Thursday, January 21, 2016

చాముండేశ్వరి దేవాలయం – చిటూకుల్ గ్రామం



మెదక్ జిల్లా చితకుల్ గ్రామం లో సుమారు 30 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ దేవాలయం చాల అందంగా అద్బుతంగా ఉంటుంది.పదకొండు అడుగుల ఏకశిలా అమ్మవారి విగ్రహం శ్రీ చాముండేశ్వరి ఆలయంలో ప్రతిష్టించారు. ఈ ఎత్తులో ఏకశిలా విగ్రహం ఉండడం దేశంలోనే మొదటిదిగా చెప్పవచ్చు. భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారం అమ్మవారు.

ఇక్కడ ప్రతిష్టించిన దేవి ఖడ్గాహస్తము తో దుష్ట శిక్షణ శిష్టా రక్షణ చేస్తూ దివ్యముర్తిగా దర్శనమిస్తుంది. దగ్గరలో ఉన్న మంజీరా నది లో స్నానం చేసి ప్రదిక్షణలు చేసి అమ్మవారని దర్శించుకొన్నారు. ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు చాల ఘనంగా జరుగుతాయి.ప్రతి ఒక్కరు తప్పకుండ దర్సించాల్సిన క్షేత్రం. క్షేత్ర సందర్శన చేసుకొని అమ్మవారి ఆశిస్సులు పొందాలి.
వెళ్ళు మార్గం : జోగిపేట్ నుంచి మెదక్ వెళ్ళే దారిలో ఉంటుంది.

No comments:

Post a Comment