Saturday, January 23, 2016

దుమ్మురేపిన కంగారులు..భారత్ విజయలక్ష్యం

ఆస్ట్రేలియాలోని కాన్ బెర్రా వేధికగా భారత్ తో జరుగుతున్న నాలుగో వన్డేలో తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆసిస్ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 348 పరుగుల భారీస్కొర్ చేసింది.  టాస్ గెలిచిన కెప్టెన్ స్టీవ్ స్మిత్ వెంటనే బ్యాటింగ్ ఎంచుకున్నాడు.



ఓపెనర్లు ఆరోన్ ఫించ్ (107: 107 బంతుల్లో 9x4, 2x6), డేవిడ్ వార్నర్ (93 : 92 బంతుల్లో 12x4,1x6) తొలి వికెట్ కి 29.2 ఓవర్లలో 187 పరుగులు జతచేసి ఆసిస్ భారీ స్కోర్ దిశగా సాగించారు.  తర్వాత వచ్చిన ఆటగాళ్లలో బెయిలీ 10, ఫాల్కనర్ 0 పరుగులతో నిరాశ పరచారు.

ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్ స్కోరు పెంచే క్రమంలో 51 పరుగులు సాధించి, ఇషాంత్ శర్మ బౌలింగ్ లో ఔటయ్యాడు. చివర్లో మాక్స్ వెల్ 41 పరుగులతో మెరుపులు మెరిపించాడు. భారత బౌలర్లల్లో ఇషాంత్ శర్మ 4 వికెట్లు పడగోట్టగా, ఉమేష్ యాదవ్ 3 వికెట్లు తీసుకున్నారు. మరికాసేపట్లో 349 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు భారత ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు.

No comments:

Post a Comment