 | మల్లాపుర్ | దేవేందర్ రెడ్డి | టీఆర్ఎస్ | 7989 |
6 | నాచారం | శాంతి | కాంగ్రెస్ | 152 |
7 | చిలకానగర్ | సరస్వతి | టీఆర్ఎస్ | 7982 |
8 | హబ్సిగూడ | స్వప్న సుభాష్ రెడ్డి | టీఆర్ఎస్ | 7468 |
9 | రామాంతపూర్ (ఈస్ట్) | జ్యోస్నా నాగేశ్వరరావు | టీఆర్ఎస్ | 5157 |
10 | ఉప్పల్ | అనలా రెడ్డి | టీఆర్ఎస్ | 1148 |
11 | నాగోల్ | సంగీత ప్రశాంత్ గౌడ్ | టీఆర్ఎస్ | 6077 |
12 | మన్సూర్ బాద్ | విఠల్ రెడ్డి | టీఆర్ఎస్ | 5949 |
13 | హయత్ నగర్ | తిరుమల్ రెడ్డి | టీఆర్ఎస్ | 2773 |
14 | బీఎన్ రెడ్డి నగర్ | లక్ష్మీ ప్రసన్న గౌడ్ | టీఆర్ఎస్ | 6559 |
15 | వనస్థలిపురం | రాజశేఖర్ రెడ్డి | టీఆర్ఎస్ | 8281 |
16 | హస్తినాపురం | పద్మా నాయక్ | టీఆర్ఎస్ | 9118 |
17 | చంపాపేట్ | రమణా రెడ్డి | టీఆర్ఎస్ | 146 |
18 | లింగోజిగూడ | శ్రీనివాస రావు | టీఆర్ఎస్ | 7331 |
19 | సరూర్ నగర్ | అనితా దయాకర్ రెడ్డి | టీఆర్ఎస్ | 6211 |
20 | ఆర్ కే పురం | రాధారెడ్డి | బీజేపీ | 1962 |
21 | కొత్తపేట్ | సాగర్ రెడ్డి | టీఆర్ఎస్ | 5198 |
22 | చైతన్యపురి | జీ విఠల్ రెడ్డి | టీఆర్ఎస్ | 4505 |
23 | గడ్డిఅన్నారం | ప్రవీణ్ ముదిరాజ్ | టీఆర్ఎస్ | 6132 |
24 | సైదాబాద్ | సింగిరెడ్డి స్వర్ణ లతా రెడ్డి | టీఆర్ఎస్ | 8277 |
25 | ముసారాంబాగ్ | తీగల సునీతా రెడ్డి | టీఆర్ఎస్ | 5714 |
26 | ఓల్డ్ మలక్ పేట్ | అంజూమ్ ఫాతిమా | ఎంఐఎం | 2741 |
27 | అక్బర్ బాగ్ | సయ్యద్ మిన్హారుద్దీన్ | ఎంఐఎం | 781 |
28 | అజామ్ పురా | ఆయేషా జహన్ నసీం | ఎంఐఎం | 1571 |
29 | చవానీ | మహ్మద్ మూర్తజా అలీ | ఎంఐఎం | 9339 |
30 | డబీర్ పురా | రియాజ్ ఉల్ హసన్ | ఎంఐఎం | 6473 |
31 | రెయిన్ బజార్ | వాజిద్ అలీ ఖాన్ | ఎంఐఎం | 8099 |
32 | ఫత్తార్ ఘాట్ | సయ్యద్ సోహైల్ ఖద్రీ | ఎంఐఎం | 13151 |
33 | మొఘల్ పురా | అమ్తల్ అలీ | ఎంఐఎం | 6163 |
34 | తలాబ్ చన్ చలం | నస్రీన్ సుల్తానా | ఎంఐఎం | 11495 |
35 | గౌలిపురా | ఆలె లలిత | బీజేపీ | 1434 |
36 | లలితాబాగ్ | అలీ షరీఫ్ | ఎంఐఎం | 3043 |
37 | కుర్మాగూడ | సమీనా బేగం | ఎంఐఎం | 4210 |
38 | ఐఎస్ సదన్ | స్వప్న సుందర్ రెడ్డి | టీఆర్ఎస్ | 11401 |
39 | సంతోష్ నగర్ | ముజాఫర్ హుస్సేన్ | ఎంఐఎం | 9021 |
40 | రియాసత్ నగర్ | ముస్తఫాబేగ్ | ఎంఐఎం | 4221 |
41 | కాంచన్ బాగ్ | రేష్మా ఫాతిమా | ఎంఐఎం | 6293 |
42 | బార్కాస్ | షబానా బేగం | ఎంఐఎం | 6893 |
43 | చాంద్రాయాణగుట్ట | అబ్దుల్ వాహెబ్ | ఎంఐఎం | 5763 |
44 | ఉప్పుగూడ | అబ్దుల్ సమీద్ బిన్ అబ్ద్ | ఎంఐఎం | 4238 |
45 | జంగం మెట్ | అబ్దుల్ రెహ్మాన్ | ఎంఐఎం | 1197 |
46 | ఫలక్ నుమా | తారాబాయ్ | ఎంఐఎం | 11387 |
47 | నవాబ్ సాహెబ్ కుంట | ష్రీన్ ఖాతున్ | ఎంఐఎం | 11956 |
48 | శాలిబండ | ముస్తఫా ఆలీ | ఎంఐఎం | 7198 |
49 | ఘన్సీ బజార్ | రేణు సోని | బీజేపీ | 859 |
50 | బేగంబజార్ | శంకర్ యాదవ్ | బీజేపీ | 7435 |
51 | గోషామహల్ | ముఖేశ్ సింగ్ | టీఆర్ఎస్ | 78 |
52 | పురానా పూల్ | రాజమోహన్ | ఎంఐఎం | 2877 |
53 | దూద్బౌలి | గఫార్ | ఎంఐఎం | 7596 |
54 | జహనుమా | ఖాజ ముబాషీరుద్దీన్ | ఎంఐఎం | 13718 |
55 | రామ్నాస్ పురా | మహ్మద్ ముబెన్ | ఎంఐఎం | 12550 |
56 | కిషన్బాగ్ | మహ్మద్ సలీం | ఎంఐఎం | 8288 |
57 | సులేమాన్ నగర్ | అబీదా సుల్తానా | ఎంఐఎం | 12980 |
58 | శాస్త్రిపురం | మిసబ్ ఉద్దీన్ | ఎంఐఎం | 9349 |
59 | మైలార్దేవ్పల్లి | టీ.శ్రీనివాసరెడ్డి | టీఆర్ఎస్ | 5474 |
60 | రాజేంద్రనగర్ | కే. శ్రీలత | టీఆర్ఎస్ | 3998 |
61 | అత్తాపూర్ | విజయ్ జంగయ్య | టీఆర్ఎస్ | 7774 |
62 | జియాగూడ | కృష్ణ | టీఆర్ఎస్ | 3762 |
63 | మంగళ్హట్ | పరమేశ్వరి సింగ్ | టీఆర్ఎస్ | 9376 |
64 | దత్తాత్రేయ | యూసఫ్ | ఎంఐఎం | 7442 |
65 | కార్వాన్ | రాజేందర్ యాదవ్ | ఎంఐఎం | 573 |
66 | లంగర్హౌస్ | అమీనా బేగం | ఎంఐఎం | 302 |
67 | గోల్కొండ | హఫ్పియా హనీఫ్ | ఎంఐఎం | 9385 |
68 | టోలీ చౌకి | ఆయేషా హుమ్రా | ఎంఐఎం | 8982 |
69 | నానల్నగర్ | నస్రీద్దీన్ | ఎంఐఎం | 6015 |
70 | మెహిదీపట్నం | మాజిద్ హుస్సేన్ | ఎంఐఎం | 3126 |
71 | గుడిమల్కాపూర్ | బంగారి ప్రకాశ్ | టీఆర్ఎస్ | 5568 |
72 | ఆసిఫ్నగర్ | ఫాతిమా అంజూం | ఎంఐఎం | 4782 |
73 | విజయ్ నగర్ | సల్మా అమీన్ | ఎంఐఎం | 2286 |
74 | అహ్మద్నగర్ | ఆయేషా రుబీనా | ఎంఐఎం | 6647 |
75 | రెడ్హిల్స్ | ఆయేషా ఫాతిమా | ఎంఐఎం | 1237 |
76 | మల్లేపల్లి | తర్నుమ్ నాజ్ | ఎంఐఎం | 4560 |
77 | జాంబాగ్ | మోహన్ | ఎంఐఎం | 5 |
78 | గన్ఫౌండ్రీ | మమతా గుప్తా | టీఆర్ఎస్ | 3353 |
79 | హిమాయత్నగర్ | హేమలత యాదవ్ | టీఆర్ఎస్ | 1691 |
80 | కాచిగూడ | చైతన్య కన్నా యాదవ్ | టీఆర్ఎస్ | 1811 |
81 | నల్లకుంట | శ్రీదేవి | టీఆర్ఎస్ | 10426 |
82 | గోల్నాక | కాలేరు పద్మ | టీఆర్ఎస్ | 5967 |
83 | అంబర్పేట | పులి జగన్ | టీఆర్ఎస్ | 1505 |
84 | బాగ్ అంబర్పేట | పద్మావతి డి.పి రెడ్డి | టీఆర్ఎస్ | 4870 |
85 | అడిక్మెట్ | హేమలత | టీఆర్ఎస్ | 6350 |
86 | ముషీరాబాద్ | భాగ్యలక్ష్మి యాదవ్ | టీఆర్ఎస్ | 4121 |
87 | రాంనగర్ | వీ.శ్రీనివాస రెడ్డి | టీఆర్ఎస్ | 11503 |
88 | భోలక్పూర్ | రామారావు | టీఆర్ఎస్ | 2909 |
89 | గాంధీనగర్ | పద్మా నరేశ్ | టీఆర్ఎస్ | 5104 |
90 | కవాడిగూడ | లాస్య నందిత | టీఆర్ఎస్ | 11388 |
91 | ఖైరతాబాద్ | పి. విజయా రెడ్డి | టీఆర్ఎస్ | 12373 |
92 | వెంకటేశ్వరకాలనీ | కవితా గోవర్దన్ రెడ్డి | టీఆర్ఎస్ | 8181 |
