Friday, September 30, 2016

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి:ఈవో


తిరుమల : కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు తెలిపారు. శుక్రవారం తిరుమలలో సాంబశివరావు విలేకర్లతో మాట్లాడుతూ... 2వ తేదీన బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుందని... 3న  ధ్వజారోహణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని చెప్పారు.

మూడో తేదీన స్వామివారికి ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పిస్తారని పేర్కొన్నారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకుర 24 గంటలూ ఘాట్ రోడ్లు తెరచి ఉంటాయని సాంబశివరావు వెల్లడించారు.

Thursday, September 29, 2016

నవరాత్రి స్పెషల్: కొబ్బరి బొబ్బట్టు

నవరాత్రుల్లో ఒక్కోరోజు ఒక్కొక్క స్వీటు చేసి దుర్గా మాతకి నైవద్యం పెడతారు. ఖన్నుల పండుగగా ఉండే ఈ దసరా నవరాత్రుల కోసం అందరూ ఉంత్సాహంగా ఎదురు చూస్తారు. ఖొబ్బరి పూరన్ పోలీ లేదా కొబ్బరి బొబ్బట్ల తయారీ విధానమెలాగో ఈరోజు మీకు చెప్పబోతున్నాము. 



ఈ బొబ్బట్ల తయారెకై కావాల్సినవి కొబ్బరి, మైదా, బెల్లం.నవరాత్రుల్లో ఉత్తర భారత దేశ ప్రజలు ఉపవాసం చేస్తారు. ఊపవాస సమయంలో తీసుకునే ఆహారంలో చాలా నియమాలుంటాయి. మైదా లేదా గోధుమ పిండిని కొంతమంది ఉపవాస సమయంలో తీసుకోరు. 



ఇక ఈ బొబ్బట్టు తయారీ చూద్దామా... ఎంత మందికి సరిపోతుంది-4 వండటానికి పట్టే సమయం-45 నిమిషాలు సామాగ్రి సమకూర్చుకోవడానికి-30 నిమిషాలు. 



కావాల్సిన పదార్ధాలు. 
మైదా-ఒక కప్పు పసుపు-1/4 టీ స్పూను 
నీళ్ళు-ఒక కప్పు 
కొబ్బరి నూనె-ఒక టీ స్పూను
బెల్లం-ఒక కప్పు 
తాజా తురిమిన కొబ్బరి-ఒక కప్పు 
దంచిన ఏలకులు-కొన్ని నెయ్యి 
మరియూ ఉప్పు. 



తయారీ విధానం: 

1. ఒక వెడల్పాటి గిన్నెలో మైదా, ఉప్పు,పసుపు వేసి కొద్ది కొద్దిగా నీళ్ళు కలుపుతూ కలపాలి. పిండి కలిపాకా దానిలో కొబ్బరి నూనె వేసి మరికాస్త కలపాలి.ఈ కలిపిన పిండిని ఒక 15-20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 

2. తాజా కొబ్బరిని తురుముకోవాలి లేదా మిక్సీ ఉపయోగిస్తున్నట్లయితే నీళ్ళు పొయ్యకుండా తురుములాగ చేసుకోవాలి. 

3. ఒక గిన్నెలో నీళ్ళూ తీసుకుని బెల్లం వేసి కరిగేంతవరకూ స్టవ్ మీద పెట్టాలి. 

4. మలినాలుంటే తొలగించడానికి కరిగిన బెల్లం మిశ్రమాన్ని వడకట్టాలి. వడకట్టిన మిశ్రమంలో తురిమిన తాజా కొబ్బరి, దంచి పెట్టుకున్న ఏలకులు వెయ్యాలి. 

5. కొబ్బరి కలిపిన బెల్లాన్ని మరలా పొయ్యి మీద పెట్టి తేమ పోయి దగ్గర పడేంతవరకూ ఉడికించుకోని చల్లారనివ్వాలి. 

6. కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం తీసుకుని ప్యాటీ లాగ చేసి దానిలో కొబ్బరి మిశ్రమాన్ని పెట్టి అంచులు మూసేసి ఉబ్బెత్తుగా లేకుండా మెల్లిగ తట్టాలి.ఇలాగే మిగిలిన పిండితో కూడా చేసుకోవాలి. 

7. ఇప్పుడు చపాతీ వత్తుకునే పీట మీద కొంచం పిండి వేసి ఫిల్లింగ్ చేసి పెట్టుకున్న ప్యాటీలని కాస్త మందంగా బొబ్బట్ల లాగ వత్తుకోవాలి. 

