Saturday, July 9, 2016

రోజూ తాగితే అంత బాగుంటుందా..!



హాట్ కాఫీ లేదా టీతో రోజుని స్టార్ట్ చేస్తున్నారా ? వెజిటబుల్స్, ఫ్రూట్స్ అంటే.. ఇష్టపడటం లేదా ? అయితే కొన్ని లైఫ్ స్టైల్ లో మార్పులు, వెజిటబుల్స్, ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల అమేజింగ్ ఔషధ గుణాలు పొందవచ్చని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. 




మన పూర్వీకులు ఎప్పుడూ అనారోగ్యం పాలు అయ్యేవాళ్లు కాదు. అలాగే ప్రస్తుతమున్న ప్రాణాంతక వ్యాధులు కూడా అప్పట్లో కనిపించేది చాలా తక్కువ. ఎందుకు అంటే.. వాళ్లు హెర్బల్ మెడిసిన్స్, కష్టపడి పనిచేసే తత్వం, వెజిటబుల్స్, ఫ్రూట్స్ తీసుకోవడమే కారణం. 

మీకు తెలుసా.. బీట్ రూట్, ఆరంజ్ కలిపి జ్యూస్ చేసే తీసుకోవడం వల్ల.. రకరకాల అనారోగ్య సమస్యలను నివారిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. మరి బీట్ రూట్, ఆరంజ్ జ్యూస్ ఎలా చేయాలి, ఎలాంటి ఫలితాలు పొందుతారో చూద్దాం.. 

కావాల్సిన పదార్థాలు 
బీట్ రూట్ - సగం 
ఆరంజ్ జ్యూస్ అరకప్పు 

జ్యూస్ తయారు చేసేవిధానం 
తాజాగా కట్ చేసిన బీట్ రూట్ ముక్కలను, అరకప్పు ఆరంజ్ జ్యూస్ తో కలిపి మిక్సీలో వేయాలి. జ్యూస్ ని ఒక కప్పులోకి వడకట్టాలి. ఈ జ్యూస్ ని ప్రతిరోజూ ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ కి ముందు తీసుకోవాలి. 



ఈ బీట్ రూట్ మరియు ఆరంజ్ జ్యూస్ రెగ్యులర్ గా తాగడం వల్ల పొందే ఎఫెక్టివ్ బెన్ఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

బ్లడ్ ప్రెజర్:
ఈ న్యాచురల్ జ్యూస్ లో నిట్రిక్ యాసిడ్, విటమిన్ సి ఉంటాయి. ఇవి బ్లడ్ వెజెల్స్, బ్లడ్ ఫ్లోని కంట్రోల్ చేయడానికి సహాయపడి.. హై బ్లడ్ ప్రెజర్ ని తగ్గిస్తాయి.

క్యాన్సర్ నివారణకు:
బీట్ రూట్, ఆరంజ్ జ్యూస్ లో ఫైటో న్యూట్రియంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి.. క్యాన్సర్ తో పోరాడతాయి. ముఖ్యంగా ప్రొస్టేట్, బ్రెస్, పాంక్రియాటిక్ క్యాన్సర్ లను నిరోధిస్తాయి.

బర్త్ డిఫెక్స్:
ఈ రెండింటి మిశ్రమాన్ని గర్భిణీ స్త్రీలు రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల.. బర్త్ డిఫెక్ట్స్ కి దూరంగా ఉంటారు. పొట్టలో శిశువుకి 
విటమిన్ బి, సి, ఫోలేట్ అందించి.. ఎలాంటి డిఫెక్ట్ రాకుండా కాపాడుతాయి.

అల్సర్స్ :
ఈ న్యాచురల్ జ్యూస్ లో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి అల్సర్లు, లోపలి భాగంలో వచ్చే గాయాలను నివారిస్తాయి.

ఇమ్యునిటీ పెంచడానికి:
ఈ హోంమేడ్ జ్యూస్ లో విటమిన్ సి, మాంగనీస్, ఇతర పోషకాలు రిచ్ గా ఉంటాయి. ఇవి శరీరంలో కణాలను బలంగా మార్చి.. ఇమ్యునిటీని స్ట్రాంగ్ అండ్ హెల్తీగా మారుస్తాయి.