93 | బంజారాహిల్స్ | గద్వాల్ విజయ లక్ష్మి | టీఆర్ఎస్ | 7507 |
94 | షేక్పేట | రషీద్ ఫరజుద్దీన్ | ఎంఐఎం | 658 |
95 | జూబ్లీహిల్స్ | కాజసూర్యనారాయణ | టీఆర్ఎస్ | 4039 |
96 | యూసుఫ్గూడ | సంజయ్ గౌడ్ | టీఆర్ఎస్ | 264 |
97 | సోమాజిగూడ | విజయలక్ష్మి | టీఆర్ఎస్ | 3515 |
98 | అమీర్పేట | శేషు కుమారి | టీఆర్ఎస్ | 2555 |
99 | వెంగళ్రావునగర్ | మనోహర్ | టీఆర్ఎస్ | 1183 |
100 | సనత్నగర్ | లక్ష్మి బాల్ రెడ్డి | టీఆర్ఎస్ | 4085 |
101 | ఎర్రగడ్డ | షహీనా బేగం | ఎంఐఎం | 951 |
102 | రహ్మత్నగర్ | ఎం.ఎ షఫి | టీఆర్ఎస్ | 2330 |
103 | బోరబండ | బాబా ఫసీవుద్దీన్ | టీఆర్ఎస్ | 4511 |
104 | కొండాపూర్ | హమీద్ పటేల్ | టీఆర్ఎస్ | 7334 |
105 | గచ్చిబౌలి | సాయిబాబా | టీఆర్ఎస్ | 5860 |
106 | శేరిలింగంపల్లి | నరేంద్ర యాదవ్ | టీఆర్ఎస్ | 8643 |
107 | మాదాపూర్ | వి.జగదీశ్ గౌడ్ | టీఆర్ఎస్ | 6005 |
108 | మియాపూర్ | మేకా రమేశ్ | టీఆర్ఎస్ | 1030 |
109 | హఫీజ్పేట | పూజిత జగదీష్ గౌడ్ | టీఆర్ఎస్ | 8619 |
110 | చందానగర్ | నవతా రెడ్డి | టీఆర్ఎస్ | 2831 |
111 | భారతి నగర్ | సింధు ఆదర్శ్ రెడ్డి | టీఆర్ఎస్ | 168 |
112 | రామ చంద్రాపురం | అంజయ్య | టీఆర్ఎస్ | 5591 |
113 | పటాన్చెఱు | శంకర్ యాదవ్ | కాంగ్రెస్ | 1386 |
114 | కేపీహెచ్బీ కాలనీ | శ్రీనివాస రావు | టీడీపీ | 2735 |
115 | బాలాజీనగర్ | కావ్యా రెడ్డి | టీఆర్ఎస్ | 5349 |
116 | అల్లాపూర్ | సబీహా బేగం | టీఆర్ఎస్ | 4772 |
117 | మూసాపేట | టీ. శ్రావణ్ కుమార్ | టీఆర్ఎస్ | 4050 |
118 | ఫతేనగర్ | సతీష్ బాబు | టీఆర్ఎస్ | 5415 |
119 | ఓల్డ్ బోయిన్పల్లి | నర్సింగ్ యాదవ్ | టీఆర్ఎస్ | 8092 |
120 | బాలానగర్ | నరేంద్ర చారి | టీఆర్ఎస్ | 8820 |
121 | కూకట్పల్లి | జూపల్లి సత్యనారాయణ రావు | టీఆర్ఎస్ | 8998 |
122 | వివేకానందనగర్ | లక్ష్మీ బాయి | టీఆర్ఎస్ | 1492 |
123 | హైదర్నగర్ | జానకీ రామరాజు | టీఆర్ఎస్ | 439 |
124 | ఆల్విన్కాలనీ | వెంకటేశ్ గౌడ్ | టీఆర్ఎస్ | 4282 |
125 | గాజులరామారం | శేషగిరి | టీఆర్ఎస్ | 9480 |
126 | జగద్గిరిగుట్ట | కొలుకుల జగన్ | టీఆర్ఎస్ | 5559 |
127 | రంగారెడ్డినగర్ | విజయ శేఖర్ గౌడ్ | టీఆర్ఎస్ | 8601 |
128 | చింతల్ | రషీదా బేగం | టీఆర్ఎస్ | 4763 |
129 | సూరారం | సత్యనారాయణ | టీఆర్ఎస్ | 4660 |
130 | సుభాష్నగర్ | శాంతి రాజశ్రీ రాజేందర్ రెడ్డి | టీఆర్ఎస్ | 8895 |
131 | కుత్బుల్లాపూర్ | కూన గౌరీశ్ పారిజాత | టీఆర్ఎస్ | 1729 |
132 | జీడిమెట్ల | పద్మా ప్రతాప్ గౌడ్ | టీఆర్ఎస్ | 3614 |
133 | మచ్చబొల్లారం | జితేంద్ర నాథ్ | టీఆర్ఎస్ | 9501 |
134 | అల్వాల్ | విజయ శాంతి రెడ్డి | టీఆర్ఎస్ | 6354 |
135 | వెంకటాపురం | సబితా కిషోర్ | టీఆర్ఎస్ | 7554 |
136 | నేరెడ్మెట్ | కటిక నేని శ్రీదేవి | టీఆర్ఎస్ | 7135 |
137 | వినాయకనగర్ | పుష్పలతా రెడ్డి | టీఆర్ఎస్ | 8655 |
138 | మౌలాలి | ఫాతిమా అమీనుద్దీన్ | టీఆర్ఎస్ | 1962 |
139 | ఈస్ట్ ఆనంద్బాగ్ | ఆకుల నర్సింగ్ రావు | టీఆర్ఎస్ | 6707 |
140 | మల్కాజిగిరి | జగదీష్ గౌడ్ | టీఆర్ఎస్ | 4367 |
141 | గౌతమ్నగర్ | శిరీషా జితేందర్ రెడ్డి | టీఆర్ఎస్ | 6807 |
142 | అడ్డగుట్ట | విజయ కుమారి | టీఆర్ఎస్ | 14265 |
143 | తార్నాక | సరస్వతి హరి | టీఆర్ఎస్ | 12941 |
144 | మెట్టుగూడ | భార్గవి | టీఆర్ఎస్ | 8029 |
145 | సీతాఫల్మండి | హేమ | టీఆర్ఎస్ | 15071 |
146 | బౌద్ధనగర్ | ధనుంజయ్ దయానంద్ గౌడ్ | టీఆర్ఎస్ | 9681 |
147 | బన్సీలాల్పేట | హేమలత | టీఆర్ఎస్ | 11700 |
148 | రాంగోపాల్పేట | అరుణా గౌడ్ | టీఆర్ఎస్ | 6499 |
149 | బేగంపేట | తరుణి నాయి | టీఆర్ఎస్ | 5751 |
150 | మోండామార్కెట్ | ఆకుల రూప హరికృష్ణ | టీఆర్ఎస్ | 6325 |
Saturday, February 6, 2016
డివిజన్ల వారీగా ఫలితాలు ఇవీ..
Friday, February 5, 2016
జన్మభూమి అరాచకాలపై హైకోర్టు మండిపాటు
* బతికి ఉన్న మనిషిని చనిపోయినట్లుగా ధ్రువీకరిస్తారా
* ఇవేం అరాచకాలు.. అసలు క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతోంది
* మీరు అధికారంలో ఉండచ్చు. తర్వాత మరొకరు అధికారంలోకి రావచ్చు
హైదరాబాద్) ఆంధ్రప్రదేశ్ లో రాజ్యమేలుతున్న జన్మభూమి కమిటీల అరాచకాల్ని గౌరవ హైకోర్టు తీవ్రంగా ప్రశ్నించింది. ఏ అధికారం లేకపోయినప్పటికీ, జన్మభూమి కమిటీలు చెప్పాయన్న కారణంతో అర్హులైన లబ్దిదారులకు అందాల్సిన ప్రజా సంక్షేమ పథకాల్ని రద్దు చేస్తుండటంపై హైకోర్టు మండిపడింది. ఈ కమిటీల నిర్వాకంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
శ్రీకాకుళం జిల్లా కు చెందిన అమ్మణ్ణమ్మ అనే ముదుసలి మహిళకు పెన్షన్ ఒక్కటే జీవనాధారం. ఆమె చనిపోయిందని జన్మభూమి కమిటీ చెప్పటంతో పెన్షన్ రద్దు చేశారు. అలాగే మెట్ట లక్ష్మి అనే వితంతువు కి తర్వాత కాలంలో ఆమె వితంతు కోటాలోకి రాదంటూ రద్దు చేశారు. ఇటువంటి ఘోరాల మీద దాదాపు 75 మంది హైకోర్టుని ఆశ్రయించారు. వీటిని పరిశీలించిన గౌరవ న్యాయమూర్తి జస్టిస్ సీవీ నాగార్జున రెడ్డి ప్రభుత్వ యంత్రాంగం తీరుని తప్ప పట్టారు.వేటి ఆధారంగా ఈ నిర్ణయాలు చేస్తున్నారని ప్రశ్నించారు. రాజకీయ కారణాలతో పెన్షన్లు రద్దు చేస్తున్నారన్న పిటీషనర్ల వాదనల్ని కోర్టు పరిగణనలోకి తీసుకొంది. అప్పీల్ తీసుకొనేందుకు కూడా స్థానిక ఎంపీడీవో తిరస్కరించారని, అధికార పార్టీ నాయకులు చెబితేనే అభ్యర్థన తీసుకొంటామని చెప్పారని న్యాయవాదులు కోర్టుకు తెలియచేశారు.