8. పెనం మీద నెయ్యి వేసి వత్తుకున్న బొబ్బట్టుని దోరగా కాల్చుకోవాలి. కాల్చిన బొబ్బట్ల మీద నెయ్యి వేసి సర్వ్ చెయ్యడమే.

Wednesday, September 28, 2016

కొత్తీమీరే కదా అనుకోకండి...

కొత్తిమీరను సాదారణంగా వివిధ ఆహార పదార్దాల తయారిలోను మరియు గార్నిష్ కు ఉపయోగిస్తాము. ప్రతి రిఫ్రిజిరేటర్ లో కొత్తిమీర ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. కొత్తిమీర అత్యధిక వంటకాల్లో ఉపయోగించే ఒక శక్తివంతమైన హెర్బ్ మరియు అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. 



కొత్తిమీరలో థియామైన్ తో సహా అనేక ఖనిజాలు మరియు విటమిన్లు సమృద్దిగా ఉన్నాయి. వాటిలో విటమిన్ సి, విటమిన్ బి,భాస్వరం,కాల్షియం,ఇనుము, నియాసిన్, సోడియం, కెరోటిన్, మొక్క నుంచి తీసిన ద్రవ యాసిడ్, పొటాషియం, కార్బొహైడ్రేట్స్, ప్రొటీన్, ఫ్యాట్, ఫైబర్ మరియు నీరు ఉంటాయి. కొత్తిమీరను ఒక తేలికపాటి మిరియాలతో కలిపి వివిధ వంటకాల్లో ఉపయోగిస్తే ప్రత్యేకమైన రుచి వస్తుంది. కొత్తిమీరకు అయ్యే ఖర్చు చాలా తక్కువ. 



అయితే ఆరోగ్య పరంగా చూస్తే మాత్రం ఇది చాలా విలువైనదిగా ఉంటుంది. ఆహారంలో కొత్తిమీర రుచి మరియు వాసనతో పాటు అనేక వ్యాధుల చికిత్సలో సహాయపడుతుంది. కొకొత్తిమీర ఆకులలో ప్రొటీన్లు, కొవ్వు, మినరల్స్, పీచు, కార్బోహైడ్రేట్లు, నీరు వుంటాయి. మినరల్స్, విటమిన్లు పరిశీలిస్తే వాటిలో విటమిన్ సి, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, కెరోటీన్, ధయామైన్, రిబోఫ్లావిన్, నయాసిన్, సోడియం, పొటాషియం, ఆక్సాలిక్ యాసిడ్ లు వుంటాయి. కొత్తిమీర ఆకు ఎంతో ఉత్తేజాన్నిస్తుంది. టానిక్ ల వలే పనిచేస్తుంది. అవి పొట్ట గడబిడను దూరం చేస్తాయి. బలపరుస్తాయి. మంచి జీర్ణక్రియకు తోడ్పడతాయి. 



తాజా కొత్తిమీరలో దాగున్న ఆరోగ్య రహస్యాలు: డయేరియా తగ్గిస్తుంది: కొత్తిమీరలో ఉండే బోర్నియోల్, లినానోల్, జీర్ణశక్తిని పెంచడంలో, లివర్ సక్రమంగా పనిచేయడానికి డయేరియాను తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. డయోరియాతో బాధపడే వారు కొత్తమీర జ్యూస్ తాగడం వల్ల డయోరియా కంట్రోల్ అవుతుంది. 

చర్మ సమస్యలు నివారిస్తుంది: చర్మాన్ని కాపాడటానికి వాడే రసాయనికి మందులలో కొత్తిమీర ఆకులను వాడతారు. ముఖం పైన ఉండే మొటిమలకు, పొడి చర్మం, నల్లటి మచ్చలను తగ్గిస్తుంది. చర్మాన్ని కాపాడుటకు వాడే మిశ్రమాలలో కొత్తిమీర నుండి తీసిన ద్రావాలను కలపడం వలన, మిశ్రమం యొక్క ప్రభావం రెట్టింపు అవుతుంది. 

బ్లడ్ ప్రెజర్ కంట్రోల్ చేస్తుంది: బ్లడ్ ప్రెజర్ కంట్రోల్ చేస్తుంది:కొత్తిమీరను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల శరీరానికి పాజిటివ్ ఎఫెక్ట్ ను కలిగిస్తుంది. ఇది బ్లడ్ ప్రెజర్ ను కంట్రిబ్యూట్ చేస్తుంది. స్ట్రెస్ తగ్గిస్తుంది. హైపర్ టెన్షన్ తగ్గించుకోవడం వల్ల హార్ట్ సమస్యలుండవు. 