అనీమియా:
బీట్ రూట్, ఆరంజ్ జ్యూస్ కాంబినేషన్ రక్తం సత్తాను పెంచుతుంది. ఐరన్ ని గ్రహించే శక్తిని మరింత పెంచుతుంది. దీనివల్ల అనీమియాని అరికట్టవచ్చు.

గుండె సంబంధిత సమస్యలు:
ఈ మిశ్రమం తాగడం వల్ల గుండె సంబంధిత సమస్యల రిస్క్ ని తగ్గిస్తుంది. అలాగే కొలెస్ట్రాల్ చేరకుండా అరికడుతుంది. అలాగే.. కార్డియో వాస్క్యులర్ సిస్టమ్ హెల్తీగా ఉండేలా చేస్తుంది.

Thursday, July 7, 2016

రంజాన్ స్పెషల్


పండుగ రోజు నమాజు చేసిన  తర్వాత ఆలింగనం చేసుకోవడం సంప్రదాయం. అంటే... గుండెను గుండె తాకే సంప్రదాయం. ఆ పలకరింపు చాలా అందమైనది. గుండెతో గుండె మాట్లాడుకునేంత అందమైనది. ముస్లింభాయిలు మతాన్ని ఎంతగా ప్రేమిస్తారో... దేశాన్నీ అంతగా గౌరవిస్తారు.  మన సోదర భారతీయులు అల్లా మాటను తు.చ. తప్పకుండా పాటిస్తున్నారు.  ప్రేమను పంచుతున్నారు. అవును, మన ముసల్మాన్ భాయ్‌లు నిజంగా దిల్‌మాన్ భాయ్‌లు!!
 
ఆ వైపు ఆరేళ్ల పాప... ఈ వైపు చిన్నారి వధువు ‘ఏయ్ ఆగండి’... అరిచింది నాజియా. వాళ్లు పట్టించుకోలేదు. అసలామె మాటే వినిపించు కోలేదు. ఆరుబయట ఆడుకుంటోన్న ఆరేళ్ల పాప నోరు మూసి, తమ బైకు మీద బలవంతంగా కూర్చోబెట్టుకున్నారు. ఆమెను ఎత్తుకుపోవాలని బండి స్టార్ట్ చేశారు. కానీ వారి బండి చక్రాలు ముందుకు కదల్లేదు. ఎందుకంటే వాటికి అడ్డంగా నాజియా నిలబడింది. ఉత్తరప్రదేశ్‌లోని సాఘిర్ ఫాతిమా మొహమ్మదియా బాలికల జూనియర్ కళాశాల విద్యార్థిని నాజియా. ఆరోజు కాలేజీ నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా ఎవరో చిన్నారి ఆక్రందనలు వినిపించడంతో ఠక్కున ఆగింది. ఇద్దరు యువకులు ఓ ఆరేళ్ల పాపను తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. అది చూసిన నాజియా వెంటనే అక్కడికి పరుగుత్తింది. వాళ్లతో పెనుగులాడి, పాపను విడిపించి తీసుకుపోయింది. తల్లిదండ్రులకు అప్పగించి తిరిగి ఇంటికి బయలుదేరింది. దారిలో ఓ చోట పెళ్లి బాజాలు వినిపించాయి. దాంతో ఆమె దృష్టి అటువైపు మళ్లింది. ఆసక్తిగా అటువైపు నడిచింది. పెళ్లి పీటల మీద తన జూనియర్ డింపీని చూసి షాకయ్యింది. తొమ్మిదేళ్ల డింపీకి ఓ ముప్ఫై ఏళ్ల వ్యక్తితో బలవంతంగా పెళ్లి చేస్తున్నారామె తల్లిదండ్రులు. డింపీ కళ్లనీళ్లతో తలవంచుకుని కూర్చుంది. ఆమెనలా చూసి నాజియా మౌనంగా ఉండలేకపోయింది. వెంటనే  ఆమె సమీపంలోని పోలీసులకు విషయాన్ని తెలియజేసింది. వారు వచ్చి పెళ్లి ఆపారు. డింపీ తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి, ఒకేసారి రెండు సాహసాలు చేసిన నజియా గురించి పై అధికారులకు తెలియజేశారు. దాంతో సాహన బాలిక అవార్డు నాజియాను వెతుక్కుంటూ వచ్చింది.
 
