Tuesday, September 27, 2016

‘500’వ టెస్టులో భారత్ ఘనవిజయం

  • 197 పరుగులతో న్యూజిలాండ్ చిత్తు
  • అశ్విన్‌కు 6 వికెట్లు 30నుంచి కోల్‌కతాలో రెండో టెస్టు

ఎన్ని విజయాలు సాధించినా కొన్ని విజయాలు మాత్రం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. కొన్ని మైలురాళ్లను చేరుకున్నప్పుడు విజయం మాత్రమే ఆనందాన్ని పరిపూర్ణం చేస్తుంది. అది కూడా తమ టెస్టు చరిత్రలో ఆడిన 500వ మ్యాచ్‌లో గెలిస్తే ఉండే సంతోషమే వేరు. కోహ్లిసేన కూడా ఈ ఆనందాన్ని దేశానికి అందించింది. 300, 400 తరహాలోనే 500వ టెస్టులో కూడా భారత్ గెలుపు జెండా ఎగరేసింది. తొలి రెండు రోజుల తడబాటు నుంచి వెంటనే కోలుకొని తమదైన రీతిలో సమష్టిగా సత్తా చాటిన మన జట్టు కాన్పూర్ టెస్టును ఎప్పటికీ మరచిపోలేని విధంగా చిరస్మరణీయం చేసుకుంది. ఓవరాల్‌గా భారత్‌కు ఇది 130వ విజయం కాగా... సొంతగడ్డపై 88వది. స్వదేశంలో భారత్ వరుసగా 12వ మ్యాచ్‌ను ఓటమి లేకుండా ముగించడం మరో విశేషం.

ఒకదాని వెంట మరొకటి రికార్డులు తన ఒళ్లో వచ్చి వాలుతుండగా, బంతి బంతికీ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ గుండెల్లో భయం పుట్టించేలా బౌలింగ్ చేసిన అశ్విన్ చివరి రోజు కూడా తనదైన ముద్ర చూపించి భారత్ గెలుపును ఖాయం చేశాడు. టెస్టులో పది వికెట్లు తీయడం ఇంత సులువా అన్నట్లుగా మరోసారి ఆ ఘనతను తన ఖాతాలో వేసుకుంటూ కివీస్ పతనాన్ని శాసించగా... మరో వైపు జడేజా, షమీ బౌలింగ్ జట్టును ఆధిక్యంలో నిలిపారుు. ఎంతో పట్టుదలతో చివరి వరకు పోరాడినా న్యూజిలాండ్ కోహ్లి సేన ముందు తలవంచింది.

కాన్పూర్: పిచ్‌లో ఏ మాత్రం మాయ లేదు... అంతా మనోళ్ల ప్రతిభే. వికెట్‌లో మంత్రం లేదు... మన బౌలింగ్‌లో ఉన్న పదునే... మన గడ్డపై పిచ్ షరతులు వర్తిస్తాయి లాంటి విమర్శలకు అవకాశం లేకుండా భారత జట్టు తొలి టెస్టులో సాధికారిక విజయాన్ని సాధించింది. ‘స్పోర్టింగ్ పిచ్’ పదానికి అచ్చమైన ఉదాహరణలా కనిపించిన గ్రీన్‌పార్క్‌లో భారత్ ప్రత్యర్థిపై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. ఫలితంగా తమ 500వ టెస్టులో మరచిపోలేని గెలుపును అందుకుంది.

సోమవారం ముగిసిన ఈ మ్యాచ్‌లో భారత్ 197 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది. చివరి రోజు చేతిలో ఆరు వికెట్లతో ఓటమినుంచి తప్పించుకునేందుకు బరిలోకి దిగిన కివీస్ మరో 50.3 ఓవర్లు మాత్రమే పోరాడగలిగింది. తమ రెండో ఇన్నింగ్‌‌సలో ఆ జట్టు 236 పరుగులకు ఆలౌటైంది. ల్యూక్ రోంచీ (120 బంతుల్లో 80; 9 ఫోర్లు, 1 సిక్స్), మిషెల్ సాన్‌ట్నర్ (179 బంతుల్లో 71; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీలు సాధించారు. అశ్విన్ 6 వికెట్లతో చెలరేగగా, షమీ 2 వికెట్లు తీశాడు. ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చిన జడేజాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ విజయంతో మూడు టెస్టుల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో టెస్టు శుక్రవారంనుంచి కోల్‌కతాలో జరుగుతుంది.


తొలి సెషన్: పోరాడిన కివీస్
ఓవర్‌నైట్ స్కోరు 93/4తో చివరి రోజు ఆట ప్రారంభించిన న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ రోంచీ, సాన్‌ట్నర్ భారత బౌలర్లను జాగ్రత్తగా ఎదుర్కొన్నారు. బంతి అనూహ్యంగా టర్న్ కావడంతో పాటు బౌన్‌‌స కూడా అవుతుండటంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డ బ్యాట్స్‌మెన్, పలు మార్లు అవుటయ్యే ప్రమాదంనుంచి తప్పించుకున్నారు. ఈ క్రమంలో రోంచీ 83 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దూకుడుగా ఆడిన అతను ఒక దశలో అశ్విన్‌నూ లెక్క చేయలేదు. అతని బౌలింగ్‌లో తాను ఎదుర్కొన్న 33 బంతుల్లో రోంచీ 37 పరుగులు చేశాడు. అరుుతే ఎట్టకేలకు జడేజా ఈ 102 పరుగుల భాగస్వామ్యానికి తెర దించాడు. స్వీప్ షాట్ ఆడబోరుు రోంచీ వెనుదిరిగాడు. కొద్ది సేపటికే షమీ తన రివర్స్ స్వింగ్‌ను చూపించాడు. వరుస బంతుల్లో అతను వాట్లింగ్ (18), క్రెరుుగ్ (1)లను అవుట్ చేశాడు. మరో వైపు 149 బంతుల్లో సాన్‌ట్నర్ హాఫ్ సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు.