దీని మీద న్యాయస్థానం తీవ్రంగ స్పందించింది. “ ముదుసలి మహిళను చూస్తే ఆమె పెన్షన్ కు అర్హురాలని ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. అధికారులకు మాత్రం ఇవేమీ కనిపించటం లేదు. భౌతికంగా చూసి కూడా కాదంటున్నారు ధ్రువీకరణ పత్రం ఇచ్చినా అంగవైకల్యం లేదంటున్నారు. పెన్షన్ లేదంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటివి వాంఛనీయం కాదు. ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. కోర్టు దగ్గరకు వచ్చిన వారు సముద్రంలో నీటిచుక్క మాత్రమే. ఈ రోజు మీరు అధికారంలో ఉండి ఇలా చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నవారు రేపు అధికారంలోకి వస్తే వారూ మిమ్మల్ని చూసి ఇలానే చేయవచ్చు. అంతిమంగా ఇబ్బంది పడేది మాత్రం అమాయకపు ప్రజలే” అని న్యాయమూర్తి అభిప్రాయ పడ్డారు.
ఈ అంశం మీద ఉప లోకాయుక్త ఇచ్చిన ఆదేశాల అమలుకు తీసుకొన్న చర్యల్ని వివరించాలన్నారు. దీని మీద విచారణ ను ఈ నెల 16 కు వాయిదా వేశారు.
* ఇవేం అరాచకాలు.. అసలు క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతోంది
* మీరు అధికారంలో ఉండచ్చు. తర్వాత మరొకరు అధికారంలోకి రావచ్చు
హైదరాబాద్) ఆంధ్రప్రదేశ్ లో రాజ్యమేలుతున్న జన్మభూమి కమిటీల అరాచకాల్ని గౌరవ హైకోర్టు తీవ్రంగా ప్రశ్నించింది. ఏ అధికారం లేకపోయినప్పటికీ, జన్మభూమి కమిటీలు చెప్పాయన్న కారణంతో అర్హులైన లబ్దిదారులకు అందాల్సిన ప్రజా సంక్షేమ పథకాల్ని రద్దు చేస్తుండటంపై హైకోర్టు మండిపడింది. ఈ కమిటీల నిర్వాకంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
దీని మీద న్యాయస్థానం తీవ్రంగ స్పందించింది. “ ముదుసలి మహిళను చూస్తే ఆమె పెన్షన్ కు అర్హురాలని ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. అధికారులకు మాత్రం ఇవేమీ కనిపించటం లేదు. భౌతికంగా చూసి కూడా కాదంటున్నారు ధ్రువీకరణ పత్రం ఇచ్చినా అంగవైకల్యం లేదంటున్నారు. పెన్షన్ లేదంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటివి వాంఛనీయం కాదు. ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. కోర్టు దగ్గరకు వచ్చిన వారు సముద్రంలో నీటిచుక్క మాత్రమే. ఈ రోజు మీరు అధికారంలో ఉండి ఇలా చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నవారు రేపు అధికారంలోకి వస్తే వారూ మిమ్మల్ని చూసి ఇలానే చేయవచ్చు. అంతిమంగా ఇబ్బంది పడేది మాత్రం అమాయకపు ప్రజలే” అని న్యాయమూర్తి అభిప్రాయ పడ్డారు.
ఈ అంశం మీద ఉప లోకాయుక్త ఇచ్చిన ఆదేశాల అమలుకు తీసుకొన్న చర్యల్ని వివరించాలన్నారు. దీని మీద విచారణ ను ఈ నెల 16 కు వాయిదా వేశారు.
గ్రేటర్ ఎన్నికల ఫలితాలపై అభ్యర్థుల్లో ఉత్కంఠ
గ్రేటర్ ఎన్నికల ఫలితాలపై అభ్యర్థుల్లో ఉత్కంఠత నెలకొంది. క్లైమాక్స్లో శుభంకార్డు పడుతుందా! ఊహించని ఫలితం.. ఎదురైతే.. ఎలా! పైకి.. గంభీరంగా కనిపిస్తున్నా.. ప్రధాన పార్టీల అభ్యర్థుల అంతర్మథనం ఇదే. అధికార.. ప్రతిపక్ష పార్టీల నుంచి బరిలోకి దిగిన వారసులకు.. ఈ గెలుపు..తప్పనిసరిగా మారింది. భవిష్యత్తు రాజకీయాల్లో క్రియాశీలకంగా మారేందుకు కీలకమైంది.
అమాత్యుల మెడపై కత్తి
మారిన రాజకీయ సమీకరణలతో కొత్తపొత్తులు పుట్టుకొచ్చాయి. అధికారపార్టీ పీఠంపై గురిపెడితే.. ప్రతిపక్షాలు.. సమ ఉజ్జీలుగా నిలిచేందుకు అహర్నిశలు శ్రమించాయి. సర్వేలతో గెలుపుగుర్రాలకు టిక్కెట్ కేటాయించామంటూ బహిరంగంగా ప్రకటించాయి. వందసీట్లు రాకపోతే.. రాజకీయ సన్యాసమేనంటూ నేతలు సవాల్ విసరటంతో గ్రేటర్లో రాజకీయం వేడెక్కింది. సెటిలర్ల ఓట్లను రాబట్టేందుకు ఏపీ, తెలంగాణ మంత్రులంతా.. నగరంలోనే తిష్టవేశారు. డివిజన్లలో ప్రచారంతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అమాత్యులు.. పర్యటించిన బస్తీలు.. కాలనీల్లో ఎంతవరకూ ప్రభావితం చేయగలిగారనేది.. అక్కడి అభ్యర్థుల విజయంతో బయటపడనుంది. ముఖ్యంగా.. అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు మెడపై కత్తిలా మారిందనేది బహిరంగ రహస్యం. సానుకూలమంటూ.. నివేదికలిచ్చిన.. డివిజన్లలో ఫలితం.. తారుమారైతే.. అనే ఆలోచనే నేతలగుండెల్లో గుబులు రేకెత్తిస్తోంది.
ఏడేళ్లుగా ఎదురుచూపులు
2009 ఎన్నికల్లో టిక్కెట్ కోసం ప్రయత్నించారు. మరికొందరు కొద్దిపాటి ఓట్లతో ఓటమి చవిచూశారు. వారంతా.. మరోమారు అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఏడేళ్లపాటు ఎదురుచూశారు. కొందరి ఆశ.. డివిజన్ల మార్పుతో గల్లంతైంది. మరికొందరు.. బంధుగణాన్ని రంగంలోకి దింపి
ముచ్చట తీర్చుకున్నారు. యాభైశాతం మహిళా రిజర్వేషన్ల పుణ్యమాంటూ.. సతులు.. పుత్రికలు.. అమ్మలు.. బామ్మలు పదిరోజుల పాటు గల్లీగల్లీ చుట్టారు. కీలకమైన డివిజన్లలో కోట్లు కుమ్మరించారు. నగరంలోని ఓ ప్రధాన డివిజన్లో.. ఒక్కరోజు ఏకంగా 70లక్షలు వెచ్చించినట్లు సమాచారం. ఇక్కడ పోటీ.. నువ్వా-నేనా అన్నట్లుగా ఉండటంతో... అనుచరులతో బూతల వారీగా లెక్కలు తెప్పించుకుని.. పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
బెట్టింగ్కూ.. భయమే
క్రికెట్.. కబడ్డీ.. ఎలక్షన్ సమయంలో.. ఫలితాలపై బెట్టింగ్లు కామన్. కానీ.. గ్రేటర్ బరిలో.. గ్యారంటీ గెలుపంటూ.. చెబుతున్న పార్టీలు సైతం పందెం.. మాట వినగానే వెనుకంజ వేస్తున్నాయి. కూకట్పల్లి నియోజకవర్గంలోని ఓ డివిజన్ అధికార పార్టీకు కీలకంగా మారింది. అక్కడ.. హోరాహోరీ పోటీ జరిగింది. ఇరువైపులా అనుచరులు లక్షల్లో పందేలకు దిగి.. చివరి నిమిషంలో విరమించుకున్నట్లు సమాచారం. ఉప్పల్ నియోజకవర్గంలో.. ఓ ప్రజాప్రతినిధి తమదే విజయమంటూ.. ధీమా వ్యక్తంచేశాడు. దీంతో ప్రత్యర్థులు.. బెట్ అనగానే.. వద్దులే గురూ! మాటమార్చారని తెలిసింది.
అమాత్యుల మెడపై కత్తి
మారిన రాజకీయ సమీకరణలతో కొత్తపొత్తులు పుట్టుకొచ్చాయి. అధికారపార్టీ పీఠంపై గురిపెడితే.. ప్రతిపక్షాలు.. సమ ఉజ్జీలుగా నిలిచేందుకు అహర్నిశలు శ్రమించాయి. సర్వేలతో గెలుపుగుర్రాలకు టిక్కెట్ కేటాయించామంటూ బహిరంగంగా ప్రకటించాయి. వందసీట్లు రాకపోతే.. రాజకీయ సన్యాసమేనంటూ నేతలు సవాల్ విసరటంతో గ్రేటర్లో రాజకీయం వేడెక్కింది. సెటిలర్ల ఓట్లను రాబట్టేందుకు ఏపీ, తెలంగాణ మంత్రులంతా.. నగరంలోనే తిష్టవేశారు. డివిజన్లలో ప్రచారంతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అమాత్యులు.. పర్యటించిన బస్తీలు.. కాలనీల్లో ఎంతవరకూ ప్రభావితం చేయగలిగారనేది.. అక్కడి అభ్యర్థుల విజయంతో బయటపడనుంది. ముఖ్యంగా.. అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు మెడపై కత్తిలా మారిందనేది బహిరంగ రహస్యం. సానుకూలమంటూ.. నివేదికలిచ్చిన.. డివిజన్లలో ఫలితం.. తారుమారైతే.. అనే ఆలోచనే నేతలగుండెల్లో గుబులు రేకెత్తిస్తోంది.