కడలిని... దాటించాడు కడుపున జన్మించాడు! చెన్నై నగరం. వర్షం, వరద జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. బైటికి కాలుపెట్టే పరిస్థితి లేక అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు.   అలాంటి సమయంలో కెవ్వున కేక పెట్టింది చిత్ర. ఉలిక్కిపడ్డాడు మోహన్. నెలలు నిండిన కడుపును చేతపట్టుకుని నొప్పితో మెలికలు తిరుగుతోంది చిత్ర. మోహన్ గుండె గుభేల్‌మంది. తన భార్యను ఆస్పత్రికి ఎలా తీసుకెళ్లాలి? తప్పదు. తీసుకెళ్లాలి. వెంటనే చిత్రను తీసుకుని బయటికి వచ్చాడు. కానీ గమ్యం చేరడం అసాధ్యమనిపిస్తోంది. తనకు, తన భార్యకు, ఇంకా భూమి మీద అయినా పడని తన బిడ్డకు అదే ఆఖరు రోజేమో అనిపిస్తోంది. అలా జరగనివ్వొద్దంటూ దేవుణ్ని మనసులోనే ప్రార్థిస్తున్నాడు. అతని ప్రార్థన దేవుడు విన్నాడో తెలీదో కానీ... దేవుడిలా ఒక వ్యక్తి మాత్రం వచ్చాడు. అతడే యూనస్. తన స్నేహితులతో కలిసి చిత్రను లైఫ్‌బోట్‌పైకి ఎక్కించాడు.  నానా తంటాలు పడి చిత్రను ఆస్పత్రికి చేర్చాడు. అతడు పడిన కష్టం వృథాగా పోలేదు. చిత్ర పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డను చేతుల్లోకి తీసుకున్న క్షణమే పేరు పెట్టేసింది. ఆ పేరు... యూనస్.
 
తెగించారు!  విధికి తలవంచారు
యువత తలచుకుంటే చేయలేనిది ఏదీ లేదు అంటారు. అవును నిజమే. యువత తలచు కుంటే ఏమైనా చేయగలదు. ఎదుటివాళ్లను కాపాడటం కోసం తమ ప్రాణాలను సైతం ఇవ్వగలదు. ఆ రోజు నిర్జీవంగా పడివున్న డానిష్, నోమన్‌లను చూసి అందరూ ఈ మాటే అన్నారు. ఏవో కబుర్లు చెప్పుకుంటూ కాల్వకు దగ్గరలో నడుస్తున్నారు డానిష్, నోమన్. అంతలో ఉన్నట్టుండి ఎవరివో అరుపులు వినిపించాయి. మాటలు ఆపి అటువైపు చూశారు. సుమన్ అనే మహిళ. పొరపాటున కాల్వలో పడిపోయినట్టుంది. పైకి రాలేక, ప్రవాహానికి ఎదురీదలేక అవస్థ పడుతోంది. మెల్లమెల్లగా మునిగిపోతోంది. అది చూసి తక్షణం స్పందించారు ఈ మొరాదాబాద్ (యు.పి.) యువకులిద్దరూ. ఎలాగైనా ఆమెను కాపాడాలని ప్రయత్నం చేశారు. కానీ దురదృష్టం... ఆమెను కాపాడలేకపోయారు. పైగా ఆ ప్రయత్నంలో... తమ ప్రాణాలను కూడా కోల్పోయారు. వారి త్యాగం అందరినీ కంటతడి పెట్టించింది. వారి అంత్యక్రియలకు ఆ ఊరి ప్రజానీకం తరలివచ్చింది. మతఘర్షణలకు పేరు మోసిన ఆ ప్రాంతంలో... ఆ ముస్లిం యువకుల అంతిమ యాత్రకు హిందువులు పెద్ద సంఖ్యలో హాజరై అశ్రుతర్పణ ఇవ్వడం విశేషం.
 
