Thursday, February 4, 2016

రేపు పురానాపూల్‌లో రీపోలింగ్...

హైదరాబాద్‌: రేపు పురానాపూల్‌లో రీపోలింగ్ జరపాలని జీహెచ్ఎంసీ  ఎన్నికల అధికారి జనార్ధన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఘర్షణల వల్ల కొందరు ఓటర్లు ఓటు వేయలేకపోయారు. అఖిలపక్ష నేతల డిమాండ్‌తో ఈసీ రీపోలింగ్‌కు ఆదేశించింది. 36 పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. 34,413 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కౌంటింగ్‌ సమయాన్ని మార్చే అవకాశం ఉంది. 

జీహెచ్‌ఎంసీ ఓట్ల లెక్కింపు రేపు సాయంత్రం 4 గంటలకు వాయిదా:

ఘర్షణల వల్ల కొందరు ఓటర్లు ఓటు వేయలేక పోయినందు వల్ల పురానాపూల్‌ డివిజన్లో రేపు రీపోలింగ్ జరపాలని ఈసీ ఆదేశించింది.దీంతో జీహెచ్‌ఎంసీ ఓట్ల లెక్కింపు రేపు సాయంత్రం 4 గంటలకు వాయిదా వేశారు. పురానాపూల్‌లో రీపోలింగ్‌ కారణంగా ఓట్ల లెక్కింపును వాయిదా వేసినట్లు  ఎన్నికల అధికారులు ప్రకటించారు.

No comments:

Post a Comment