ఏడేళ్లుగా ఎదురుచూపులు
2009 ఎన్నికల్లో టిక్కెట్ కోసం ప్రయత్నించారు. మరికొందరు కొద్దిపాటి ఓట్లతో ఓటమి చవిచూశారు. వారంతా.. మరోమారు అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఏడేళ్లపాటు ఎదురుచూశారు. కొందరి ఆశ.. డివిజన్ల మార్పుతో గల్లంతైంది. మరికొందరు.. బంధుగణాన్ని రంగంలోకి దింపి
ముచ్చట తీర్చుకున్నారు. యాభైశాతం మహిళా రిజర్వేషన్ల పుణ్యమాంటూ.. సతులు.. పుత్రికలు.. అమ్మలు.. బామ్మలు పదిరోజుల పాటు గల్లీగల్లీ చుట్టారు. కీలకమైన డివిజన్లలో కోట్లు కుమ్మరించారు. నగరంలోని ఓ ప్రధాన డివిజన్లో.. ఒక్కరోజు ఏకంగా 70లక్షలు వెచ్చించినట్లు సమాచారం. ఇక్కడ పోటీ.. నువ్వా-నేనా అన్నట్లుగా ఉండటంతో... అనుచరులతో బూతల వారీగా లెక్కలు తెప్పించుకుని.. పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
బెట్టింగ్కూ.. భయమే
క్రికెట్.. కబడ్డీ.. ఎలక్షన్ సమయంలో.. ఫలితాలపై బెట్టింగ్లు కామన్. కానీ.. గ్రేటర్ బరిలో.. గ్యారంటీ గెలుపంటూ.. చెబుతున్న పార్టీలు సైతం పందెం.. మాట వినగానే వెనుకంజ వేస్తున్నాయి. కూకట్పల్లి నియోజకవర్గంలోని ఓ డివిజన్ అధికార పార్టీకు కీలకంగా మారింది. అక్కడ.. హోరాహోరీ పోటీ జరిగింది. ఇరువైపులా అనుచరులు లక్షల్లో పందేలకు దిగి.. చివరి నిమిషంలో విరమించుకున్నట్లు సమాచారం. ఉప్పల్ నియోజకవర్గంలో.. ఓ ప్రజాప్రతినిధి తమదే విజయమంటూ.. ధీమా వ్యక్తంచేశాడు. దీంతో ప్రత్యర్థులు.. బెట్ అనగానే.. వద్దులే గురూ! మాటమార్చారని తెలిసింది.
పురానాపూల్లో మ.1:30 గంటలకు 55 శాతం పోలింగ్
హైదరాబాద్ : పురానాపూల్లో రీపోలింగ్లో పెద్ద సంఖ్యలో ఓటర్లు పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం 1:30 గంటల వరకు 55 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. మరో మూడు గంటల్లో పోలింగ్ పూర్తి అవుతుండటంతో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. పురానాపూల్లోని 36 కేంద్రాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది.
Thursday, February 4, 2016
ఉదయం ఖచ్చితంగా తినకూడని కొన్ని ఆహారాలు
సాధారణంగా ఉదయం బ్రేక్ ఫాస్ట్ తో తీసుకొనే ఆహారాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని చెబుతారు. అందులో మన దినచర్యను హెల్తీ ఫుడ్స్ తో ప్రారంభించినట్లైతే , మన శరీరానికి అవసరం అయ్యే ప్రోటీన్లు, న్యూట్రీషియన్స్, విటమిన్లు పూర్తిగా బాడీ గ్రహించడం వల్ల ఆరోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా...ఎనర్జిటిక్ గా ఉంటారు . అయితే కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను కూడా ఉదయం సమయంలో తీసుకోకూడదంటున్నారు ఆహార నిపుణులు, మరి అవేంటి?
మన ప్రతి రోజూ ఉదయం తీసుకొనే మొదటి ఆహారం మన శరీరానికి అవసరం అయ్యే ఇంధనం వంటిది. రోజంతా మిమ్మల్ని యాక్టివ్ గా ఉంచడానికి గ్రేట్ గా సహాయపడుతుంది . మిమ్మల్ని అలసటక మరియు బద్దకానికి గురైనప్పుడు, అది కూడా ఉదయం సమయంలో ఇలాంటి ఫీలింగ్స్ కలిగినప్పుడు , ఇక ఆరోజంతా మగతగానే అనిపిస్తుంది.
తాజా పండ్లను ఉదయం తినడం వల్ల పొందే గ్రేట్ హెల్త్ బెనిఫిట్స్ మరియు బ్రేక్ ఫాస్ట్ మీ ఆకలిని సాటిస్ఫై చేస్తుంది. అంతే కాదు మీరు తీసుకోనే ఉదయం అల్పాహారం మద్యహ్నాన భోజనం తీసుకొనే వరకూ మీకు ఆకలి అవ్వకుండా చేస్తుంది. దాంతో పాటు మీ బ్లడ్ షుగర్ లెవల్స్ ను స్థిరంగా ఉంచుతుంది. అయితే ఉదయం తీసుకొనే కొన్ని ఆహారాలు శరీరానికి ఒంటబట్టకు తిరిగి మిమ్మల్ని నిస్తేజంగా మార్చుతుంది.
అరటిపండ్లు తినడానికి 25 ఖచ్చితమైన కారణాలు ఇంకా మీరు బరువు తగ్గించుకొనే ప్లాన్ లో ఉన్నప్పుడు మీరు తీసుకొనే బ్రేక్ ఫాస్ట్ ఎంపిక మీద జాగ్రత్తగా ఉండాలి .
ఉదయం ఖచ్చితంగా తినకూడని కొన్ని ఆహారాలు
బ్రెడ్ అండ్ జామ్: చిన్న వయస్సు నుండి బ్రెడ్ అండ్ జామ్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే ఉదయం సమయంలో జామ్ తీసుకోవడం నిజంగా ఆరోగ్యానికి అంత మంచిది కాదు . జామ్ కు ప్రత్యామ్నాయంగా బ్రెడ్ అండ్ ఎగ్ తీసుకోవడం లేదా కేవలం గుడ్డు మాత్రమే బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.
డోనట్స్: డోనట్స్ పాస్టీస్ లేదా మైదాతో తయారుచేసిన ఇతర ఏ పదార్థాలైనా సరే మార్నింగ్ తీసుకోవడం చాలా చెడు అలవాటుగా గుర్తించాలి. హెల్తీ ఫుడ్స్ ను ఎంపికచేసుకోవాలి.
బర్గర్: ఇంకా బర్గర్ వంటివి కూడా ఉదయం సమయంలో తీసుకోవడం కూడా చెడే..చాలా మంది , ఈ మోడ్రన్ ప్రపంచంలో సమయం లేక ఇలాంటి రెడీ మేడ్ బర్గర్స్ ను పిక్ చేసుకుంటుంటారు . వీటి తయారీకి ఉపయోగించే ప్రిజర్వేటివ్స్ మరియు సాస్, ఆడిటివ్స్ వంటివి ఆరోగ్యానికి చాలా హానికలిగిస్తాయి.
షుగరీ జ్యూస్: ఫ్రూట్ జ్యూస్ లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. షుగర్ కంటెంట్స్ ఉన్నవి ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవడం ఒక బ్యాడ్ చాయిస్ అనే చెప్పుకోవచ్చు . అందుకు వెజిటేబుల్ జ్యూస్ తీసుకోవడం వల్ల మీకు అవసరం అయ్యే ఎనర్జీ, న్యూట్రీషియన్స్ ను పొందవచ్చు .
గ్రెయినీ ప్రొడక్ట్స్ : చాలా వరకూ సెరల్ ప్రొడక్ట్స్ గ్రెయిన్స్ తో తయారుచేసినవే . వీటిలో గ్లూటిన్ మరియు షుగర్స్ ఉంటాయి. కాబట్టి సెరెల్స్ ఉదయం తీసుకోవడం అంత ఆరోగ్యకరం కాదు.
స్వీట్స్ అండ్ డిజర్ట్స్: మీరు షుగర్ మరియు స్వీట్స్ కు వ్యసనపరులుగా మారిఉన్నా, ఉదయం మాత్రమే స్వీట్స్ మరియు డిజర్ట్స్ తీసుకోకూడదు. ఇలాంటి వాటిల్లో షుగర్స్ అధికంగా ఉంటాయి. ఇది కార్బోహైడ్రేట్ మరియు మైదాతో తయారుచేస్తారు. ఇది బ్లడ్ షుగర్ లెవల్స్ ను అమాంతంగా పెంచేస్తుంది.
మన ప్రతి రోజూ ఉదయం తీసుకొనే మొదటి ఆహారం మన శరీరానికి అవసరం అయ్యే ఇంధనం వంటిది. రోజంతా మిమ్మల్ని యాక్టివ్ గా ఉంచడానికి గ్రేట్ గా సహాయపడుతుంది . మిమ్మల్ని అలసటక మరియు బద్దకానికి గురైనప్పుడు, అది కూడా ఉదయం సమయంలో ఇలాంటి ఫీలింగ్స్ కలిగినప్పుడు , ఇక ఆరోజంతా మగతగానే అనిపిస్తుంది.
తాజా పండ్లను ఉదయం తినడం వల్ల పొందే గ్రేట్ హెల్త్ బెనిఫిట్స్ మరియు బ్రేక్ ఫాస్ట్ మీ ఆకలిని సాటిస్ఫై చేస్తుంది. అంతే కాదు మీరు తీసుకోనే ఉదయం అల్పాహారం మద్యహ్నాన భోజనం తీసుకొనే వరకూ మీకు ఆకలి అవ్వకుండా చేస్తుంది. దాంతో పాటు మీ బ్లడ్ షుగర్ లెవల్స్ ను స్థిరంగా ఉంచుతుంది. అయితే ఉదయం తీసుకొనే కొన్ని ఆహారాలు శరీరానికి ఒంటబట్టకు తిరిగి మిమ్మల్ని నిస్తేజంగా మార్చుతుంది.
అరటిపండ్లు తినడానికి 25 ఖచ్చితమైన కారణాలు ఇంకా మీరు బరువు తగ్గించుకొనే ప్లాన్ లో ఉన్నప్పుడు మీరు తీసుకొనే బ్రేక్ ఫాస్ట్ ఎంపిక మీద జాగ్రత్తగా ఉండాలి .
ఉదయం ఖచ్చితంగా తినకూడని కొన్ని ఆహారాలు
రేపు పురానాపూల్లో రీపోలింగ్...