నాకెందుకులే అనుకోలేదు ‘నేనున్నాను’ అని వచ్చాడు
 అది ముంబై, లోఖండేమార్గ్‌లోని ఓ కిరాణా షాపు. యజమాని రజనీష్ ఠాకూర్ (36) తన పనిలో నిమగ్నమై ఉన్నాడు. అంతలో ఓ వ్యక్తి షాపులోకి వచ్చాడు. కస్టమర్ అనుకుని ఏం కావాలి అని అడగబోయాడు రజనీష్. కానీ అతడు అడిగే అవకాశం ఇవ్వలేదు. ఒక్కసారిగా రజనీష్ మీద దాడి చేశాడు. చేతిలో ఉన్న కత్తితో కసకసా పొడిచేశాడు. అసలే ఠాకూర్ వికలాంగుడు. దాంతో ఎటూ తప్పించుకోలేక, ప్రాణాలను రక్షించుకునే మార్గంలేక భయంతో మాన్పడిపోయాడు. కాసేపుంటే ప్రాణాలు వదిలేసేవాడే. కానీ అప్పుడే అక్కడికి ఫోన్ రీచార్జ్ చేయించు కోడానికి వచ్చాడు నసీరుద్దీన్ మన్సూరి (65). జరుగుతున్నదాన్ని చూసి నివ్వెరపోయాడు. అయితే భయపడి పారిపోలేదు. మనకెందుకులే అని వెళ్లిపోనూ లేదు. శక్తినంతా కూడదీసుకున్నాడు. నిందితుడికి ఎదురు తిరిగాడు. ప్రాణాలొడ్డి పోరాడి వాణ్ని తరిమేశాడు. రజనీష్‌ని తక్షణం ఆస్పత్రికి తీసుకెళ్లాడు. రక్తం బాగా పోవడంతో ప్రాణాపాయ స్థితిలో పడ్డ రజనీష్‌కి తన రక్తం ఇచ్చాడు. అతడి ప్రాణాలు కాపాడాడు. ఆ కుటుంబం వీధిపాలు కాకుండా నిలిపాడు మన్సూరి.
 
 
స్నేహం అనుకోలేదు...
 బంధం అనుకున్నాడు
‘‘ఏంటీ... సంతోష్ చనిపోయాడా?’’... స్నేహితుడి మరణవార్త వింటూనే విస్తుపోయాడు రజాక్. సంతోష్ తన ప్రాణ స్నేహితుడు. అతడు పోవడమంటే తనలో సగం మరణించినట్టే. అంతటి గాఢ స్నేహం వాళ్లది. అందుకే రజాక్ కళ్లు నీటి చెలమలయ్యాయి. సంతోష్ మరణం ఊహించనిదేమీ కాదు. చాలాకాలంగా ఏదో అంతు చిక్కని వ్యాధితో బాధపడుతున్నాడు. రెక్కాడితే కానీ డొక్కాడని బతుకు. ఇక చికిత్స ఏం చేయించుకుంటాడు? అందుకే వ్యాధిని, అది పెట్టే బాధని సహించడం అలవాటు చేసుకున్నాడు. కానీ రజాక్ మాత్రం స్నేహితుడి స్థితి చూడలేకపోయాడు. తనకు ఉన్నంతలో ట్రీట్‌మెంట్ ఇప్పించాడు. ఎలాగైనా స్నేహితుణ్ని కాపాడుకోవాలని తపించాడు. కానీ అతని ఆశ నిరాశే అయ్యింది. మృత్యువు అతని మిత్రుణ్ని లాక్కెళ్లిపోయింది. విషయం తెలియగానే పరుగు పరుగున వెళ్లాడు రజాక్. మంచమ్మీద విగత జీవిగా పడివున్నాడు సంతోష్. ఆ మంచం పక్కనే దిగులుగా కూర్చుని ఉంది అతడి భార్య. ఆమె కళ్లలో వేదనతో పాటు అంత్యక్రియలు కూడా చేయలేని నిస్సహాయత కనిపించింది. అయినవాళ్లు ఇంకెవరూ లేకపోవడంతో ఆ భారం కూడా తనపైనే వేసుకున్నాడు రజాక్. అతడి నిర్ణయం విని కొందరి నొసలు పైకి లేచాయి. ఓ ముస్లిం, హిందువుకి అంత్యక్రియలు ఎలా చేస్తాడు? ఆ ప్రశ్న అన్ని పక్కల నుంచీ వినిపించినా విననట్టే కదిలాడు రజాక్. క్షణాల్లో పంచె కట్టాడు. కుండ చేతపట్టాడు. హిందూ సంప్రదాయం ప్రకారం అంత్య క్రియలను పూర్తి చేశాడు. నిజమైన స్నేహితుడిగా నిలిచిపోయాడు. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఘటన ఇది.
 

