Saturday, June 4, 2016

మొటిమలు ఇక మటు మాయం

ముఖంపై ఒక్క మొటిమ వచ్చినా.. అది ముఖం మొత్తం వ్యాపింపజేస్తుంది. మొటిమలు ఎక్కువగా ఏర్పడ్డాయంటే.. ముఖ వర్చస్సు తగ్గిపోయి, జిడ్డుగా మారి.. బయటకు వెళ్లాలంటేనే ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి మొటిమలు నివారించుకోవడానికి రకరకాల మందులు, ఫ్రెండ్స్, బంధువులు చెప్పిన రకరకాల క్రీములు వాడి విసిగిపోయి ఉంటారు.

శరీరంలో ఇంబ్యాలెన్స్ వాతదోషం వల్ల మొటిమలు వస్తాయని ఆయుర్వేదం చెబుతోంది. వాత దోషం ఇంబ్యాలెన్స్ గా ఉంటే.. జీర్ణక్రియ సరిగా ఉండదు. శరీరంలో టాక్సిన్స్ బయటకు వెళ్లవు. దీనివల్ల సెబమ్ ఉత్పత్తి పెరుగుతుంది. అలా మొటిమలు ఏర్పడటానికి కారణమవుతుంది.

ఎన్ని రెమిడీస్ వాడినా.. పరిష్కారం లభించకుండా.. ఇంకా మొటిమలతో బాధపడుతుంటే.. చాలా సింపుల్ టిప్స్ మీ ముందు ఉన్నాయి. ఆయుర్వేదం మీ మొటిమలను పర్మనెంట్ గా తొలగించేస్తుంది. మరి మొటిమలతో పోరాడే.. న్యాచురల్ హెర్బ్స్, అలాగే అందరికీ అందుబాటులో ఉండే.. రెమిడీస్ పై ఒక్క సారి కన్నేయండి. మీ పింపుల్స్ మాయమవడం ఖాయం.


తులసి : ఆధ్మాత్మికంగా ఎంతో విలువ ఇచ్చే తులసి ఆకులో మెడిసినల్ గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మొటిమలు, మచ్చలు తొలగించడానికి ఇది చాలా పవర్ ఫుల్ మెడిసిన్.

ఉపయోగించే విధానం : తులసి ఆకులను నీళ్లు కలుపుతూ.. పేస్ట్ చేసుకోవాలి. ముఖానికి అప్లై చేసి 10 నిమిసాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. వారానికి 4 నుంచి 5 సార్లు ఇలా అప్లై చేయడం వల్ల మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి.


చందనం : ఆయుర్వేదంలో చందనానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఇది స్మూత్ గా మార్చడంతో పాటు, కూలింగ్ నేచర్ కలిగి ఉంటుంది. మొటిమలు నయం చేయడంలో ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

ఉపయోగించే విధానం : కొద్దిగా చందనం తీసుకుని.. రోజ్ వాటర్ మిక్స్ చేసి పేస్ట్ తయారుచేసుకోవాలి. దీన్ని రాత్రి పడుకోవడానికి ముందు మొటిమలపై రాసుకుని రాత్రంతా ఆరనివ్వాలి. ఉదయాన్నే నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. రెగ్యులర్ గా ఈ ప్యాక్ వేసుకుంటే మొటిమలు మాయం అవడమే కాదు.. చర్మం నిగారిస్తుంది.

వేప : ఇండియాలో ఎక్కువగా వేప చెట్లు ఎందుకు ఉంటాయో తెలుసా ? మెడిసినల్ ప్రాపర్టీస్ ఉండటం వల్ల వేప ఎక్కువగా అందుబాటులో ఉండేలా జాగ్రత్త పడ్డారు మన పూర్వీకులు. మొటిమలు, మచ్చలు నివారించడంలో వేప అద్భుతం చేస్తుంది.

ఉపయోగించే విధానం : వేప ఆకులకు నీళ్లు కలుపుతూ పేస్ట్ చేసుకోవాలి. మొటిమలు ఉన్న ప్రాంతంలో ఈ పేస్ట్ అప్లై చేయాలి. 10 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. రెగ్యులర్ గా అప్లై చేయడం వల్ల.. మెరుగైన ఫలితాలు పొందవచ్చు.

నువ్వులు : మొటిమలు, మచ్చలు నివారించడంలో నువ్వులు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. మరోసారి పింపుల్ రాకుండా.. నివారిస్తాయి.

ఉపయోగించే విధానం : రాత్రంతా నువ్వులను నీళ్లలో నానపెట్టాలి. ఉదయాన్నే పేస్ట్ చేసుకోవాలి. దీన్ని మొటిమలు, మచ్చలపై రాసుకోవాలి. 10 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. రెగ్యులర్ గా ఈ ప్యాక్ వేసుకుంటే.. చర్మం క్లియర్ గా మారుతుంది.

పుదీనా : ఘాటైన సువాసన కలిగిన పుదీన ఆకుల్లో మంచి ఫ్లేవర్ మాత్రమే కాదు.. మెడిసినల్ గుణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కూలింగ్, ఆస్ట్రిజెంట్ గుణాలు పింపుల్ నుంచి మంచి రిలీఫ్ ని ఇస్తాయి. కాబట్టి పుదీనా ఆకులను పేస్ట్ చేసి రాసుకుంటే చాలు.. మొటిమలు మాయమవుతాయి.


అలోవెరా ; ఒకప్పుడు ఒక అమ్మాయి చాలా ఎక్కువ మొటిమలతో బాధపడేదట. దీంతో ఆమె దేవుడిని ప్రార్థించిందట. అప్పుడు దేవుడు ఆమెకు అలోవెరాను ప్రసాదించాడట. అలా బ్యూటీ ఎక్స్ పర్ట్ గా అలోవెరా మారిపోయింది.

ఉపయోగించే విధానం : కొద్దిగా అలోవెరా జెల్ తీసుకుని మొటిమలు, మచ్చలపై అప్లై చేయాలి. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల మొటిమలు తగ్గిపోవడమే కాదు.. మళ్లీ రాకుండా చేస్తుంది. అలోవెరా జ్యూస్ తీసుకుని.. గ్లోయింగ్ స్కిన్ పొందవచ్చు.

No comments:

Post a Comment