అనీమియా తగ్గిస్తుంది: కొత్తిమీర బ్లడ్ ఫ్యూరిఫైయర్ అంతే కాదు, బ్లడ్ బిల్డర్ కూడా. కొత్తిమీరలో పోషకాలతో పాటు, ఐరన్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల ఇది అనీమీయాను తగ్గిస్తుంది. 
మౌత్ అల్సర్ తగ్గిస్తుంది: కొత్తమీరలో ఉండే ముఖ్యమైన గుణాలు, యాంటీ సెప్టిక్ లక్షణాలు. ఇంకా యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కూడా గాయాలను లేదా నోటి అల్సర్స్ ను తగ్గిస్తుంది. ఉదయం కొత్తిమీరను తినడం వల్ల రోజుకు మూడుసార్లు తింటే మంచి ఫలితం ఉంటుంది. అల్సర్ తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. 

బోన్ హెల్త్ మెరుగుపరుస్తుంది: కొత్తిమీరలో ఉండే క్యాల్షియం, బోన్స్ హెల్త్ ను ప్రోత్సహిస్తుంది. ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులో ఉండే క్యాల్షియం, ఇతర మినిరల్స్, బోన్ హెల్త్ కు సహాయపడుతాయి. డ్యూరబులిటిని పెంచుతాయి. . 

జీర్ణ శక్తిని పెంచుతుంది: కొత్తిమీర ఆహారాన్ని రుచి గానే కాకుండా, జీర్ణక్రియ రేటుని కూడా పెంచును. అంతే కాకుండా జీర్ణక్రియ వ్యాధులను, అజీర్ణం, వాంతులు, వంటి వాటిని తగ్గించును. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడటానికి కొత్తిమీర సహకరిస్తుంది. అలాగే మధుమేహంతో బాధపడేవాళ్లకు కొత్తిమీర మంచి ఔషధం. రక్తంలోని చక్కెర నిల్వల్ని తగ్గిస్తుంది. కొత్తిమీరను ఇష్టపడేవాళ్లు దాని రసం తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. 

కళ్ళ ఆరోగ్యానికి మంచిది: కొత్తిమీర ఎక్కువగా యాంటీ-ఆక్సిడెంట్స్'లను కలిగి ఉండటము వలన కంటికి సంబంధించిన వ్యాధులను రాకుండా ఆపుతుంది. 

చికెన్ పాక్స్ నివారిస్తుంది: కొత్తిమీరలో ఉండే విటమిన్ ఎ, విటమిన్ సి, మరియు ఇతర యాంటీఆక్సిడెంట్స్ కళ్ళు మంచిది, కొత్తిమీరలో ఉండే మినిరల్స్ కారణంగా కంటి సమస్యలను దూరం చేస్తుంది. కళ్ళ అలసటను, ఒత్తిడిని తగ్గిస్తాయి. 

కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది: కొత్తిమీర చాలా యాంటీ-ఆక్సిడేంట్స్'ని కలిగి ఉండటము వలన ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరంలోని కొవ్వు పదార్థాల స్థాయిలను సమన్వయ పరుస్తుంది. కొత్తిమీర ఆకులు హానికరమైన కొవ్వు పదార్థాలను తగ్గించి, ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాల స్థాయిలను పెంచుతుంది.

Tuesday, September 27, 2016

‘500’వ టెస్టులో భారత్ ఘనవిజయం

  • 197 పరుగులతో న్యూజిలాండ్ చిత్తు
  • అశ్విన్‌కు 6 వికెట్లు 30నుంచి కోల్‌కతాలో రెండో టెస్టు

ఎన్ని విజయాలు సాధించినా కొన్ని విజయాలు మాత్రం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. కొన్ని మైలురాళ్లను చేరుకున్నప్పుడు విజయం మాత్రమే ఆనందాన్ని పరిపూర్ణం చేస్తుంది. అది కూడా తమ టెస్టు చరిత్రలో ఆడిన 500వ మ్యాచ్‌లో గెలిస్తే ఉండే సంతోషమే వేరు. కోహ్లిసేన కూడా ఈ ఆనందాన్ని దేశానికి అందించింది. 300, 400 తరహాలోనే 500వ టెస్టులో కూడా భారత్ గెలుపు జెండా ఎగరేసింది. తొలి రెండు రోజుల తడబాటు నుంచి వెంటనే కోలుకొని తమదైన రీతిలో సమష్టిగా సత్తా చాటిన మన జట్టు కాన్పూర్ టెస్టును ఎప్పటికీ మరచిపోలేని విధంగా చిరస్మరణీయం చేసుకుంది. ఓవరాల్‌గా భారత్‌కు ఇది 130వ విజయం కాగా... సొంతగడ్డపై 88వది. స్వదేశంలో భారత్ వరుసగా 12వ మ్యాచ్‌ను ఓటమి లేకుండా ముగించడం మరో విశేషం.