Wednesday, July 6, 2016

చిన్న పిల్లలు తరచూ జబ్బు పడుతున్నారా..?

చిన్న పిల్లలు తరచూ జబ్బు పడుతుంటుంది. చిన్న పిల్లల్లో వ్యాదినిరోధకశక్తి చాలా తక్కువగా ఉంటుంది. వ్యాధినిరోధకశక్తి తక్కువగా ఉండటంతో పాటు, వాతావరణ కాలుష్యం కూడా పిల్లల ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. పిల్లలు జబ్బు పడకుండా, జబ్బు పడిన తర్వాత తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యం మీద అవగాహన కలిగి ఉండాలి. పిల్లల ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలి. 

చిన్న పిల్లలు చాలా త్వరగా అలర్జీలు, ఇన్ఫెక్షన్స్, మరియు ఇతర సాధారణ సమస్యలకు గురి అవుతుంటారు. అజీర్ణంవంటి సమస్యలకు ఎక్కువ గురి అవుతుంటారు . ఇటువంటి సహజమైన వ్యాధులతో పోరాడటానికి తగిన శక్తి సామర్థ్యాలు కలిగి ఉండాలి. వాతావరణంలోని హుముడిటి వల్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. హుముడి వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ కు దారితీస్తుంది. 
పిల్లలకు జబ్బు చేసినప్పుడు, ఇన్ఫెక్షన్స్ సోకకుండా మంచి ఆహారాలు ఇవ్వాలి. 

పిల్లలకు అనారోగ్యం చేసినప్పుడు , ఆయిల్ ఫుడ్స్ ను అందివ్వకూడదు. అలాగే ఎక్కువ ఎక్కువ ఆహారాలకు దూరంగా ఉండాలి. స్ట్రీట్ ఫుడ్స్ కు పూర్తిగా దూరంగా ఉండాలి. 

ఇలాంటి ఆహారాలన్నీ పిల్లలు అనారోగ్యంగా మారడానికి కారణమవుతుంది. ఇన్ఫెక్షన్స్ నుండి తప్పించుకోవాలంటే కొన్ని ఆహారాలను తీసుకోవాలి. 

నీళ్ళు: 
పిల్లలు జబ్బు పడినప్పుడు వారికి వేడినీళ్లు ఎక్కువగా ఇవ్వాలి. అలాగే వారికి వేరుగా ఒక బాటిల్ లేదా గ్లాసును ఉపయోగించాలి. వర్షాకాలంలో హుముడిటికి బాధపడితే శరీరం తేమగా ఉండటానికి తగిన నీళ్ళు ఇవ్వాలి.



ఉడికించిన ఆహారాన్ని ఇవ్వాలి: 
ఆరోగ్యకరమైన ఆహారాలు ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది.ఉడికించిన లేదా గ్రిల్ చేసిన ఆహారాలను ఇవ్వాలి. ఫ్రైడ్ ఫుడ్స్ ను అందివ్వాలి. ఈ ఆహారాలు వారి ఇమ్యూనిటి పవర్ ను పెంచుతుంది. ఇన్ఫెక్షన్స్ నుండి పోరాడటానికి సహాయపుడుతుంది.



యాంటీ ఆక్సిడెంట్స్: 
యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ ను వారి డైట్ లో చేర్చాలి. ఇది పిల్లల్లో వ్యాదినిరోధకశక్తిని పెంచుతుంది ద. దాంతో అన్ని రకాల జబ్బులు నివారించబడుతాయి. వారి రెగ్యులర్ డైట్ లో గార్డ్స్, గుమ్మడి మరియు బెర్రీస్ వంటివి డైట్ లో చేర్చుకోవాలి.