హైదరాబాద్: రేపు పురానాపూల్లో రీపోలింగ్ జరపాలని జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి జనార్ధన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఘర్షణల వల్ల కొందరు ఓటర్లు ఓటు వేయలేకపోయారు. అఖిలపక్ష నేతల డిమాండ్తో ఈసీ రీపోలింగ్కు ఆదేశించింది. 36 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. 34,413 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కౌంటింగ్ సమయాన్ని మార్చే అవకాశం ఉంది.
జీహెచ్ఎంసీ ఓట్ల లెక్కింపు రేపు సాయంత్రం 4 గంటలకు వాయిదా:
ఘర్షణల వల్ల కొందరు ఓటర్లు ఓటు వేయలేక పోయినందు వల్ల పురానాపూల్ డివిజన్లో రేపు రీపోలింగ్ జరపాలని ఈసీ ఆదేశించింది.దీంతో జీహెచ్ఎంసీ ఓట్ల లెక్కింపు రేపు సాయంత్రం 4 గంటలకు వాయిదా వేశారు. పురానాపూల్లో రీపోలింగ్ కారణంగా ఓట్ల లెక్కింపును వాయిదా వేసినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
జీహెచ్ఎంసీ ఓట్ల లెక్కింపు రేపు సాయంత్రం 4 గంటలకు వాయిదా:
ఘర్షణల వల్ల కొందరు ఓటర్లు ఓటు వేయలేక పోయినందు వల్ల పురానాపూల్ డివిజన్లో రేపు రీపోలింగ్ జరపాలని ఈసీ ఆదేశించింది.దీంతో జీహెచ్ఎంసీ ఓట్ల లెక్కింపు రేపు సాయంత్రం 4 గంటలకు వాయిదా వేశారు. పురానాపూల్లో రీపోలింగ్ కారణంగా ఓట్ల లెక్కింపును వాయిదా వేసినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
Wednesday, February 3, 2016
సీఎం హామీ ఇచ్చారు కాబట్టే రోడ్డెక్కాం: ముద్రగడ
కిర్లంపూడి: జనవరి 31న తునిలో నిర్వహించిన కాపు ఐక్య గర్జన సమావేశానికి ఏ గ్రామం నుంచి ఎంత మంది వచ్చారో తమ వద్ద లెక్కలు ఉన్నాయని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని తన సొంత గ్రామమైన కిర్లంపూడిలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు కాబట్టే ఇప్పుడు అమలు చేయమని అడుగుతున్నామని ఆయన అన్నారు. కాపులను బీసీల్లో చేర్చాలనే డిమాండ్ను నేరవేర్చేందుకే శుక్రవారం ఉదయం 9 గంటలకు నేను, నాభార్య ఆమరణ నిరాహారదీక్షకు చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు.
తమ జాతికి రిజర్వేషన్లు కల్పించాలన్న ఉద్దశంతోనే తాను ఉద్యమబాట పట్టానే తప్ప, స్వప్రయోజనాల కోసం కాదన్నారు. కాపులను బీసీల్లో చేర్చాతామని ఆశ చూపి, తమ జాతిని నమ్మించి ఓట్లు వేయించుకున్న చంద్రబాబు, అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేసేందుకే ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. కాపు ఐక్య గర్జన సమావేశం జరగకుండా అధికార పార్టీ ఎన్నో ప్రయత్నాలు చేసినందని ఆయన ఆరోపించారు. కాపు ఉద్యమంలో పాలు పంచుకున్న ఏ ఒక్కరికీ దురుద్దేశం లేదన్నారు. కోట్ల విజయ భాస్కర రెడ్డి ఇచ్చిన జీవోను సీఎం చంద్రబాబు పచ్చి మోసం అంటూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాపులకు సంబంధించిన డేటా అంతా సీఎం చంద్రబాబు నాయుడు వద్ద ఉందన్నారు. సీఎం హామీ ఇచ్చారు కాబట్టే, తాను రోడ్డుపైకి వచ్చానని పేర్కొన్నారు. సీఎం ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతున్నా అన్నారు. కాపు రిజర్వేషన్లపై తాను పలుమార్లు లేఖలు రాసినా సీఎం నుంచి సందేశం రాలేదన్నారు. మా జాతికి ఫలాల కోసమే చూస్తున్నానని పేర్కొన్న ముద్రగడ, మీరైనా జీవో ఇవ్వాలని అడుగతున్నానని అన్నారు. కమిషన్ పేరుతో ఏళ్ల తరబడి తాత్సారం చేయడం భావ్యం కాదన్నారు. అలా కాకుండా ఇతర బీసీ సంఘాల సోదరులతో చర్చలు జరపడం చంద్రబాబుకు సరికాదని ఆయన సూచించారు. దళితులైనప్పటికీ అంబేద్కర్, దామోదరం సంజీవయ్య తమ జాతికి ఎంతో మేలు చేశారని అన్నారు. 1915లో అంబేద్కర్ బ్రిటన్ వెళ్లి మరీ కాపు రిజర్వేషన్ల కోసం పని చేశారని తన మిత్రులు చెప్పారని ఆయన పేర్కొన్నారు. భారత దేశంలో ఎంతో కాలంగా కాపులకు రిజర్వేషన్లు అమలులో ఉన్నాయన్నారు. ఇప్పుడు వాటినే అడుగుతున్నామని చెప్పారు. కాపు రిజర్వేషన్ ఉద్యమంలో పాల్గొన్న ఎవరికీ దాడులు చేయాలన్న ఉద్దేశం లేదన్నారు. సార్...రమ్మంటున్నారని పిలిచి, నా భార్యను కూడా ఆ రోజు కొందరు అవమానించారని ఆయన తెలిపారు. కాపు ఐక్య గర్జనలో భాగంగా ఆందోళన జరుగుతున్నప్పుడు నలుగురు వ్యక్తులు గెస్ట్హౌస్లో ఉన్న తన భార్యవద్దకు వెళ్లి సర్ రమ్మంటున్నారని చెప్పారట. నేనైతే ఆవిడను పిలవలేదు. 'మరి, వాళ్లెవరో.. ఎందుకలా అన్నారో' అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మేడపైనున్న వాటర్ ట్యాంక్ ధ్వంసం చేశారని, తనని కూడా అవమానించారని ఆయన చెప్పారు. ఉద్యమం నుంచి వెనక్కి వెళ్లేలా తనపై ఒత్తిడి తెచ్చారని ఆయన పేర్కొన్నారు. సీఎం తలచుకుంటే కాపులకు రిజర్వేషన్ వచ్చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
తమ జాతికి రిజర్వేషన్లు కల్పించాలన్న ఉద్దశంతోనే తాను ఉద్యమబాట పట్టానే తప్ప, స్వప్రయోజనాల కోసం కాదన్నారు. కాపులను బీసీల్లో చేర్చాతామని ఆశ చూపి, తమ జాతిని నమ్మించి ఓట్లు వేయించుకున్న చంద్రబాబు, అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేసేందుకే ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. కాపు ఐక్య గర్జన సమావేశం జరగకుండా అధికార పార్టీ ఎన్నో ప్రయత్నాలు చేసినందని ఆయన ఆరోపించారు. కాపు ఉద్యమంలో పాలు పంచుకున్న ఏ ఒక్కరికీ దురుద్దేశం లేదన్నారు. కోట్ల విజయ భాస్కర రెడ్డి ఇచ్చిన జీవోను సీఎం చంద్రబాబు పచ్చి మోసం అంటూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాపులకు సంబంధించిన డేటా అంతా సీఎం చంద్రబాబు నాయుడు వద్ద ఉందన్నారు. సీఎం హామీ ఇచ్చారు కాబట్టే, తాను రోడ్డుపైకి వచ్చానని పేర్కొన్నారు. సీఎం ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతున్నా అన్నారు. కాపు రిజర్వేషన్లపై తాను పలుమార్లు లేఖలు రాసినా సీఎం నుంచి సందేశం రాలేదన్నారు. మా జాతికి ఫలాల కోసమే చూస్తున్నానని పేర్కొన్న ముద్రగడ, మీరైనా జీవో ఇవ్వాలని అడుగతున్నానని అన్నారు. కమిషన్ పేరుతో ఏళ్ల తరబడి తాత్సారం చేయడం భావ్యం కాదన్నారు. అలా కాకుండా ఇతర బీసీ సంఘాల సోదరులతో చర్చలు జరపడం చంద్రబాబుకు సరికాదని ఆయన సూచించారు. దళితులైనప్పటికీ అంబేద్కర్, దామోదరం సంజీవయ్య తమ జాతికి ఎంతో మేలు చేశారని అన్నారు. 1915లో అంబేద్కర్ బ్రిటన్ వెళ్లి మరీ కాపు రిజర్వేషన్ల కోసం పని చేశారని తన మిత్రులు చెప్పారని ఆయన పేర్కొన్నారు. భారత దేశంలో ఎంతో కాలంగా కాపులకు రిజర్వేషన్లు అమలులో ఉన్నాయన్నారు. ఇప్పుడు వాటినే అడుగుతున్నామని చెప్పారు. కాపు రిజర్వేషన్ ఉద్యమంలో పాల్గొన్న ఎవరికీ దాడులు చేయాలన్న ఉద్దేశం లేదన్నారు. సార్...రమ్మంటున్నారని పిలిచి, నా భార్యను కూడా ఆ రోజు కొందరు అవమానించారని ఆయన తెలిపారు. కాపు ఐక్య గర్జనలో భాగంగా ఆందోళన జరుగుతున్నప్పుడు నలుగురు వ్యక్తులు గెస్ట్హౌస్లో ఉన్న తన భార్యవద్దకు వెళ్లి సర్ రమ్మంటున్నారని చెప్పారట. నేనైతే ఆవిడను పిలవలేదు. 'మరి, వాళ్లెవరో.. ఎందుకలా అన్నారో' అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మేడపైనున్న వాటర్ ట్యాంక్ ధ్వంసం చేశారని, తనని కూడా అవమానించారని ఆయన చెప్పారు. ఉద్యమం నుంచి వెనక్కి వెళ్లేలా తనపై ఒత్తిడి తెచ్చారని ఆయన పేర్కొన్నారు. సీఎం తలచుకుంటే కాపులకు రిజర్వేషన్ వచ్చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
గ్రేటర్ సమరం ముగిసింది....
