Saturday, January 23, 2016

భారీగా రేషన్ బియ్యం పట్టివేత

నెల్లూరు జిల్లాలో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తడ మండలం పూడికుప్పం గ్రామంలో పెద్ద మొత్తంలో రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు బుధవారం పట్టుకున్నారు.

సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో రెండిళ్లలో సోదాలు చేశారు. పి.రత్నం అనే వ్యక్తి ఇంట్లో నిల్వచేసిన 22 బస్తాల బియ్యం, మరొకరి ఇంట్లో నిల్వచేసిన 51 బస్తాల బియ్యాన్ని సీజ్ చేశారు. ఇవి ఏపీ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన రేషన్ బియ్యంగా అధికారులు గుర్తించారు. నిందితులపై కేసులు నమోదు చేసి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

No comments:

Post a Comment