హోం మేడ్ జ్యూస్ లు: 
పిల్లల్లో ఇన్ఫెక్షన్స్ నివారించడానికి హెల్తీ ఫ్రూట్ ఇది. వారికి బయట స్టీట్ ఫ్రూట్ లేదా వెజిటేబుల్ జ్యూసులకు దూరంగా ఉండాలి. దాంతో వాటర్ రిలేటెడ్ సంబందిత సమస్యలను నివారించుకోవచ్చు. .



పండ్లు: 
పండ్లు పిల్లలకు ఆరోగ్యకరమైనవి . దానిమ్మ, అరటి లేదా పీచెస్ వంటివి పిల్లల రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. సిట్రస్ ఫ్రూట్స్ లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది వ్యాదినిరోధకత పెంచుతుంది.



వెజిటేబుల్స్ : 
వెజిటేబుల్స్ పిల్లల్లో ఇన్ఫెక్షన్స్ నివారిస్తుంది. అయితే వెజిటేబుల్స్ ఇచ్చే ముందు వాటి బాగా శుభ్రంగా కడిన తర్వాత ఉపయోగించాలి. వెజిటేబుల్స్ కు ఉపయోగించే పెస్టిసైడ్స్ అత్యంత ప్రమాదకరం..



బాగా ఉడికించిన ఆహారం : 
బాగా ఉడికించిన ఆహారాన్ని పిల్లలకు అందివ్వాలి. పచ్చికూరలు అస్సలు ఇవ్వకూడదు. నాన్ వెజిటేరియన్స్ కు మరింత ముఖ్యం. పచ్చి కూరలు లేదా సరిగా ఉడకనవి అత్యంత ప్రమాదకరం. గుడ్డు చాలా ప్రమాదకరం. .



మాంసాహారాలు: 
పిల్లల్లో ఇన్ఫెక్షన్స్ కు గురిచేసే మరో ఆహారం మాంసాహారం. వీటిని బాగా ఉడికించి పెట్టాలి. గుడ్డు లేదా సీఫుడ్స్ పెట్టకూడదు. ఇవి స్టొమక్ అప్ సెట్ కు గురిచేస్తుంది.



విటమిన్ సి:
ఆరెంజ్ జ్యూస్, కివి వంటి విటమిన్ సి రిచ్ ఫుడ్స్ వారి రెగ్యులర్ డైట్ లో చేర్చాలి. ఇవి వారి వ్యాదినిరోధకశక్తిని పెంచుతాయి .

సప్లిమెంట్: కొన్ని న్యూట్రీషియన్ సప్లిమెంట్ ఇవ్వడం వల్ల వారిలో వ్యాధినిరోధక శక్తిని పెంచి, వ్యాధుల ఎదుర్కొనే శక్తిని అందివ్వడం చాలా అవసరం..

Tuesday, July 5, 2016

కేవలం మూడు వంటింటి పదార్థాలతో.. 7 వ్యాధులకు చెక్..!!

చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు కూడా హాస్పిటల్ కి వెళ్లడం ఇష్టముండదని చెబుతుంటారు. అలాగే చిన్న సమస్య వచ్చినప్పుడు హాస్పిటల్ కి వెళ్తే.. టెస్ట్ లు, స్కానింగ్ లు అంటూ.. ట్రీట్మెంట్ ని కాస్త పెద్దది చేస్తారు. దీంతో.. ఎక్కువ ఖర్చు అవుతుంది. 



ఇటీవల డాక్టర్స్ రాసి ఇచ్చే మందులలో చాలా కెమికల్స్ ఉండటంతో పాటు, మనుషుల శరీరానికి చాలా హాని చేస్తాయి. అంతేకాదు.. ఇవి చాలా కాస్ట్ లీ, పవర్ ఫుల్ అయినవిగా ఉంటున్నాయి. మీకు తెలుసా.. రెగ్యులర్ గా యాంటీ బయోటిక్స్ తీసుకోవడం వల్ల ఇమ్యునిటీ తగ్గుతుంది. దీన్ని చాలా అధ్యయనాలు నిరూపించాయి. 



కాబట్టి.. చాలా వరకు న్యాచురల్ రెమిడీస్ తీసుకుంటూ.. వ్యాధులను నివారించడం, అరికట్టడం ఉత్తమమైన పని. వెల్లుల్లి, పసుపు, లవంగాలలో చాలా అమోఘమైన ఔషధ గుణాలున్నాయి. చేయాల్సిందల్లా ఒక్కటే.. 3 వెల్లుల్లి రెబ్బలు తీసుకుని పేస్ట్ చేయాలి, 2 టీస్పూన్ల పసుపు, 3 లవంగాలు కలిపి.. అన్నింటినీ పేస్ట్ తయారు చేసుకోవాలి. 