ఒకదాని వెంట మరొకటి రికార్డులు తన ఒళ్లో వచ్చి వాలుతుండగా, బంతి బంతికీ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ గుండెల్లో భయం పుట్టించేలా బౌలింగ్ చేసిన అశ్విన్ చివరి రోజు కూడా తనదైన ముద్ర చూపించి భారత్ గెలుపును ఖాయం చేశాడు. టెస్టులో పది వికెట్లు తీయడం ఇంత సులువా అన్నట్లుగా మరోసారి ఆ ఘనతను తన ఖాతాలో వేసుకుంటూ కివీస్ పతనాన్ని శాసించగా... మరో వైపు జడేజా, షమీ బౌలింగ్ జట్టును ఆధిక్యంలో నిలిపారుు. ఎంతో పట్టుదలతో చివరి వరకు పోరాడినా న్యూజిలాండ్ కోహ్లి సేన ముందు తలవంచింది.

కాన్పూర్: పిచ్‌లో ఏ మాత్రం మాయ లేదు... అంతా మనోళ్ల ప్రతిభే. వికెట్‌లో మంత్రం లేదు... మన బౌలింగ్‌లో ఉన్న పదునే... మన గడ్డపై పిచ్ షరతులు వర్తిస్తాయి లాంటి విమర్శలకు అవకాశం లేకుండా భారత జట్టు తొలి టెస్టులో సాధికారిక విజయాన్ని సాధించింది. ‘స్పోర్టింగ్ పిచ్’ పదానికి అచ్చమైన ఉదాహరణలా కనిపించిన గ్రీన్‌పార్క్‌లో భారత్ ప్రత్యర్థిపై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. ఫలితంగా తమ 500వ టెస్టులో మరచిపోలేని గెలుపును అందుకుంది.

సోమవారం ముగిసిన ఈ మ్యాచ్‌లో భారత్ 197 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది. చివరి రోజు చేతిలో ఆరు వికెట్లతో ఓటమినుంచి తప్పించుకునేందుకు బరిలోకి దిగిన కివీస్ మరో 50.3 ఓవర్లు మాత్రమే పోరాడగలిగింది. తమ రెండో ఇన్నింగ్‌‌సలో ఆ జట్టు 236 పరుగులకు ఆలౌటైంది. ల్యూక్ రోంచీ (120 బంతుల్లో 80; 9 ఫోర్లు, 1 సిక్స్), మిషెల్ సాన్‌ట్నర్ (179 బంతుల్లో 71; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీలు సాధించారు. అశ్విన్ 6 వికెట్లతో చెలరేగగా, షమీ 2 వికెట్లు తీశాడు. ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చిన జడేజాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ విజయంతో మూడు టెస్టుల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో టెస్టు శుక్రవారంనుంచి కోల్‌కతాలో జరుగుతుంది.


తొలి సెషన్: పోరాడిన కివీస్
ఓవర్‌నైట్ స్కోరు 93/4తో చివరి రోజు ఆట ప్రారంభించిన న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ రోంచీ, సాన్‌ట్నర్ భారత బౌలర్లను జాగ్రత్తగా ఎదుర్కొన్నారు. బంతి అనూహ్యంగా టర్న్ కావడంతో పాటు బౌన్‌‌స కూడా అవుతుండటంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డ బ్యాట్స్‌మెన్, పలు మార్లు అవుటయ్యే ప్రమాదంనుంచి తప్పించుకున్నారు. ఈ క్రమంలో రోంచీ 83 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దూకుడుగా ఆడిన అతను ఒక దశలో అశ్విన్‌నూ లెక్క చేయలేదు. అతని బౌలింగ్‌లో తాను ఎదుర్కొన్న 33 బంతుల్లో రోంచీ 37 పరుగులు చేశాడు. అరుుతే ఎట్టకేలకు జడేజా ఈ 102 పరుగుల భాగస్వామ్యానికి తెర దించాడు. స్వీప్ షాట్ ఆడబోరుు రోంచీ వెనుదిరిగాడు. కొద్ది సేపటికే షమీ తన రివర్స్ స్వింగ్‌ను చూపించాడు. వరుస బంతుల్లో అతను వాట్లింగ్ (18), క్రెరుుగ్ (1)లను అవుట్ చేశాడు. మరో వైపు 149 బంతుల్లో సాన్‌ట్నర్ హాఫ్ సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు.