హైదరాబాద్ : గ్రేటర్ సమరం ముగిసింది. 25 రోజుల క్రితం మొదలైన ఎన్నికల సంద డికి పోలింగ్తో తెరపడింది. సూత్రప్రాయంగా 45 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారి జనార్దనరెడ్డి తెలిపారు. బుధవారం తుది లెక్కలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే సాయంత్రం 4.30 వరకు నమోదైన వివరాల ప్రకారం 37.70 శాతం పోలింగ్ నమోదైందని జీహెచ్ఎంసీ ఓ ప్రకటనలో పేర్కొంది. పోరు ముగిసిన నేపథ్యంలో ఇక తేలాల్సింది అభ్యర్థుల భవితవ్యం. ఈనెల 5న జరిగే లెక్కింపుతో విజేతలెవరు..? పరాజితులెవరు..? అన్నది తేలిపోనుంది. శుక్రవారం ఉదయం 8 గంటలకు 24 కేంద్రాల్లో గ్రేటర్లోని 150 వార్డులకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. కౌంటింగ్ కోసం 893 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 3,200 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. అరగంటలోపే మొదటి ఫలితం వెలువడుతుందని అధికారులు చెబుతున్నారు. గ్రేటర్ ఎన్నికల నిర్వహణకు జనవరి 8న రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. 12 నుంచి ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ 17తో ముగిసింది. 18న స్ర్కూటినీ.. 19, 20, 21తేదీల్లో ఉపసంహరణకు అవకాశం కల్పించారు. 21న సాయంత్రం గ్రేటర్ బరిలో నిలిచిన 1,333 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. 22 నుంచి గ్రేటర్లో ప్రారంభమైన ప్రచార హోరు 31తో ముగిసింది. మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ పలు ప్రాంతాల్లో 5.45 వరకు కొనసాగింది. పాతబస్తీలో కాంగ్రెస్ అగ్రనేతలు ఉత్తమ్కుమార్రెడ్డి, షబ్బీర్అలీలపై దాడి, డిప్యూటీ సీఎం కొడుకు అజంఅలీపై దాడి మినహ పెద్దగా ఘర్షణలు చోటు చేసుకోలేదు. కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు ఘటనలు జరిగాయి. కొన్ని ప్రాంతాల్లో తమ ఓట్లు తొలగించారని పౌరులు ఆందోళన వ్యక్తం చేశారు. పోలింగ్ స్లిప్పులు ఇవ్వకపోవడంతో పలు డివిజన్లలో ఓటర్లు ఇబ్బందులు పడ్డారు. ఏ బూత్ లో ఓటు వేయాలో తెలియక..? పోలింగ్ కేంద్రాల్లో చెప్పేవారు లేక వెనుదిరగడం కనిపించింది. గ్రేటర్ బరిలో మొత్తం 1,333 మంది బరిలో నిలిచారు. వీరిలో కేవలం 150 మంది విజేతలుగా నిలువనున్నారు. చాలా ప్రాంతాల్లో పోరు హోరాహోరిగా సాగింది. నువ్వా..? నేనా...? అన్నట్టు అభ్యర్థులు తలపడ్డారు. కొన్ని డివిజన్లలో వ్యక్తులను చూసి ఓటు వేయగా.. మెజార్టీ ప్రాంతాల్లో పార్టీపై అభిమానమే ఎక్కువగా ఓటింగ్కు కారణమైంది. 74,23,980 మంది ఓటర్లకు గాను 27,99,078 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. బుధవారం పూర్తి వివరాలు వెల్లడిస్తామని జీహెచ్ఎంసీ వర్గాలు తెలిపాయి.
శివార్లలో అధికం...
గ్రేటర్ ఎన్నికల్లో శివారు ప్రాంతాల్లో అధిక పోలింగ్ నమోదైంది. కోర్ ఏరియాలో సగటు అటు, ఇటుగా 30-35 శాతం మధ్యలో ఉండగా... శివార్లలో మాత్రం 40-45 శాతంగా నమోదైంది. ఈస్ట్జోన్లోని కాప్రా సర్కిల్లో అత్యధికంగా 48.46శాతం, ఉప్పల్లో-46, ఎల్బీనగర్ (3ఏ)లో- 44.74, ఎల్బీనగర్ (3బీ)లో 39.81శాతం ఉంది. రామచంద్రాపురం సర్కిల్ పరిధిలో మూడు డివిజన్లుండగా అత్యధికంగా 55, కూకట్పల్లి(ఏ)లో 49.28, కూకట్పల్లి(బీ)లో 46.83 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. శేరిలింగంపల్లిలోని రెండు సర్కిళ్ల పరిధిలో వరుసగా 44.33, 38.72 శాతం పోలింగ్ నమోదైంది. కోర్ ఏరియాతో పోలిస్తే ఈసారి శివార్లలో ఎక్కువ మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో రాజకీయ సమీకరణాలపై ఆసక్తి నెలకొంది. గత లెక్కలను పరిశీలిస్తే ఆయా ప్రాంతాల్లో టీడీపీకి గట్టి పట్టున్నట్టు స్పష్టమవుతుంది. విభజన అనంతర పరిణామాల నేపథ్యంలో పరిస్థితుల్లో చాలా వరకు మార్పులొచ్చాయి. అధికార టీఆర్ఎస్ పట్టు పెంచుకున్నట్టు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో శివారు ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారన్న దానిపైనే మేయర్ పీఠం ఎవరు కైవసం చేసుకుంటారన్నది ఆధారపడి ఉంటుంది.
సౌత్ లో లెస్... కోర్లో మరీ తక్కువ...
సార్వత్రిక.. స్థానిక సంస్థ.. ఏ ఎన్నికలైనా అత్యధిక పోలింగ్ నమోదయ్యే సౌతజోన్లో ఈసారి పరిస్థితులు తారుమారయ్యాయి. క్రితం కంటే తక్కువగా 28 శాతం పోలింగ్ మాత్రమే ఇక్కడ నమోదైంది. చార్మినార్ (4ఏ)లో 23.01, చార్మినార్ (4బీ)లో 29.59, సర్కిల్-5లో 30.59 శాతం పోలింగ్ నమోదైంది. ఈ పరిణామాల నేపథ్యంలో పాతబస్తీలో వన్సైడ్గా జరిగే వార్ ఫలితాల్లో మార్పులుండే అవకాశముందని చెబుతున్నారు. తక్కువ పోలింగ్ నమోదైన నేపథ్యంలో ఎంఐఎం నాయకులు ఆందోళన చెందుతున్నారు. తమ పార్టీకి పెట్టని కోటలా ఉన్న ఓల్డ్ సిటీలో ఫలితాలు ఎలా ఉంటాయో అని మదనపడుతున్నారు. అయితే వివిధ సంస్థలు నిర్వహించిన సర్వేల్లో మాత్రం మజ్లిస్కు సీట్లు తగ్గుతాయని, 2009లో 43 స్థానాలతో ఉన్న ఆ పార్టీ ఇప్పుడు 35 సీట్లతోనే సరిపెట్టుకునే అవకాశముందని స్పష్టమవుతోంది. కోర్ ఏరియాలో మరీ తక్కువగా పోలింగ్ నమోదు కావడం గమనార్హం.
శివార్లలో అధికం...
గ్రేటర్ ఎన్నికల్లో శివారు ప్రాంతాల్లో అధిక పోలింగ్ నమోదైంది. కోర్ ఏరియాలో సగటు అటు, ఇటుగా 30-35 శాతం మధ్యలో ఉండగా... శివార్లలో మాత్రం 40-45 శాతంగా నమోదైంది. ఈస్ట్జోన్లోని కాప్రా సర్కిల్లో అత్యధికంగా 48.46శాతం, ఉప్పల్లో-46, ఎల్బీనగర్ (3ఏ)లో- 44.74, ఎల్బీనగర్ (3బీ)లో 39.81శాతం ఉంది. రామచంద్రాపురం సర్కిల్ పరిధిలో మూడు డివిజన్లుండగా అత్యధికంగా 55, కూకట్పల్లి(ఏ)లో 49.28, కూకట్పల్లి(బీ)లో 46.83 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. శేరిలింగంపల్లిలోని రెండు సర్కిళ్ల పరిధిలో వరుసగా 44.33, 38.72 శాతం పోలింగ్ నమోదైంది. కోర్ ఏరియాతో పోలిస్తే ఈసారి శివార్లలో ఎక్కువ మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో రాజకీయ సమీకరణాలపై ఆసక్తి నెలకొంది. గత లెక్కలను పరిశీలిస్తే ఆయా ప్రాంతాల్లో టీడీపీకి గట్టి పట్టున్నట్టు స్పష్టమవుతుంది. విభజన అనంతర పరిణామాల నేపథ్యంలో పరిస్థితుల్లో చాలా వరకు మార్పులొచ్చాయి. అధికార టీఆర్ఎస్ పట్టు పెంచుకున్నట్టు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో శివారు ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారన్న దానిపైనే మేయర్ పీఠం ఎవరు కైవసం చేసుకుంటారన్నది ఆధారపడి ఉంటుంది.
సౌత్ లో లెస్... కోర్లో మరీ తక్కువ...