ఈ మిశ్రమాన్ని ఒక కప్పు గోరువెచ్చని పాలలో లేదా వేడి నీటిలో కలిపి.. ప్రతి రోజూ రాత్రి తీసుకోవాలి. అంతే.. ఎఫెక్టివ్ హోం రెమెడీ.. అనేక అనారోగ్య సమస్యలను నివారిస్తుంది. ముఖ్యంగా.. 7 వ్యాధులు మీ దరిచేరకుండా కాపాడుతుంది. మరి అవేంటో చూద్దామా..

సైనస్ నివారించడానికి లవంగం, వెల్లుల్లి, పసుపు కలిపిన పదార్థం.. సైనస్ ఇన్ఫెక్షన్ ని క్షణాల్లో నివారిస్తుంది. ముక్కులో ఇబ్బంది పెట్టే మస్కస్ ని.. బయటకు పంపడంలో సహాయపడుతుంది.

గ్యాస్ట్రిక్ నివారిస్తుంది :
ఈ న్యాచురల్ పదార్థం.. పొట్టలో యాసిడ్ ఉత్పత్తిని నివారించి, గ్యాస్ట్రిక్స్, అబ్డామినల్ బ్లోటింగ్, పొట్టనొప్పి నుంచి గ్రేట్ రిలీఫ్ ని అందిస్తుంది.

ఇంటర్నల్ ఇన్ఫెక్షన్స్ :
ఈ న్యాచురల్ మెడిసిన్ లో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉంటాయి. ఇది శరీరంలోపల ఉండే ఇన్ల్ఫమేషన్ ని తగ్గించడంలో సహాయపడుతుంది.

డయాబెటిస్ ఈ న్యాచురల్ పదార్థాలన్నింటిలో ఉండే ఔషధ గుణాలు.. శరీరంలో షుగర్ లెవెల్స్ తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే టైప్ 1 డయాబెటిస్ లక్షణాలను ఎఫెక్టివ్ గా నివారించడానికి సహాయపడుతుంది.

కొలెస్ట్రాల్ లెవెల్స్:
వెల్లుల్లి, లవంగం, పసుపు కాంబినేషన్ శరీరంలో పేరుకున్న ఫ్యాట్ ని బయటకు పంపించేస్తుంది. దీనివల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

బరువు తగ్గడానికి:
ఈ న్యాచురల్ పదార్థం.. రెగ్యులర్ గా తీసుకుంటూ, డైట్, వ్యాయామం ఫాలో అయితే.. బరువు తగ్గడం తేలికవుతుంది. హెల్తీగా ఉంటారు.

అలర్జీలు నివారించడానికి:
ఈ న్యాచురల్ పదార్థాలు న్యాచురల్ యాంటీ బయోటిక్స్ లా పనిచేస్తాయి. రకరకాల చర్మ, శ్వాస సంబంధిత అలర్జీలు నివారించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.









Monday, July 4, 2016

ఇలా చేస్తే పాదాల వాపు, నొప్పి నుంచి తక్షణ ఉపశమనం కలుగుతుందా..?

పాదాల్లో వాపు సమస్య చాలామందిలో వింటూ ఉంటాం. బాడీ టిష్యూస్ లో ఫ్లూయిడ్స్ ఎక్కువ అయినప్పుడు .. పాదాల్లో వాపు వస్తుంది. నిజానికి పాదాల్లో వాపుకి.. రకరకాల కారణాలుంటాయి. అది వాపు వచ్చిన విధానాన్ని బట్టి ఉంటుంది. అయితే.. ఈ సమస్య తరచుగా వస్తుంటే.. సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్ కి హెచ్చరిక అని గమనించాలి.
అలాంటప్పుడు డాక్టర్ ని సంప్రదించి కారణం తెలుసుకోవడం మంచిది. సాధారణంగా హైబ్లడ్ ప్రెజర్ తో బాధపడేవాళ్లు, గర్భిస్త్రీలలో ఎక్కువ పాదాల్లో వాపు కనిపిస్తుంది. అయితే ప్రాణానికేం ప్రమాదం కాదు.. కానీ.. అసౌకర్యంగా ఉంటుంది. నొప్పి కూడా వేధిస్తుంది.