ఓవర్లు: 36, పరుగులు: 112, వికెట్లు: 3
రెండో సెషన్: అశ్విన్ హవా
లంచ్ విరామం తర్వాత కివీస్ ఇన్నింగ్‌‌స ముగియడానికి ఎక్కువ సమయం పట్టలేదు. 43 నిమిషాల్లో జట్టు కథ ముగిసింది. ఒక ఎండ్‌లో పోరాడుతున్న సాన్‌ట్నర్‌ను ముందుగా అశ్విన్ అద్భుత బంతితో అవుట్ చేశాడు. లెగ్‌స్టంప్‌పై పడి అనూహ్యంగా లేచిన బంతి సాన్‌ట్నర్ బ్యాట్‌ను తాకుతూ సిల్లీ పారుుంట్‌లో రోహిత్ చేతుల్లో పడింది. ఆ తర్వాత కొద్ది సేపటికే తనదైన శైలిలో క్యారమ్ బంతులతో సోధి (17), వాగ్నర్ (0)లను పెవిలియన్ చేర్చి చారిత్రక టెస్టులో అశ్విన్ భారత జట్టు విజయాన్ని ఖరారు చేశాడు.

 ఓవర్లు: 14.3, పరుగులు: 31, వికెట్లు: 3
 స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్ : 318
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 262
భారత్ రెండో ఇన్నింగ్స్ : 377/5 డిక్లేర్డ్
న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ : లాథమ్ (ఎల్బీ) (బి) అశ్విన్ 2; గప్టిల్ (సి) విజయ్ (బి) అశ్విన్ 0; విలియమ్సన్ (ఎల్బీ) (బి) అశ్విన్ 25; టేలర్ (రనౌట్) 17; రోంచి (సి) అశ్విన్ (బి) జడేజా 80; సాన్‌ట్నర్ (సి) రోహిత్ (బి) అశ్విన్ 71; వాట్లింగ్ (ఎల్బీ) (బి) షమీ 18; క్రెరుుగ్ (బి) షమీ 1; సోధి (బి) అశ్విన్ 17; బౌల్ట్ (నాటౌట్) 2; వాగ్నర్ (ఎల్బీ) (బి) అశ్విన్ 0; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (87.3 ఓవర్లలో ఆలౌట్) 236.

వికెట్ల పతనం: 1-2; 2-3; 3-43; 4-56; 5-158; 6-194; 7-196; 8-223; 9-236; 10-236.
బౌలింగ్: షమీ 8-2-18-2; అశ్విన్ 35.3-5-132-6; జడేజా 34-17-58-1; ఉమేశ్ 8-1-23-0; విజయ్ 2-0-3-0.
‘టెస్టుల్లో లోయర్ ఆర్డర్ రాణించడం కీలకం. వారు బాగా ఆడితే ప్రత్యర్థిపై మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది. అందుకే దానిని మెరుగుపర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం.  మ్యాచ్ చివరి రోజు రెండో సెషన్ వరకు వెళ్లిందంటే అది న్యూజిలాండ్ ఘనతే. వారి పోరాటపటిమను అభినందించకుండా ఉండలేం. అశ్విన్ అమూల్యమైన ఆటగాడు. చాలా తెలివైనవాడు కూడా. మ్యాచ్‌ను మలుపు తిప్పగల సమర్థుడు. జడేజా కూడా చాలా బాగా ఆడాడు’. - విరాట్ కోహ్లి
5 అశ్విన్ ఒక మ్యాచ్‌లో పది వికెట్లు పడగొట్టడం ఇది ఐదోసారి. అశ్విన్ 37 టెస్టుల్లోనే ఈ ఘనత సాధించగా, భారత బౌలర్లలో హర్భజన్‌కు 68 టెస్టులు పట్టారుు. అనిల్ కుంబ్లే (8 సార్లు) అగ్రస్థానంలో ఉన్నాడు.
19  అశ్విన్ ఇన్నింగ్‌‌సలో 5 వికెట్లు పడగొట్టడం ఇది 19వ సారి.
10 ఈ మ్యాచ్‌లో 10 మందిని ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసి భారత్ తమ గత రికార్డు (9)ని సవరించింది.
12 సొంతగడ్డపై భారత్ వరుసగా 12 మ్యాచ్‌లలో ఓటమిని ఎదుర్కోలేదు. 2012లో ఇంగ్లండ్ చేతిలో ఓడిన తర్వాత ఆడిన 12 మ్యాచ్‌లలో 10 గెలిచి మరో 2 డ్రా చేసుకుంది.

No comments:

Post a Comment