Thursday, August 18, 2016

పుష్కరాలకు రాఖీ కళ



తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న కృష్ణా పుష్కరాలు ఏడో రోజుకు చేరుకున్నాయి. శ్రావణ పౌర్ణమి కావడంతో రెండు రాష్ట్రాల్లోని పుష్కర ఘాట్లకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే రెండు రాష్ట్రాల్లోని పుష్కర ఘాట్లన్నీ భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. ఇప్పటికే పుష్కర స్నానం చేసిన పలువురు ప్రముఖులు కూడా శ్రావణ పౌర్ణమి సందర్భాన్ని పురస్కరించుకుని మరోసారి పుష్కర స్నానం ఆచరిస్తున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని దంపతులు కొద్దిసేపటి క్రితం పవిత్ర సంగమం వద్ద పెర్రీ ఘాట్లో పుష్కర స్నానం చేశారు.

ఇటు తెలంగాణలో కూడా భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుసగా నాలుగు రోజుల సెలవల తర్వాత రద్దీ కాస్త తగ్గినా.. రక్షాబంధన్ విద్యార్థులకు, కొంతమంది ఉద్యోగులకు హాలిడే కావడంతో.. మళ్లీ ఘాట్లు కళకళలాడుతున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు చూస్తున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో విశాలమైన ఘాట్లలో ఎక్కువమంది వచ్చినా.. ఎలాంటి ఇబ్బంది లేకుండా స్నానం చేస్తున్నారు. పుష్కర ఏర్పాట్లపై జాతీయ ప్రముఖులు కూడా తెలుగు ప్రభుత్వాలపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

No comments:

Post a Comment