సార్వత్రిక.. స్థానిక సంస్థ.. ఏ ఎన్నికలైనా అత్యధిక పోలింగ్ నమోదయ్యే సౌతజోన్లో ఈసారి పరిస్థితులు తారుమారయ్యాయి. క్రితం కంటే తక్కువగా 28 శాతం పోలింగ్ మాత్రమే ఇక్కడ నమోదైంది. చార్మినార్ (4ఏ)లో 23.01, చార్మినార్ (4బీ)లో 29.59, సర్కిల్-5లో 30.59 శాతం పోలింగ్ నమోదైంది. ఈ పరిణామాల నేపథ్యంలో పాతబస్తీలో వన్సైడ్గా జరిగే వార్ ఫలితాల్లో మార్పులుండే అవకాశముందని చెబుతున్నారు. తక్కువ పోలింగ్ నమోదైన నేపథ్యంలో ఎంఐఎం నాయకులు ఆందోళన చెందుతున్నారు. తమ పార్టీకి పెట్టని కోటలా ఉన్న ఓల్డ్ సిటీలో ఫలితాలు ఎలా ఉంటాయో అని మదనపడుతున్నారు. అయితే వివిధ సంస్థలు నిర్వహించిన సర్వేల్లో మాత్రం మజ్లిస్కు సీట్లు తగ్గుతాయని, 2009లో 43 స్థానాలతో ఉన్న ఆ పార్టీ ఇప్పుడు 35 సీట్లతోనే సరిపెట్టుకునే అవకాశముందని స్పష్టమవుతోంది. కోర్ ఏరియాలో మరీ తక్కువగా పోలింగ్ నమోదు కావడం గమనార్హం.
Tuesday, February 2, 2016
ఓటరా.. కదలిరా...
ప్రజాస్వామ్యం మనకిచ్చిన అతిపెద్ద అవకాశం ఓటు హక్కు. విద్యాధికులు ఎక్కువున్న మహానగరాల్లో ఆ హక్కు అలక్ష్యానికి గురవు తోంది. చట్టసభల్లో సరే! స్థానిక సంస్థల ఎన్నికల సమ యంలోనూ అదే పరిస్థితి! ముంబై, ఢిల్లీ, బెంగుళూరు, కలకత్తా, పూణె, అహ్మదాబాద్ వంటి మహానగరాల కన్నా హైదరాబాద్లో 2009 జరిగిన గ్రేటర్ ఎన్నికల ప్రకారం పోలైన ఓట్ల సంఖ్య తక్కువనే చెప్పాలి. అలా అని ఆ నగరాల్లో ఎదో పరిస్థితి మెరుగని కాదు. గత గ్రేటర్ ఎన్ని కల్లో పేద, మధ్య తరగతివాసులు నివసించే పత్తర్గట్టీలో 65శాతం ఓట్లు నమోదైతే, చదువుకున్నవారు ఎక్కువగా ఉన్న విజయనగర్కాలనీ వార్డులో కేవలం 25శాతం ఓట్లు పోలవడం ఎలాంటి సంకేతాలు అందిస్తున్నాయనేది పెద్ద ప్రశ్నే. మిగతానగరాల్లో కూడా చదువుకున్నవారి కంటే బస్తీలు, వాడల్లో నివసించేవారు, గ్రామీణ ప్రాంతాల నుంచి వలసవచ్చినవారే నగరాల్లో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని సామాజిక విశ్లేషకులు అంటున్నారు.
అలక్ష్యానికి కారణాలివే...
నగరవాసులు ఓటు హక్కును ఎందుకు వినియోగించుకోవట్లేదు అంటే, వారికి ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదనేది కొంత మంది ప్రచారం చేస్తున్న వాదన. కానీ అది ఏ మాత్రం వాస్తవం కాదు. సరైన పాలకులు...వారు మెచ్చిన నాయకులు లేరనే నిస్పృహే వారిని పోలింగ్ బూతువైపుకు రాకుండా చేస్తుందని చెబుతున్నారు సివిక్ సొసైటీ సభ్యులు డా. రావు చెలికాని. పోలింగ్ రోజంటే సెలవురోజని సంతోషపడుతున్నారేకానీ, దాని మాటున మన జీవితాలను 5ఏళ్లపాటు వారి చేతిలో పెడుతున్నామని గుర్తించాల్సిన అవసరముందంటున్నారు సామాజిక వేత్తలు. తమ ఓటు హక్కును వినియోగించుకోక పోతే అవినీతినాయకులను మనమే ప్రోత్సహించినట్టు లెక్క అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ప్రొ లక్ష్మి. ఏ పార్టీ నాయకుడు నచ్చకపోతే, మరో అవకాశం మనకు కల్పించింది రాజ్యాంగం. అదే నోటా! అంతే కానీ అసలు ఓటు హక్కును అలక్ష్యం చేయడం మాత్రం బాధ్యతగల పౌరులు చేసే పనికాదు.
ప్రశ్నించేందుకు ఒక పేటెంట్
ఎన్నుకున్న నాయకుడు మీ ఆశలు అడియాసలు చేశారు. స్థానిక సమస్యలు గాలికొదిలేశారు. అవినీతే పరమావధిగా ముందుకుసాగుతున్నారు. మనకు తెలి యకుండానే మనల్ని మింగేస్తున్నారు. భరించడమేనా... సహించడమేనా! కాదుగా! నిజాయితీగా నీవేసిన ఓటు నీ బాధ్యతను గుర్తుచేస్తుంది. సహనమనే నల్లమబ్బులను చీల్చేస్తుంది. పిడికిలి బిగించేందుకు శక్తినిస్తుంది. ప్రశ్నించే గొంతుకవుతుంది. సమస్యలపై సమరభేరికి శంఖారావం పూరిస్తుంది. అదే ప్రలోభాలకు గురై, కానుకలకు ఆశ పడి ఓటేస్తే ఆత్మాభి మానాన్ని తాకట్టుపెట్టుకున్నట్టే! అసలు ఓటే వేయకపోతే! ఆత్మాభిమానాన్ని పాతాళానికి తోసినట్టే! అందుకు ఓటు ఓ ఆయుధం. దాన్ని సంధించేందుకు ఓటు హక్కున్న ప్రతి నగరవాసి ఇల్లువదిలి పోలింగ్ బూతు బాట పట్టాల్సిందే!
సిరా చుక్కతో గర్వంగా ఆకాశానికేసి చూడాల్సిందే!
చార్మినార్ సాక్షిగా...మహా నగరం కోసం.వీధి చివర చెత్తకుండీ కంపుకొడుతోంది... ముక్కుమూసుకొని పక్కకు పోవడమేనా సమాధానం!
సర్కారు నల్లా సతాయిస్తుంది... ఇంకెంత కాలం భరించడం!
రోడ్డుపైన గుంతలు రక్తం కళ్ల చూస్తుంటే... ఆ సహనమేల!
వీధుల్లో పొంగిపొర్లుతున్న డ్రైనేజీ పై ఛీత్కారమే పరిష్కారమా!
ఒకటేమిటి...అడుగుకొక సమస్య... అడుగడుగుకో గండం... నగర జీవన పోరాటంలో...
వాటన్నింటినీ ఎదుర్కునే పాశుపతం ఇప్పుడు ఉంది నగరవాసి చేతిలో...
సంధించే సమయమిదే ఓటు అనే ఆయుధంతో...
ప్రజాస్వామ్యమిచ్చిన విలువైన కానుకతోనే...
ప్రశ్నించే హక్కును పేటెంట్గా పొందాల్సిందే...
పాలకులను నిగ్గదీసి అడగాల్సిందే... అంతకుముందు... ఓటు హక్కును సద్వినియోగించుకోవాలి
అలక్ష్యానికి కారణాలివే...
నగరవాసులు ఓటు హక్కును ఎందుకు వినియోగించుకోవట్లేదు అంటే, వారికి ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదనేది కొంత మంది ప్రచారం చేస్తున్న వాదన. కానీ అది ఏ మాత్రం వాస్తవం కాదు. సరైన పాలకులు...వారు మెచ్చిన నాయకులు లేరనే నిస్పృహే వారిని పోలింగ్ బూతువైపుకు రాకుండా చేస్తుందని చెబుతున్నారు సివిక్ సొసైటీ సభ్యులు డా. రావు చెలికాని. పోలింగ్ రోజంటే సెలవురోజని సంతోషపడుతున్నారేకానీ, దాని మాటున మన జీవితాలను 5ఏళ్లపాటు వారి చేతిలో పెడుతున్నామని గుర్తించాల్సిన అవసరముందంటున్నారు సామాజిక వేత్తలు. తమ ఓటు హక్కును వినియోగించుకోక పోతే అవినీతినాయకులను మనమే ప్రోత్సహించినట్టు లెక్క అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ప్రొ లక్ష్మి. ఏ పార్టీ నాయకుడు నచ్చకపోతే, మరో అవకాశం మనకు కల్పించింది రాజ్యాంగం. అదే నోటా! అంతే కానీ అసలు ఓటు హక్కును అలక్ష్యం చేయడం మాత్రం బాధ్యతగల పౌరులు చేసే పనికాదు.
ప్రశ్నించేందుకు ఒక పేటెంట్
ఎన్నుకున్న నాయకుడు మీ ఆశలు అడియాసలు చేశారు. స్థానిక సమస్యలు గాలికొదిలేశారు. అవినీతే పరమావధిగా ముందుకుసాగుతున్నారు. మనకు తెలి యకుండానే మనల్ని మింగేస్తున్నారు. భరించడమేనా... సహించడమేనా! కాదుగా! నిజాయితీగా నీవేసిన ఓటు నీ బాధ్యతను గుర్తుచేస్తుంది. సహనమనే నల్లమబ్బులను చీల్చేస్తుంది. పిడికిలి బిగించేందుకు శక్తినిస్తుంది. ప్రశ్నించే గొంతుకవుతుంది. సమస్యలపై సమరభేరికి శంఖారావం పూరిస్తుంది. అదే ప్రలోభాలకు గురై, కానుకలకు ఆశ పడి ఓటేస్తే ఆత్మాభి మానాన్ని తాకట్టుపెట్టుకున్నట్టే! అసలు ఓటే వేయకపోతే! ఆత్మాభిమానాన్ని పాతాళానికి తోసినట్టే! అందుకు ఓటు ఓ ఆయుధం. దాన్ని సంధించేందుకు ఓటు హక్కున్న ప్రతి నగరవాసి ఇల్లువదిలి పోలింగ్ బూతు బాట పట్టాల్సిందే!
సిరా చుక్కతో గర్వంగా ఆకాశానికేసి చూడాల్సిందే!
చార్మినార్ సాక్షిగా...మహా నగరం కోసం.వీధి చివర చెత్తకుండీ కంపుకొడుతోంది... ముక్కుమూసుకొని పక్కకు పోవడమేనా సమాధానం!