ఓవర్లు: 36, పరుగులు: 112, వికెట్లు: 3
రెండో సెషన్: అశ్విన్ హవా
లంచ్ విరామం తర్వాత కివీస్ ఇన్నింగ్‌‌స ముగియడానికి ఎక్కువ సమయం పట్టలేదు. 43 నిమిషాల్లో జట్టు కథ ముగిసింది. ఒక ఎండ్‌లో పోరాడుతున్న సాన్‌ట్నర్‌ను ముందుగా అశ్విన్ అద్భుత బంతితో అవుట్ చేశాడు. లెగ్‌స్టంప్‌పై పడి అనూహ్యంగా లేచిన బంతి సాన్‌ట్నర్ బ్యాట్‌ను తాకుతూ సిల్లీ పారుుంట్‌లో రోహిత్ చేతుల్లో పడింది. ఆ తర్వాత కొద్ది సేపటికే తనదైన శైలిలో క్యారమ్ బంతులతో సోధి (17), వాగ్నర్ (0)లను పెవిలియన్ చేర్చి చారిత్రక టెస్టులో అశ్విన్ భారత జట్టు విజయాన్ని ఖరారు చేశాడు.

 ఓవర్లు: 14.3, పరుగులు: 31, వికెట్లు: 3
 స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్ : 318
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 262
భారత్ రెండో ఇన్నింగ్స్ : 377/5 డిక్లేర్డ్
న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ : లాథమ్ (ఎల్బీ) (బి) అశ్విన్ 2; గప్టిల్ (సి) విజయ్ (బి) అశ్విన్ 0; విలియమ్సన్ (ఎల్బీ) (బి) అశ్విన్ 25; టేలర్ (రనౌట్) 17; రోంచి (సి) అశ్విన్ (బి) జడేజా 80; సాన్‌ట్నర్ (సి) రోహిత్ (బి) అశ్విన్ 71; వాట్లింగ్ (ఎల్బీ) (బి) షమీ 18; క్రెరుుగ్ (బి) షమీ 1; సోధి (బి) అశ్విన్ 17; బౌల్ట్ (నాటౌట్) 2; వాగ్నర్ (ఎల్బీ) (బి) అశ్విన్ 0; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (87.3 ఓవర్లలో ఆలౌట్) 236.

వికెట్ల పతనం: 1-2; 2-3; 3-43; 4-56; 5-158; 6-194; 7-196; 8-223; 9-236; 10-236.
బౌలింగ్: షమీ 8-2-18-2; అశ్విన్ 35.3-5-132-6; జడేజా 34-17-58-1; ఉమేశ్ 8-1-23-0; విజయ్ 2-0-3-0.
‘టెస్టుల్లో లోయర్ ఆర్డర్ రాణించడం కీలకం. వారు బాగా ఆడితే ప్రత్యర్థిపై మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది. అందుకే దానిని మెరుగుపర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం.  మ్యాచ్ చివరి రోజు రెండో సెషన్ వరకు వెళ్లిందంటే అది న్యూజిలాండ్ ఘనతే. వారి పోరాటపటిమను అభినందించకుండా ఉండలేం. అశ్విన్ అమూల్యమైన ఆటగాడు. చాలా తెలివైనవాడు కూడా. మ్యాచ్‌ను మలుపు తిప్పగల సమర్థుడు. జడేజా కూడా చాలా బాగా ఆడాడు’. - విరాట్ కోహ్లి
5 అశ్విన్ ఒక మ్యాచ్‌లో పది వికెట్లు పడగొట్టడం ఇది ఐదోసారి. అశ్విన్ 37 టెస్టుల్లోనే ఈ ఘనత సాధించగా, భారత బౌలర్లలో హర్భజన్‌కు 68 టెస్టులు పట్టారుు. అనిల్ కుంబ్లే (8 సార్లు) అగ్రస్థానంలో ఉన్నాడు.
19  అశ్విన్ ఇన్నింగ్‌‌సలో 5 వికెట్లు పడగొట్టడం ఇది 19వ సారి.
10 ఈ మ్యాచ్‌లో 10 మందిని ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసి భారత్ తమ గత రికార్డు (9)ని సవరించింది.
12 సొంతగడ్డపై భారత్ వరుసగా 12 మ్యాచ్‌లలో ఓటమిని ఎదుర్కోలేదు. 2012లో ఇంగ్లండ్ చేతిలో ఓడిన తర్వాత ఆడిన 12 మ్యాచ్‌లలో 10 గెలిచి మరో 2 డ్రా చేసుకుంది.