ఇలాంటి సమస్యతో బాధపడేవాళ్లు అనవసరంగా పెయిన్ కిల్లర్స్ వాడటం కంటే.. రెగ్యులర్ గా హోం రెమిడీస్ ని ఫాలో అయితే.. ఖర్చు తక్కువ, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అందులోను ఇవి ఇంట్లోనే లభించే వస్తువులు. మరి పాదాల వాపు తగ్గించే ఎఫెక్టివ్ రెమిడీస్ చూద్దామా..


ఎసెన్షియల్ ఆయిల్ మసాజ్:
ఎసెన్షియల్ ఆయిల్ అంటే లావెండర్ ఆయిల్ లేదా పెప్పరమెంట్ ఆయిల్ తో.. పాదాల వాపు ఉన్నదగ్గర మసాజ్ చేయాలి. ఇది బ్లడ్ సర్క్యులేషన్ ని బాగా మెరుగుపరిచి.. వాపుని తగ్గిస్తుంది.



దురదగొండి ఆకు:
దురదగొండి ఆకుల్లో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి ఎలాంటి నొప్పి, వాపునైనా తేలికగా తగ్గిస్తాయి. 4 నుంచి 5 దురదగొండి ఆకులను ఒక గిన్నె మరుగుతున్న నీటిలో కలపాలి. 5 నుంచి 10 నిమిషాల తర్వాత ఆ నీటిలో కప్పులోకి తీసుకోవాలి. ఈ నీటిని తాగుతూ ఉంటే.. రోజురోజుకీ.. నొప్పితోపాటు, వాపు తగ్గుతూ వస్తుంది.



యాపిల్ సైడర్ వెనిగర్:
ఈ న్యాచురల్ ఇంగ్రిడియంట్ లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది.. పాదాల్లో వాపుని వేగంగా తగ్గిస్తుంది. దీన్ని నీళ్లు, తేనెతో కలిపి తీసుకోవచ్చు. లేదా.. ఒక శుభ్రమైన క్లాత్ తీసుకొని అందులో ముంచి తీసి.. వాపులు ఉన్న ప్రాంతంలో చుట్టుకున్నా మంచి ఫలితం ఉంటుంది.



ఎప్సమ్ సాల్ట్ :
ఇది వాపుని, ఫ్లూయిట్స్ ని తగ్గిస్తుంది. 2 టేబుల్ స్పూన్ల ఎప్సమ్ సాల్ట్ ని ఒక టబ్ గోరువెచ్చని నీటిలో కలిపి.. పాదాలను 15 నుంచి 20 నిమిషాలు నానబెట్టాలి. ఇది చాలా ఎఫెక్టివ్ గా నొప్పిని నివారిస్తుంది.



సింహదంటి ఆకులు:
ఆయుర్వేదంలో ఉపయోగించే సింహదంటి ఆకులతో ఒక కప్పు టీ చేసుకుని తాగడం వల్ల.. వాపు, నొప్పి నుంచి చాలా ఎఫెక్టివ్ గా ఉపశమనం పొందవచ్చు. ఇందులో ఉండే.. గుణాలు.. బ్లడ్ సర్క్యులేషన్ ని మెరుగుపరిచి, నొప్పిని తగ్గిస్తాయి.


నిమ్మ, తేనె:
టేబుల్ స్పూన్ నిమ్మరసం, తేనె ను ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలిపి రోజంతా తాగాలి. ఇందులో ఉండే యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు.. వాపుని తగ్గిస్తాయి. నొప్పి నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి.



ధనియాలు:
పురాతన కాలం నుంచి.. ధనియాలను నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి ఉపయోగిస్తూ వస్తున్నాం. కొన్ని ధనియాలను ఒక గిన్నె నీటిలో ఉడికించాలి. ఈ నీటిని.. రోజంతా తాగుతూ ఉంటే.. గ్రేట్ రిలీఫ్ పొందవచ్చు.