సర్కారు నల్లా సతాయిస్తుంది... ఇంకెంత కాలం భరించడం!
రోడ్డుపైన గుంతలు రక్తం కళ్ల చూస్తుంటే... ఆ సహనమేల!
వీధుల్లో పొంగిపొర్లుతున్న డ్రైనేజీ పై ఛీత్కారమే పరిష్కారమా!
ఒకటేమిటి...అడుగుకొక సమస్య... అడుగడుగుకో గండం... నగర జీవన పోరాటంలో...
వాటన్నింటినీ ఎదుర్కునే పాశుపతం ఇప్పుడు ఉంది నగరవాసి చేతిలో...
సంధించే సమయమిదే ఓటు అనే ఆయుధంతో...
ప్రజాస్వామ్యమిచ్చిన విలువైన కానుకతోనే...
ప్రశ్నించే హక్కును పేటెంట్గా పొందాల్సిందే...
పాలకులను నిగ్గదీసి అడగాల్సిందే... అంతకుముందు... ఓటు హక్కును సద్వినియోగించుకోవాలి
Monday, February 1, 2016
గ్రేటర్ ప్రచారానికి తెర
ఆఖరి రోజు నేతల సుడిగాలి పర్యటనలు
ముమ్మరంగా ప్రచారం నిర్వహించిన పార్టీల ముఖ్య నేతలు
ర్యాలీలు, ప్రదర్శనలు, సభలతో హోరెత్తిపోయిన నగరం
ముమ్మరంగా ప్రచారం నిర్వహించిన పార్టీల ముఖ్య నేతలు
ర్యాలీలు, ప్రదర్శనలు, సభలతో హోరెత్తిపోయిన నగరం
150 డివిజన్లలో 1,333 మంది అభ్యర్థుల పోటీ.. రేపే ఎన్నికలు
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. 15 రోజులపాటు హోరాహోరీగా సాగిన ప్రచార పర్వం ఆదివారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఆఖరి రోజు కావడంతో అన్ని పార్టీల ముఖ్య నేతలు సుడిగాలి పర్యటనలతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు. నగరమంతటా ప్రదర్శనలు, బైక్ ర్యాలీలు హోరెత్తించాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల బాధ్యతను భుజాన వేసుకొని గత నెలరోజులుగా విస్తృతంగా పర్యటనలు, సభల్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్ ఆదివారం కూకట్ పల్లి, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. బీజేపీ నేత, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు రాంనగర్, కొత్తపేట, వనస్థలిపురం తదితర చోట్ల జరిగిన సభల్లో పాల్గొన్నారు. నగరాభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని, కేంద్రం భాగస్వామ్యం లేకుండా తెలంగాణ అభివృద్ధి సాధ్యం కాదని చెప్పారు. మౌలాలీలో చేపట్టిన ప్రచారంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్తోనే
హైదరాబాద్ నగర అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. మల్కాజిగిరిలో టీడీపీ నిర్వహించిన సభలో ఆ పార్టీ నేత రేవంత్రెడ్డి పాల్గొన్నారు. 1,200 మంది త్యాగాల ఫలితంగా తెలంగాణ వచ్చిందని, ఈ రాష్ట్రం కేసీఆర్ జాగీరు కాదని అన్నారు. కూకట్పల్లి, గచ్చిబౌలి, ఆల్విన్ కాలనీ, వివేకానందనగర్ తదితర ప్రాంతాల్లో రోడ్షోలు, బహిరంగ సభల్లో టీడీపీ నాయకుడు నారా లోకేశ్ పాల్గొన్నారు. అడుగడుగునా ర్యాలీలు, ప్రదర్శనలు దారుస్సలాంలోని పార్టీ కార్యాలయం నుంచి పాతబస్తీలోని వివిధ డివిజన్ల మీదుగా చార్మినార్ వరకు ఎంఐఎం భారీ బైక్ ర్యాలీ నిర్వహించింది. టీఆర్ఎస్ బేగంబజార్, గోషామహల్ తదితర చోట్ల ర్యాలీలు నిర్వహించింది. గన్ఫౌండ్రీలో బీజేపీ చేపట్టిన ప్రచారంలో కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ పాల్గొన్నారు. అంబర్పేట్ నియోజకవర్గం, యాప్రాల్లో బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు కిషన్రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. టీఆర్ఎస్ మాటల గారడీలకు మోసపోవద్దని ఓటర్లకు చెప్పారు. బేగంపేట్లో కాంగ్రెస్ ఎంపీ రేణుకాచౌదరి, మర్రి శశిధర్రెడ్డిలు పర్యటించారు. గచ్చిబౌలిలో చేపట్టిన ర్యాలీలో కాంగ్రెస్ నేత మధుయాష్కీగౌడ్ పాల్గొన్నారు. సనత్నగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ మంత్రి తలసాని ప్రచారం నిర్వహించారు.
గౌలిపురాలో సీపీఐ నిర్వహించిన ర్యాలీలో ఆ పార్టీ నేత నారాయణ పాల్గొన్నారు. ఫిబ్రవరి ఐదో తేదీనే తాను సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు సమాధానమిస్తానన్నారు. అడ్డగుట్టలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. చర్లపల్లిలో నిర్వహించిన టీఆర్ఎస్ బహిరంగ సభలో మంత్రి జగదీశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాల్గొన్నారు. కొత్తపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పాల్గొన్నారు. మొత్తమ్మీద గ్రేటర్ హైదరాబాద్లోని 150 డివిజన్లలో పోటీకి దిగిన 1,333 మంది అభ్యర్థుల భవిత్యాన్ని తేల్చే ఎన్నికల గడువు సమీపించడంతో ప్రచారానికి ఆఖరి రోజైన ఆదివారాన్ని సద్వినియోగం చేసుకొనేందుకు అన్ని పార్టీలూ పోటీ పడ్డాయి. మంగళవారం జరిగే పోలింగ్లో ఓటరు మహాశయులు ఏ మీట నొక్కుతారోనని ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి.
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. 15 రోజులపాటు హోరాహోరీగా సాగిన ప్రచార పర్వం ఆదివారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఆఖరి రోజు కావడంతో అన్ని పార్టీల ముఖ్య నేతలు సుడిగాలి పర్యటనలతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు. నగరమంతటా ప్రదర్శనలు, బైక్ ర్యాలీలు హోరెత్తించాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల బాధ్యతను భుజాన వేసుకొని గత నెలరోజులుగా విస్తృతంగా పర్యటనలు, సభల్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్ ఆదివారం కూకట్ పల్లి, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. బీజేపీ నేత, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు రాంనగర్, కొత్తపేట, వనస్థలిపురం తదితర చోట్ల జరిగిన సభల్లో పాల్గొన్నారు. నగరాభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని, కేంద్రం భాగస్వామ్యం లేకుండా తెలంగాణ అభివృద్ధి సాధ్యం కాదని చెప్పారు. మౌలాలీలో చేపట్టిన ప్రచారంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్తోనే
హైదరాబాద్ నగర అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. మల్కాజిగిరిలో టీడీపీ నిర్వహించిన సభలో ఆ పార్టీ నేత రేవంత్రెడ్డి పాల్గొన్నారు. 1,200 మంది త్యాగాల ఫలితంగా తెలంగాణ వచ్చిందని, ఈ రాష్ట్రం కేసీఆర్ జాగీరు కాదని అన్నారు. కూకట్పల్లి, గచ్చిబౌలి, ఆల్విన్ కాలనీ, వివేకానందనగర్ తదితర ప్రాంతాల్లో రోడ్షోలు, బహిరంగ సభల్లో టీడీపీ నాయకుడు నారా లోకేశ్ పాల్గొన్నారు. అడుగడుగునా ర్యాలీలు, ప్రదర్శనలు దారుస్సలాంలోని పార్టీ కార్యాలయం నుంచి పాతబస్తీలోని వివిధ డివిజన్ల మీదుగా చార్మినార్ వరకు ఎంఐఎం భారీ బైక్ ర్యాలీ నిర్వహించింది. టీఆర్ఎస్ బేగంబజార్, గోషామహల్ తదితర చోట్ల ర్యాలీలు నిర్వహించింది. గన్ఫౌండ్రీలో బీజేపీ చేపట్టిన ప్రచారంలో కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ పాల్గొన్నారు. అంబర్పేట్ నియోజకవర్గం, యాప్రాల్లో బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు కిషన్రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. టీఆర్ఎస్ మాటల గారడీలకు మోసపోవద్దని ఓటర్లకు చెప్పారు. బేగంపేట్లో కాంగ్రెస్ ఎంపీ రేణుకాచౌదరి, మర్రి శశిధర్రెడ్డిలు పర్యటించారు. గచ్చిబౌలిలో చేపట్టిన ర్యాలీలో కాంగ్రెస్ నేత మధుయాష్కీగౌడ్ పాల్గొన్నారు. సనత్నగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ మంత్రి తలసాని ప్రచారం నిర్వహించారు.
గౌలిపురాలో సీపీఐ నిర్వహించిన ర్యాలీలో ఆ పార్టీ నేత నారాయణ పాల్గొన్నారు. ఫిబ్రవరి ఐదో తేదీనే తాను సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు సమాధానమిస్తానన్నారు. అడ్డగుట్టలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. చర్లపల్లిలో నిర్వహించిన టీఆర్ఎస్ బహిరంగ సభలో మంత్రి జగదీశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాల్గొన్నారు. కొత్తపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పాల్గొన్నారు. మొత్తమ్మీద గ్రేటర్ హైదరాబాద్లోని 150 డివిజన్లలో పోటీకి దిగిన 1,333 మంది అభ్యర్థుల భవిత్యాన్ని తేల్చే ఎన్నికల గడువు సమీపించడంతో ప్రచారానికి ఆఖరి రోజైన ఆదివారాన్ని సద్వినియోగం చేసుకొనేందుకు అన్ని పార్టీలూ పోటీ పడ్డాయి. మంగళవారం జరిగే పోలింగ్లో ఓటరు మహాశయులు ఏ మీట నొక్కుతారోనని ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి.
Subscribe to:
Posts (Atom)